Guntur

News September 24, 2024

స్వర్ణాంధ్ర విజన్ @ 2047ని సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

image

స్వర్ణాంధ్ర విజన్@2047 ప్లాన్ ద్వారా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ పిలుపునిచ్చారు. స్మార్ట్ ఫోన్ నుంచి swarnandhra.ap.gov.in/Suggestions లింక్‌తో వచ్చే QR కోడ్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పారు. 1.పేరు, 2.ఫోన్ నంబర్‌ 3.OTP, 4.జిల్లా పేరు, 5.వయసు, 6.లింగం, 7.వృత్తి, 8.ఇ-మెయిల్ చిరునామాను నమోదు చేయాల్సి ఉంటుందన్నారు.

News September 24, 2024

నందం అబద్ధయ్య నేపథ్యం ఇదే..

image

మంగళగిరికి చెందిన టీడీపీ నేత నందం అబద్ధయ్య పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమిస్తున్నట్లు సీఎం చంద్రబాబు మంగళవారం ప్రకటించారు. చేనేత సామాజిక వర్గానికి చెందిన అబద్ధయ్య తొలి నుంచి టీడీపీలోనే కొనసాగుతున్నారు. గతంలో మంగళగిరి మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్‌గా చేసి నేడు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారు. మంగళగిరిలో లోకేశ్ విజయంలోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు.

News September 24, 2024

నకరికల్లు: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

image

గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో కీలం రామయ్య 41 అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మంగళవారం తెల్లవారుజామున అద్దంకి-నార్కెట్ పల్లి రాష్ట్ర రహదారిపై చోటు చేసుకుంది. తెల్లవారుజామున మూడున్నర గంటలకు పోలీస్ పెట్రోలింగ్ వాహనం తిరుగుతున్న సమయంలో మృతదేహాన్ని గమనించారు. కాగా మృతుడు పిడుగురాళ్లలోని సున్నం మిల్లులో పనిచేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 24, 2024

నగరంపాలెం: పెళ్లికి పిలవలేదన్న స్నేహితుడిపై దాడి

image

పెళ్లికి పిలవలేదని అడిగిన స్నేహితుడిని చితక్కొట్టిన ఘటనపై నగరంపాలెం పోలీసు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాలు.. వికలాంగుల కాలనీకి చెందిన సాయికుమార్‌కు అదే ప్రాంతానికి చెందిన నాగరాజు స్నేహితుడు. కొద్దిరోజుల క్రితం నాగరాజు వివాహమైంది. తనను పెళ్లికి పిలవలేదని సాయికుమార్ ప్రశ్నించారు. బంధువులందరి ముందు అడుగుతావా అంటూ గొడవ పెట్టుకున్న నాగరాజు కర్రతో కొట్టాడని సాయి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News September 24, 2024

మంగళగిరి: ఉన్నతాధికారులతో లోకేశ్ సమీక్ష

image

నైపుణ్యాభివృద్ధి శాఖపై మంత్రి నారా లోకేశ్ సమీక్ష నిర్వహించారు. మంగళవారం సంబంధిత శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమీక్ష ఉన్నందున ఉండవల్లిలోని నివాసంలో ముందస్తుగా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నైపుణ్యాభివృద్ధి శాఖ చేపడుతున్న అనేక కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు. స్కిల్ సెన్సెస్ యాప్ పై చర్చించిన లోకేశ్ పైలెట్ ప్రాజెక్టు కింద మంగళగిరి ప్రాంతాల్లో నైపుణ్యగణన చేపట్టాలని ఆదేశించారు.

News September 24, 2024

అమరావతి: చేనేత జౌళి శాఖపై మంత్రి సమీక్ష

image

చేనేత, జౌళి శాఖాధికారులతో సోమవారం సమీక్షా సమావేశాన్ని సచివాలయం నాలుగో బ్లాక్‌లో రాష్ట్ర బీసీఈడబ్ల్యూఎస్ ఆ శాఖ మంత్రి ఎస్.సవితమ్మ సమీక్ష సమావేశం నిర్వహించారు. చేనేత కార్మికులు పరిశ్రమలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి మంత్రి అధికారులతో చర్చించారు. చేనేత కార్మికుల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని మంత్రి అధికారులకు సూచించారు.

News September 23, 2024

అమరావతి: మైనార్టీ సంక్షేమ శాఖపై సీఎం సమీక్ష

image

మైనారిటీ సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సోమవారం వెలగపూడి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మైనారిటీ సంక్షేమ పథకాల రీస్ట్రక్చర్ చేయాలని ఆదేశించారు. కడప హజ్ హౌస్, గుంటూరు క్రిస్టియన్ భవన్ పూర్తి చేయాలన్నారు. నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ఇమామ్ లకు, మౌజన్ లకు రూ.10, రూ. 5 వేలు గౌరవ వేతనం ఇవ్వాలాన్నారు. భూముల అభివృద్దికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News September 23, 2024

విజన్-2047 ప్లాన్‌పై అభిప్రాయాలను అందించండి: కలెక్టర్

image

స్వర్ణాంధ్ర విజన్-2047 ప్లాన్‌పై ప్రభుత్వానికి సూచనలు, అభిప్రాయాలను అందజేయాలని కలెక్టర్ అరుణ్ బాబు పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ.. స్మార్ట్ ఫోన్ నుంచి http://swarnandhra.ap.gov.in/Suggestions. లింక్‌తో వచ్చే QR కోడ్‌ ద్వారా పాల్గొనాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోతో పాటు సంతకంతో కూడిన సర్టిఫికేట్‌ను స్వీకరించాలన్నారు. QR కోడ్‌ని స్కాన్ చేసే సలహాలు అందించాలని చెప్పారు.

News September 23, 2024

అమరావతి: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే

image

సీఎం చంద్రబాబు సోమవారం కార్యక్రమ వివరాలను సీఎం కార్యలయ అధికారులు విడుదల చేశారు. 12 గంటలకు చంద్రబాబు సచివాలయం చేరుకొని లా అండ్ జస్టిస్, మైనారిటీ శాఖపై సమీక్ష చేస్తారు. మధ్యాన్నం 3.30 గంటల నుంచి వరుసగా యూత్ అండ్ స్పోర్ట్స్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్ టైల్స్ శాఖ, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమంపై రివ్యూ చేస్తారని అధికారులు తెలియజేశారు.

News September 23, 2024

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళం

image

వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎంప్రెడా మైన్స్ అండ్ మినరల్స్ ఛైర్మన్ ఏఎస్ విక్రమ్ రూ.కోటి విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం చంద్రబాబును కలిసి ఆ చెక్కును అందజేశారు. కష్టాల్లో ఉన్న వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన విక్రమ్‌ను చంద్రబాబు అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.