India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గుంటూరు పోలీస్ కవాత్ మైదానంలో జరుగుతున్న కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుడ్య పరీక్షల్లో సోమవారం 362 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 680 మంది అభ్యర్థులు పరీక్షల్లో పాల్గొన్నారు. ధృవపత్రాలు సక్రమంగా లేకపోవడంతో 102 మంది ఆరంభంలోనే వెనుదిరిగారు. చివరికి 578 మంది అభ్యర్థులకు పలు అంశాల్లో పరీక్షలు నిర్వహించగా 362 మంది ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణత పొందారు. ఎస్పీ సతీశ్ కుమార్, అదనపు ఎస్పీలు పర్యవేక్షించారు.

మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ సతీశ్ కుమార్ అన్నారు. పోలీస్ శాఖ తరఫున అడిషనల్ కార్పస్ ఫండ్ పథకం కింద ఏఎస్ఐ అరుణాచలం కుటుంబ సభ్యులకు రూ.1లక్ష చెక్కును ఎస్పీ అందజేశారు. అలాగే ఏఆర్ఎస్ఐ మాణిక్యరావు కుటుంబ సభ్యులకు కూడా రూ.1లక్ష చెక్కును అందజేశారు. కుటుంబ పెద్దను కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల బాగోగులను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు.

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘nothing like voting, 1 vote for sure’ అనే అంశంపై ఈనెల 23న వ్యాసరచన, వక్తృత్వ, స్లోగన్ రైటింగ్, చిత్రలేఖనం పోటీలను నిర్వహిస్తున్నట్లు గుంటూరు డీఈవో సీవీ రేణుక సోమవారం తెలిపారు. పాత బస్టాండ్ వద్దనున్న ఉర్థూ బాలుర పాఠశాలలో ఉదయం 9.30గంటలకు పోటీలు జరుగుతాయన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు 25న బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందన్నారు.

ప్రపంచ స్కేటింగ్ పోటీల్లో విజయం సాధించి రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అందుకున్న గుంటూరు జిల్లాకి చెందిన జెస్సీరాజ్ను కలెక్టర్ నాగలక్ష్మీ అభినందించారు. సోమవారం కలెక్టరేట్లో జెస్సీరాజ్ను సన్మానించిన ఆమె, భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించి గుంటూరు ఖ్యాతిని పెంపొందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఎస్డీవో నరసింహారెడ్డి పాల్గొన్నారు.

నాగార్జున విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గతేడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో నిర్వహించిన డిగ్రీ కోర్సుల ఫలితాలను విడుదల చేసినట్లు దూరవిద్య పరీక్షల డిప్యూటీ రిజిస్ట్రార్ సయీద్ జైన్ లాబ్దిన్ తెలిపారు. ఫలితాలను సోమవారం వైస్ ఛాన్సలర్ గంగాధరరావు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఫలితాలను www.anucde.info వెబ్సైట్లో పొందుపరిచామని, ఫిబ్రవరి 3లోపు రీవాల్యూవేషన్కు ధరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

గుంటూరులోని బుడంపాడు వద్ద బిడ్డతో సహా తల్లి <<15198194>>రైలు కింద పడిన<<>> ఘటన కలిచివేసింది. అభంశుభం తెలియని తెలియని ఆ చిన్నారి రైల్వే ట్రాక్పై విగత జీవిగా పడి ఉండటం స్థానికుల కళ్లు చెమర్చింది. ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో.. ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుంది అంటూ ఆవేదన చెందారు. అయితే వీరి వివరాలు తెలియరాలేదు. ఆచూకీ తెలిసిన వారు గుంటూరు జీఆర్పీ ఎస్సై 8328018787, పోలీస్ స్టేషన్ 0863 222073 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

పురుగు మందు తాగి విద్యార్థిని మృతి చెందిన ఘటన వేమూరు అంబేడ్కర్ నగర్లో చోటుచేసుకుంది. అంబేడ్కర్ నగర్కు చెందిన బుస్సా రాము రెండవ కుమార్తె మేఘన ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతుంది. మేఘనకు తరచు కడుపునొప్పి రావడంతో ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి బుధవారం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. తల్లిదండ్రులు వైద్య చికిత్స కోసం తెనాలి వైద్యశాలకు తరలించగా ఆదివారం మృతి చెందినట్లు ఎస్ఐ రవి క్రిష్ణ తెలిపారు.

ఈ నెల 20 నుంచి 31వ తేదీ వరకు పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి ఓ.నరసింహారావు వెల్లడించారు. ఈ మేరకు శిబిరానికి సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ నాగలక్ష్మీ ఆవిష్కరించారని తెలిపారు. జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. ప్రతీ మండలంలో రెండు బృందాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తామని, సద్వినియోగం చేసుకోవాలన్నారు.

విజయవాడ నుంచి చెన్నై వెళ్లే నేషనల్ హైవే సమీపంలో బుడంపాడు వద్ద రైల్వే ట్రాక్పై రైలు కిందపడి ఓ మహిళ తన బిడ్డతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటు చేసుకుంది. మృతురాలు లైట్ గ్రీన్ కలర్ టాప్, వంకాయ రంగు ప్యాంటు గల పంజాబీ డ్రెస్ ధరించి ఉందని, పాప సిమెంటు రంగు టీ షర్టు ధరించి ఉన్నదని గుంటూరు GRP సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణరెడ్డి తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కడప బిస్మిల్లా నగర్కు చెందిన షేక్ మొహమ్మద్ అనీష్ అన్సారీ ఉపాధి నిమిత్తం మస్కట్ వెళ్లి గుండెపోటుతో మరణించాడు. మృతదేహాన్ని తెప్పించేందుకు సాయం చేయాలని SM ద్వారా ఓ వ్యక్తి మంత్రి లోకేశ్కు విన్నవించుకున్నారు. స్పందించిన లోకేశ్ ‘జీవనోపాధి కోసం మస్కట్ వెళ్లిన అన్సారీ మృతి చెందటం అత్యంత బాధాకరం. వారిని స్వదేశానికి రప్పించేందుకు సాధ్యమైన ఏర్పాట్లు చేస్తాం. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలి అని’ అన్నారు.
Sorry, no posts matched your criteria.