India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందిన సంఘటన శావల్యాపురం మండలం కారుమంచిలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. గ్రామంలోని పెట్రోల్ బంక్ వద్ద కూలీలతో వెళుతున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 12 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో పదిమందికి గాయాలైనట్లు సమాచారం. గాయపడిన వారిని 108 ద్వారా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
మంగళగిరి బరిలో 40 మంది అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాగా, నారా లోకేశ్, మురుగుడు లావణ్య మధ్యే ప్రధానంగా పోటీ ఉండనుంది. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న లోకేశ్.. గెలుపుపై ధీమాగా ఉన్నారు. భారీ మెజార్టీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతానని అంటున్నారు. 50 వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుస్తానని లోకేశ్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎంత మెజార్టీతో గెలుస్తారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
మే డే సందర్భంగా గుంటూరు మిర్చియార్డుకు బుధవారం సెలవు ప్రకటించినట్లు యార్డు అధికారులు తెలిపారు. సెలవు కారణంగా బుధవారం యార్డులో క్రయవిక్రయాలు జరగవని రైతులు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు. సోమవారం మొత్తం 90,353 మిర్చి బస్తాలను యార్డుకు రైతులు తరలించారని, ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో కొంత మేరకు క్రయవిక్రయాలు తగ్గాయని అధికారులు తెలిపారు.
గుంటూరు వెస్ట్ అసెంబ్లీకి నామినేషన్ వేసే సమయంలో స్వతంత్ర అభ్యర్థి విడదల రజనిని నిర్బంధించారంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ ముగిసింది. విడదల రజని, ఆమె భర్త సోమవారం హైకోర్టు విచారణకు హజరై.. తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పారు. బంధువుల ఇంట్లో ఉన్నామని చెప్పగా.. కోర్టు విచారణ మూసేసింది. కాగా, ఎస్సీ మహిళ రజనిని అపహరించారని గుంటూరుకు చెందిన అస్మతుల్లా వ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే.
నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యంకు ఎన్నికల కమిషన్ గ్లాస్ టంబ్లర్ పోలిన గుర్తు కేటాయించింది. మంగళగిరి, చిలకలూరిపేట అసెంబ్లీ స్థానాల్లో సుబ్రహ్మణ్యం పోటీకి సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో గాజు గ్లాసును పోలిన గుర్తు కోసం దరఖాస్తు చేసుకోగా ఆయన అభ్యర్థనకు ఎన్నికల అధికారులు అంగీకరించారు. సోమవారం మధ్యాహ్నం రిటర్నింగ్ అధికారి రాజకుమారి గుర్తు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
జిల్లాలో సోమవారం ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు ముమ్మరం చేశాయి గుంటూరు తూర్పులో 1.26 లీటర్ల మద్యం, రూ.54,700 నగదు జప్తి చేశామన్నారు. తెనాలిలో 4.4 లీటర్ల మద్యం, 1,04,000 నగదు, ప్రత్తిపాడులో రూ. 54,700 నగదు సీజ్ చేశామన్నారు. జిల్లాలో ఏప్రిల్ 29వ తేది వరకు రూ.2,55,60,603 ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు తెలిపారు.
నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో సోమవారం గుంటూరు జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల్ రెడ్డి తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. పార్లమెంట్ పోటీలో 30, అసెంబ్లీ స్థానాలైన తాడికొండ 10, మంగళగిరి 40, తెనాలి 13, పొన్నూరు 14, పత్తిపాడు 13, గుంటూరు ఈస్ట్ 14, గుంటూరు వెస్ట్ 28 అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా 162 మంది అభ్యర్థులు పోటీలో నిలబడ్డారని చెప్పారు.
జిల్లాలో ఒక పార్లమెంటు, ఏడు అసెంబ్లీ స్థానాలు గానూ 14 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ తెలిపారు. సోమవారం జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ జరిగిందన్నారు. నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గానికి నలుగురు, చిలకలూరిపేట ఒకరు, నరసరావుపేట అసెంబ్లీకి ఇద్దరు, సత్తెనపల్లి ఐదుగురు, వినుకొండ ఇద్దరు అభ్యర్థులు వారి నామినేషన్లు ఉపసంహరించుకున్నారన్నారు.
బాపట్ల జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాల్లో కలిపి 151 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా, చివరగా 104 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా వెల్లడించారు. బాపట్ల పార్లమెంటు నుంచి 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారన్నారు. అసెంబ్లీల వారీగా వేమూరు 15, రేపల్లె 14, బాపట్ల 15, పర్చూరు 15, అద్దంకి 15, చీరాల 15 మంది అభ్యర్థులు రానున్న ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
నరసరావుపేట పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు 122 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు కలెక్టర్ శివ శంకర్ సోమవారం తెలిపారు. పార్లమెంటు స్థానానికి 15 మంది అభ్యర్థులు, అసెంబ్లీ స్థానాలకు 107 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు. పెదకూరపాడు 11, చిలకలూరిపేట 25, నరసరావుపేట 14, సత్తెనపల్లి 15, వినుకొండ 14, గురజాల 13, మాచర్ల 15 మంది అభ్యర్థుల పోటీలో ఉన్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.