India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలోని రైతులు స్వచ్చందగా తమ భూమిని పూలింగ్కి అందజేస్తున్నారు. ఈ మేరకు సోమవారం మంత్రి నారాయణకు ఏడు ఎకరాలు భూమికి సంబందించిన నలుగురు రైతులకు అంగీకారపత్రాలు అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రైతులు కోరుకున్న చోటే ప్లాట్స్ కేటాయింపు జరుగుతుందని చెప్పారు. అలానే కౌలు ఒక ఇన్స్టాల్మెంట్ రైతులు ఖాతాలో వేయటం జరిగిందని త్వరలోనే 2వ ఇన్స్టల్మెంట్ వేస్తామన్నారు.
ఆక్రమణలు తొలగింపుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టడం హర్షణీయమని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కోకన్వీనర్ పెంటేల బాలాజీ చెప్పారు. సోమవారం చిలకలూరిపేట జనసేన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాలలో వైసీపీ విచ్చలవిడిగా చెరువులు కాలవలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిందన్నారు. ఆక్రమణల వలన జరిగే నష్టానికి ప్రస్తుత వరదలు ఉదాహరణ అని చెప్పారు. వెంటనే ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టాలని కోరారు.
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వినాయక నిమజ్జనానికి వెళ్లి తిరిగి వస్తుండగా టాటా ఏస్ వాహనం చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి చెట్టును ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రపంచంలో శాంతిపూర్వక మానవ సమాజాన్ని నెలకొల్పేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన కారణజన్ముడు మహమ్మద్ ప్రవక్త అని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన జన్మదినాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు చంద్రబాబు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ సాటివారి పట్ల ప్రేమ, దయ, భావనలతో ఉన్నప్పుడే ప్రవక్త కోరుకున్న శాంతియుత సమాజం నెలకొంటుందని అన్నారు.
గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పలువురు డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ ద్వారకాతిరుమల రావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. విఆర్ లో ఉన్న ఎం.రమేశ్ను గుంటూరు ట్రాఫిక్కు, గుంతకల్లో ఉన్న షేక్ అబ్దుల్ అజీజ్ను గుంటూరు తూర్పునకు, పీసీఎస్లో ఉన్న ఎం. హనుమంతరావును సత్తెనపల్లికి, ఎమ్మిగనూర్లో ఉన్న బి.సీతారామయ్యను గుంటూరు జిల్లా స్పెషల్ బ్రాంచ్కు బదిలీ చేశారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న నందిగం సురేశ్ను మంగళగిరి రూరల్ పోలీసులు కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆదివారం జరిగిన విచారణకు మాజీ ఎంపీ నందిగం సురేష్ సహకరించలేదని తెలుస్తోంది. పోలీసులు అడిగిన ఏ ప్రశ్నకు కూడా తనకేమీ తెలియదు అన్నట్లు సురేశ్ వ్యవహరించారని విశ్వసనీయ సమాచారం. కాగా సురేశ్ను పోలీసులు రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు విచారించనున్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. ఈరోజు మిలాద్-ఉన్-నబీ పండగ సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించిందన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించవలసిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ విధానంలో రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు. ఆదివారం సాయంత్రం ఎర్రబాలెంలో ఆయన మాట్లాడుతూ.. పదిమంది రైతులు ముందుకు వచ్చారన్నారు. భారీ వర్షాల కారణంగా రాజధానిలో నిలిచిపోయిన ముళ్లు కంప తొలగింపు 2 రోజుల్లో ప్రారంభిస్తామని, ఐఐటీ రిపోర్టు రాజధాని నిర్మాణం సంబంధించి పాజిటివ్ గా వచ్చిందన్నారు. ఆ రిపోర్టు అధారంగా చేసుకుని నిర్మాణ పనులు చేపడతామన్నారు.
జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 18న నరసరావుపేటలోని కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశాల మేరకు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా జాబ్ మేళా ఏర్పాటు చేశామని 1500 ఉద్యోగాలు ఉన్నాయన్నారు. అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలని తెలిపారు.
యడ్లపాడు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా నిడమర్రుకి చెందిన కృష్ణ (31), రవి కిషోర్ (25) అనే ఇద్దరు కారు టైరు పంక్చర్ అవ్వడంతో రోడ్డు మార్జిన్లో టైరు మారుస్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొక వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.