India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. క్రోసూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో శనివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి సంజీవరావు ఓ ప్రకటనలో తెలిపారు. 5కంపెనీలు పాల్గొనే ఈ మేళాలో.. రూ.10వేల నుంచి రూ.30వేల వరకు జీతం ఉంటుందని చెప్పారు. పది, డిగ్రీ, డిప్లమా, ఫార్మసీ, పీజీ పూర్తి చేసి.. 18-35ఏళ్లు ఉన్నవారు అర్హులు. SHARE IT.
హస్త కళలను ప్రజలు ఆదరించి కళాకారులను మరింతగా ప్రోత్సహించాలని జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ సూచించారు. నాబార్డ్ ఆధ్వర్యంలో అమరావతి రోడ్డులో ఏర్పాటు చేసిన చేనేత, హస్త కళా ప్రదర్శనను గురువారం ఆయన ప్రారంభించారు. కళాకారుల జీవన స్థితిగతులు మెరుగు పరచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కృషి చేస్తున్నాయని చెప్పారు. అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగే క్రాఫ్ట్ బజార్ను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
➤ నందిగం సురేశ్, మేరుగ నాగార్జునలకు కీలక పదవులు
➤ పల్నాడు: కత్తులతో దాడి చేసుకున్న యువకులు
➤ గుంటూరు: దుగ్గిరాలలో అత్యధిక వర్షపాతం నమోదు
➤ బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం
➤ మంగళగిరి: బాలికను వేధిస్తున్న యువకుడి అరెస్ట్
➤ గుంటూరులో అర్ధరాత్రి మద్యం విక్రయాలు
బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మేరుగు నాగార్జున నియమిస్తూ.. వైసీపీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడిగా నందిగం సురేశ్ను నియమించారు. ఈ నేపథ్యంలో ఇద్దరి నేతలకు జిల్లా వ్యాప్తంగా వైసీపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం సచివాలయంలో అధికారులతో సమీక్ష చేశారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న ఎన్నికల హామీని నెరవేర్చే విధంగా ప్రణాళికలతో పనిచేయాలని ఆయన సూచించారు. నైపుణ్య శిక్షణ శాఖ, ఎంఎస్ఎంఇ డిపార్ట్మెంట్, ఇండస్ట్రీస్, సెర్ప్ శాఖ అధికారులతో సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు.
నూతనంగా ఎంపికైన కార్పొరేషన్ ఛైర్మన్లతో సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. నామినేటెడ్ పదవులు పొందిన నేతలకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలో పదవి అనేది ఒక బాధ్యతని, మనలో ఎక్కడా అహంకారం కనిపించకూడదని, ఏ పదవిలో ఉన్నా ప్రజా సేవకులని గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రజల కంటే మనం ప్రత్యేకం అని భావించకూడదు అని తెలిపారు.
మిర్చి మార్కెట్ యార్డుకు నిన్న 53,149 బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ-నామ్ విధానం ద్వారా 51,038 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, 273, 341. 4884, సూపర్-10 రకాల మిర్చి సగటు ధర రూ.8.500 నుంచి రూ.17,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.8,000 నుంచి 18,000 వరకు లభించింది. ఏసీ కామద్ రకం మిర్చి రూ.9,000 నుండి 16,500 వరకు లభించింది.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో బీ ఫార్మసీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2,4,6వ సెమిస్టర్(రెగ్యులర్) థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 4 మధ్య నిర్ణీత తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని ANU తెలిపింది. సబ్జెక్టు వారీగా పరీక్షల టైం టేబుల్ వివరాలకై విద్యార్థులు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలంది.
అమరావతి సచివాలయంలో వరద భాదితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి చెక్కును మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి సీఎం చంద్రబాబుకు ఖాదర్ ఎక్సపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ జైద్ అఫ్జల్ కాదర్, జీఎంఆర్ పలని అప్పన్ బుధవారం అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5లక్షల రూపాయల చెక్కును నెల్లూరుకు చెందిన మురళీకృష్ణ స్వీట్స్ సంస్థ ప్రతినిధులు అందించారు. అనంతరం చంద్రబాబు వారిని అభినందించారు.
➤ గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా అంబటి
➤ గుంటూరు: రేపు జనసేనలో చేరుతున్నా.. కిలారి
➤ నేడు గుంటూరు జిల్లా నాయకులతో జగన్ సమావేశం
➤ తాడేపల్లి YCP కార్యాలయం వద్ద మాజీ MLAలు
➤ గుంటూరులో జాబ్ మేళా.. ఈ కంపెనీల్లో ఉద్యోగాలు
➤ గుంటూరు: గడ్డపారతో భార్య తల పగలకొట్టిన భర్త
Sorry, no posts matched your criteria.