Guntur

News October 12, 2025

గుంటూరు జిల్లాలో ముఖ్య అధికారుల ఫోన్ నెంబర్‌లు

image

@ కలెక్టర్ తమీమ్ అన్సారియా: 9849904002.
@ జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ: 9849904003.
@ గుంటూరు IG సర్వ శ్రేష్ట త్రిపాటి: 9440627241.
@ SP వకుల్ జిందాల్: 8688831300.
@ ASP అడ్మిన్: 8688831302.
@ DMHO విజయలక్ష్మీ: 9849902337.
@ DEO రేణుక: 9849909107.
@ DFO: 9949991062.
@ DTC: 9154294107.
@ గుంటూరు RTC RM: 9959225412.
@ Lost Cellphone Whatsapp:8688831574.

News October 12, 2025

GNT: ప్రభుత్వ అధికారులను ప్రశ్నించే హక్కు మీకుంది.!

image

అక్టోబర్ 12, 2005న సమాచార హక్కు చట్టం (RTI) దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రజలకు ప్రభుత్వ శాఖల నుంచి సమాచారం కోరుకునే, తెలుసుకునే హక్కును కల్పించింది. గ్రామస్థాయిలో పంచాయతీలు, మున్సిపల్ కార్యాలయాలు, రెవెన్యూ శాఖలు వంటి విభాగాల్లో అవినీతి, నిర్లక్ష్యంపై ప్రశ్నలు వేయగలిగారు. గుంటూరు జిల్లాలో అనేక సామాజిక కార్యకర్తలు ఈ చట్టాన్ని వినియోగించి ప్రభుత్వ పథకాల అమలులో లోపాలను బయటపెట్టారు.

News October 12, 2025

ఫిర్యాదులు రాయడానికి ప్రత్యేక పోలీస్ సిబ్బంది: ఎస్పీ

image

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే PGRS కార్యక్రమంలో ప్రజలు ఫిర్యాదులు రాయించుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ మేరకు ప్రజలకు సులభతరం చేయడానికి ప్రత్యేక సిబ్బందిని కేటాయించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ సదుపాయం అక్టోబర్ 13 నుంచి ప్రారంభమవుతుందని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ అవకాశాన్ని ఫిర్యాదుదారులు ఉపయోగించుకోవాలని తెలిపారు.

News October 11, 2025

చిత్రకారులకు యిదే మా ఆహ్వానం: గజల్ శ్రీనివాస్

image

వచ్చే ఏడాది జనవరి 3,4,5 తేదీల్లో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో అమరావతిలోని శ్రీసత్యసాయి స్పిరిచువల్ సిటీలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నట్లు డా. గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా చిత్రకారులు తమ ప్రతిభను ఆవిష్కరించడానికి వేదికగా మన అమరావతి పేరుతో చిత్రకళాప్రదర్శన ఉంటుందని శ్రీనివాస్ చెప్పారు.

News October 11, 2025

GNT: మిర్చీ యార్డులో 41,281 మిర్చి టిక్కీల అమ్మకం

image

గుంటూరు మిర్చి యార్డుకు శుక్రవారం 42,595 మిర్చి టిక్కీలు విక్రయానికి రాగా ముందురోజు నిల్వ ఉన్న వాటితో కలిపి 41,281 అమ్మకం జరిగినట్లు గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి చంద్రిక తెలిపారు. ఇంకా యార్డులో 11,715 మిర్చి టిక్కీలు నిల్వ ఉన్నట్లు వెల్లడించారు. వివిధ రకాల మిరపకాయలకు ధరలు పలు విధాలుగా నమోదయ్యాయి.

News October 11, 2025

చేబ్రోలులో ఉచిత డేటా ఎంట్రీ ఆపరేటర్‌ కోర్సు

image

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేబ్రోలు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, స్కిల్ హబ్‌‌లో డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సుకు ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమవుతున్నాయి. ఈ శిక్షణ కోసం ఆసక్తిగల యువతీ, యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీదేవి తెలిపారు. మరిన్ని వివరాల కోసం కళాశాలలో సంప్రదించాలని కోరారు.

News October 10, 2025

రోడ్డు ప్రమాదం కారణాలను నమోదు చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల మూల కారణాలను తెలుసుకొని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వశాఖ రూపొందించిన ఐ-ఆర్ఏడీ యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రదేశాల్లో నివారణకు తీసుకున్న చర్యలపై నివేదికలు అందజేయాలన్నారు.

News October 10, 2025

విహారి, ఆంధ్రా లేబరు పత్రికలకు ఆయనే సంపాదకులు

image

తెలుగు రాజకీయ రంగంలో అసమాన వక్తగా, రాజకీయ విశ్లేషకుడుగా రాణించిన గుత్తికొండ నరహరి ఆగస్టు 10, 1918న ఉమ్మడి గుంటూరు జిల్లా అమృతలూరు మండలం యలవర్రులో జన్మించారు. రాడికల్ రాజకీయాలలో అటు కమ్మూనిస్ట్‌లను, ఇటు కాంగ్రెస్ వారిని ఎదురుకొని, తన ధారాళ ఉపన్యాసాలతో జనాన్ని ఆకట్టుకున్నారు. ములుకోల, ప్రజామిత్ర, సమీక్ష పత్రికలలో వ్యాసాలు రాశారు. విహారి, ఆంధ్రా లేబరు పత్రికలకు సంపాదకత్వం వహించారు.

News October 10, 2025

ఆయన ఇలాంటి పాత్ర ధరించినా దానికి న్యాయం చేశారు

image

ముదిగొండ లింగమూర్తి (అక్టోబర్ 10, 1908-జనవరి 24,1980) గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతానికి చెందిన పాతతరం నటుడు. నాటకరంగం మీద అన్ని రకాల పాత్రలూ ధరించి, పేరుతెచ్చుకుని, సినిమా రంగంలో ప్రవేశించారు. వాహిని సంస్థ నిర్మించిన తొలి చిత్రం వందేమాతరం సినిమాతో పేరు తెచ్చుకున్నారు. క్రూరపాత్ర ధరించినా, అక్రూరపాత్ర ధరించినా, హాస్యపాత్ర ధరించినా నటనలో దేనికదే భిన్నంగా ఉండేది.

News October 10, 2025

GNT: మిర్చీ యార్డులో 53,371 మిర్చి టిక్కీల అమ్మకం

image

గుంటూరు మిర్చి యార్డుకు గురువారం 54,252 మిర్చి టిక్కీలు విక్రయానికి రాగా ముందురోజు నిల్వ ఉన్న వాటితో కలిపి 53,371 అమ్మకం జరిగినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి చంద్రిక తెలిపారు. ఇంకా యార్డులో 10,401 మిర్చి టిక్కీలు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. వివిధ రకాల మిరపకాయలకు సంబంధించిన ధరలు పలు విధాలుగా నమోదయ్యాయి.