Guntur

News May 5, 2024

గుంటూరులో భారీగా పట్టుబడ్డ బంగారం

image

జిల్లాలో శనివారం ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో రూ.18,30,000ల విలువ గల 278.9 గ్రాముల బంగారం జప్తు చేశామన్నారు. మంగళగిరి పరిధిలో 0.75 లీటర్ల మద్యం, తెనాలి పరిధిలో రూ.2,00,000 నగదు సీజ్ చేశామన్నారు. జిల్లాలో మే 4వ తేది సాయంత్రం వరకు రూ.2,99,83,697 విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు తెలిపారు.

News May 5, 2024

గుంటూరులో భర్తను హత్య చేయించిన భార్య

image

ప్రేమ్ కుమార్ కనిపించడం లేదని అతని భార్య మూడు రోజుల క్రితం కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టగా నిర్గాంత పోయే విషయాలు వెలుగు చూశాయి. ప్రేమ్ కుమార్‌ను అతని భార్య వేరే వ్యక్తితో సాన్నిహిత్య సంబంధం పెట్టుకొని భర్త అడ్డు తొలగించుకోవాలని పథకం రచించింది. ఆమె ప్రియుడు వారం రోజుల క్రితం ప్రేమ్ కుమార్‌కు మద్యం తాపించి హత్య చేసినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు.

News May 5, 2024

గుంటూరు రైల్వే డివిజన్లో నిలిచిన పలు రైళ్లు

image

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో నల్గొండ-పగిడిపల్లి మార్గంలో శనివారం పలు రైళ్లు నిలిచిపోయాయి. చెన్నై ఎక్స్ ప్రెస్(12603), సికింద్రాబాద్ నుంచి వస్తున్న ప్రత్యేక రైలు(00632)కు విద్యుత్తు సరఫరా అయ్యే పాంటూలు (మెయిన్ లైన్ నుంచి రైలుకు విద్యుత్ సరఫరా చేసే పరికరం) విరిగిపోవడంతో.. విష్ణుపురం స్టేషన్లో అకస్మాత్తుగా ఆగిపోయాయి. విరిగిన పరికరాలను బాగు చేసిన తర్వాత ఆ రైళ్లు అక్కడి నుంచి కదిలాయి.

News May 5, 2024

రాజకీయ ప్రకటనలకు అనుమతి తప్పనిసరి: జిల్లా కలెక్టర్

image

మే 12, 13 తేదీల్లో ప్రచురించే రాజకీయ ప్రకటనలకు మీడియా సర్టిఫికేషన్ కమిటీ అనుమతి తప్పనిసరి అని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ చెప్పారు. ముందస్తు అనుమతి లేకుండా పోలింగ్ రోజు, పోలింగ్‌కు ముందు రోజు ప్రింట్ మీడియాలో ఎలాంటి రాజకీయ ప్రకటనలను ప్రచురించకూడదని చెప్పారు. ఎన్నికల సందర్భంగా గతంలో ప్రింట్ మీడియాలో అభ్యంతరకరమైన, తప్పుదారి పట్టించే ప్రకటనలు ప్రచురితమయ్యాయని గుర్తుచేశారు.

News May 4, 2024

పల్నాడు: సమస్యాత్మక నియోజకవర్గాల్లో వెబ్ కాస్టింగ్

image

పల్నాడు జిల్లాలో సమస్యాత్మక నియోజకవర్గాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. వీటిలో గురజాల, వినుకొండ, పెదకూరపాడు, మాచర్ల నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో పోలింగ్ రోజున ప్రత్యేక సీఆర్పిఎఫ్ బలగాలు అదనంగా ఉంటాయన్నారు. అలాగే వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు ఎన్నికల సరళిని పర్యవేక్షించేందుకు లైవ్ టెలికాస్ట్ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఈసీ తెలిపింది.

News May 4, 2024

6న మాచర్లకు సీఎం జగన్

image

సీఎం జగన్ ఈ నెల 6న మాచర్లలో పర్యటించనున్నట్లు వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు పిన్నెల్లి వెంకట రామిరెడ్డి శనివారం తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరగబోయే ‘మేమంతా సిద్ధం’ సభకు సీఎం వస్తున్నారని చెప్పారు. ఈ సభలో కార్యకర్తలు, నాయకులు విచ్చేసి సభను జయప్రదం చేయాలని కోరారు.

News May 4, 2024

రేపల్లె చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

image

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపల్లె చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ఎంపీ అభ్యర్థి కృష్ణ ప్రసాద్ బొకేలు అందజేసి ఘన స్వాగతం పలికారు. పవన్‌ను చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు హెలిప్యాడ్ వద్దకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం ఆయన రేపల్లెలో జరగనున్న సభా ప్రాంగణం వద్దకు బయలుదేరారు.

News May 4, 2024

మాచర్ల: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిపై వేటు

image

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుమ్మడి కోటేశ్వరరావును పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ పాక వెంకట సత్యనారాయణ శనివారం తెలిపారు. పార్టీ నియమావళికి వ్యతిరేకంగా మాచర్ల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడంతో పాటు నామినేషన్ ఉపసంహరించుకోవాలని పలుమార్లు సూచించినప్పటికీ నామినేషన్ వెనక్కితీసుకోకపోవడంతో బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.

News May 4, 2024

తాడేపల్లి బైపాస్‌లో డ్రగ్స్ కలకలం

image

తాడేపల్లి బైపాస్‌లో శనివారం డ్రగ్స్ కలకలం రేపాయి. ఓ కాలేజీ విద్యార్థుల నుంచి రూ.5 లక్షల విలువైన 80 గ్రాముల డ్రగ్స్‌ను సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డ్రగ్స్ కలిగి ఉన్న విద్యార్థులను అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 4, 2024

గుంటూరు జిల్లాలో ఎంత మంది ఓటేశారో చూసేయండి..!

image

గుంటూరు జిల్లాలో శుక్రవారం జరిగిన హోం ఓటింగ్ ప్రక్రియలో 2వేలకు పైగా దరఖాస్తులు రాగా.. 1,011 మంది ఓటేశారు. తాటికొండలో 449 మంది దరఖాస్తు చేసుకోగా 122మంది ఓటేశారు. మంగళగిరిలో 452కు 151, పొన్నూరులో 284కు 114 , తెనాలిలో 352కు 166, ప్రత్తిపాడులో 367 కు 200, గుంటూరు పశ్చిమలో 247 కు 187, గుంటూరు తూర్పులో 79 మంది దరఖాస్తు చేసుకోగా 72 మంది ఓటేశారని ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు తెలిపారు.