India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కార్తీక మాసం స్నానం ఆచరించే భక్తులు నదీ తీర ప్రాంతాల దగ్గర అప్రమత్తంగా ఉండాలని పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాసరావు సూచించారు. భక్తులు ఒంటరిగా వెళ్లకూడదని, దొంగల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. తెల్లవారుజాము నుంచే పొగమంచులో శైవ ఆలయాలకు, నదీ తీర ప్రాంతాలు, అతి వేగంగా ప్రవహించే కాలువలు, వంకలు లోతుగా ఉన్న చెరువుల వద్ద చిన్నారులు, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు.
దేశభద్రత, సమాజ రక్షణ కోసం అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు మరిచిపోలేనివని పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. సమాజ శ్రేయస్సుకై అహర్నిశలు పోరాడి అమరులైన పోలీసుల త్యాగనిరతికి క్యాండిల్ ర్యాలీ నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మందు బాబులను తమ షాపులకు రప్పించుకునేందుకు నిర్వాహకులు కొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీపావళి సందర్భంగా చెరుకుపల్లి మండలం గుళ్లపల్లిలో ఓ వైన్షాపు వద్ద ఓ ఆఫర్ ప్రకటించారు. రూ.1000 అంతకంటే ఎక్కువ కొనుగోలు చేసిన వారికి శనివారం లాటరీ తీసి 10మంది సభ్యులకు రూ.200విలువ గల బాటిల్ బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించారు.
పిట్టలవానిపాలెం మండలంలోని అల్లూరు గ్రామం నత్తలవారిపాలెంలో పండుగ రోజు విషాదఛాయలు అలుముకున్నాయి. అల్లూరు గ్రామానికి చెందిన వజ్రమ్మ, ఆమె కూతురు శిరీష నెల్లూరు జిల్లా కావలిలో గురువారం తెల్లవారు జామున రైల్వే ట్రాక్ దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో అల్లూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఫిలిం స్టడీస్ విభాగంలో ప్రవేశాలకు నవంబర్ 2 చివరి తేదీ అని కోర్స్ కో-ఆర్డినేటర్ మధుబాయి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ యువతకు ఫిలిం మేకింగ్ పూర్తి స్థాయిలో అకడమిక్ జ్ఞానాన్ని అందించే ఉద్దేశంతో ప్రారంభించినట్లు చెప్పారు. ఆసక్తిగల వారు ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.
వైసీపీ నేత బోరుగడ్డ అనిల్కు= శ్రీకాకుళం ఫస్ట్ క్లాస్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కోర్ట్ జడ్జీ భరణి 7 రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై గతంలో అనిల్ చేసిన విమర్శలపై కేసు నమోదవ్వడంతో పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. ఈ నేపథ్యంలో భరణి రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. ఓ వ్యక్తిని బెదిరించిన కేసులో ఇప్పటికే అనిల్ రాజమండ్రి జైలులో ఉన్నారు.
గుంటూరు మార్కెట్ యార్డుకు దీపావళి పండుగను పురస్కరించుకొని గురువారం సెలవు ప్రకటించినట్లు యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి వినుకొండ ఆంజనేయులు తెలిపారు. శుక్రవారం యార్డులో యథావిధిగా క్రయ విక్రయాలు జరుగుతాయని చెప్పారు. శని, ఆదివారం సాధారణ సెలవులు ఉంటాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రైతుల మిర్చి యార్డుకు సరుకు తీసుకురావద్దని చెప్పారు.
గుంటూరు జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఉదయం 6:45 గంటలకు గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ‘ఐక్యత పరుగు'(రన్ ఫర్ యూనిటీ) నిర్వహించనున్నట్లు ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఈ ఐక్యత పరుగులో పాల్గొనవచ్చునని ఎస్పీ సూచించారు. ‘ప్రతి ఒక్కరూ సమానులే’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన పాలక మండలి 24 మంది సభ్యులతో ఏర్పాటు కానుంది. ఈ మేరకు టీటీడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇందులో మంగళగిరికి చెందిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, చేనేత కుటుంబానికి చెందిన తమ్మిశెట్టి జానకి దేవికి చోటు దక్కింది. ఆమెను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలిగా నియమించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం ఛైర్మన్, మెంబర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మన్గా బీఆర్ నాయుడును నియమించగా, ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి TTD సభ్యుడిగా మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి నియమితులయ్యారు. జంగా కృష్ణమూర్తి ఇటీవలే వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.