India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై తరఫున ఈరోజు ఆరంగేట్రం చేసిన గుంటూరు కుర్రోడు షేక్ రషీద్ బ్యాటింగ్తో అదరగొట్టారు. LSGతో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్గా వచ్చి 19 బంతుల్లో 27(6 ఫోర్లు) పరుగులు చేశారు. ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో పూరన్ చేతికి చిక్కి అవుటయ్యారు. రూ.30లక్షలకు రషీద్ను చెన్నై సొంతంగా చేసుకోగా.. ఈ సీజన్లో అతనికిదే మొదటి మ్యాచ్.
పేరేచర్లలో మిర్చి సాగు చేసిన కౌలు రైతులు దిగుబడి తక్కువగా రావడంతో అధిక నష్టాలు భరిస్తున్నారు. మార్కెట్లో ధరలు పడిపోవడంతో రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. మద్దతు ధర ప్రకటించినా, కొనుగోలు ప్రక్రియ లేదు. రైతులు బోనస్ ఇవ్వాలని, రూ.15,000కి క్వింటాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏప్రిల్ 16న గుంటూరులో నిరసన నిర్వహించనున్నారు.
పునరాభివృద్ధి పనుల నేపథ్యంలో సికింద్రాబాద్–రేపల్లె(17645) ఎక్స్ప్రెస్ రైలు టెర్మినల్ను ఏప్రిల్ 15 నుంచి సికింద్రాబాద్ నుంచి చర్లపల్లికి మార్చనున్నారు. రైలు బయల్దేరే సమయం కూడా మధ్యాహ్నం 1.30 కాకుండా గంటకు ముందుగా 12.30కి మార్చినట్టు అధికారులు వెల్లడించారు. అయితే మార్గమధ్య స్టేషన్లు, వాటి సమయాల్లో ఎలాంటి మార్పులు లేవన్నారు. ఈ రైలు సిరిపురం, వేజెండ్ల, తెనాలి, చినరావూరు, గుంటూరులలో ఆగుతుంది.
నల్లపాడు టిడ్కో గృహాల్లో 17 ఏళ్ల షేక్ నగ్మా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ ఫలితాల్లో ఆమెకు 780 మార్కులు వచ్చాయి. అయితే ఆమె మైగ్రేన్ బాధతో ఇబ్బంది పడుతున్నట్టు తెలిసింది. ఆ రోజు తల్లిదండ్రులు చిన్న కుమార్తెతో కలిసి బయటికి వెళ్లిన వేళ, ఏమైందో తెలీదు కానీ ఇంట్లో ఒంటరిగా ఉన్న నగ్మా ఉరివేసుకుంది. ఇంటికి తిరిగొచ్చిన తల్లిదండ్రులకు ఆమె మృతదేహంలా కనిపించింది. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
ఇన్ఛార్జ్ మేయర్ షేక్ షజీల వైసీపీ తరఫున కార్పొరేటర్గా గెలిచినప్పటికీ పార్టీలో నెలకొన్న విభేదాలు కారణంగా ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. అయితే అనూహ్యంగా ఇటీవల ఇన్ఛార్జ్ మేయర్గా బాధ్యతలు చేపట్టారు. ఎలాగూ మేయర్ సీట్లో కూర్చున్నాం కదా ఆ సీటును పదిలం చేసుకోవాలనే ఆలోచనలో షజీల ఉన్నారు. కొత్త వ్యక్తులకు పూర్తి మద్దతు లేకపోవడం, సవరణ బిల్లు వంటి అంశాలు షజీలాకి కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయి.
నేడు డా.B.R.అంబేడ్కర్ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం గుంటూరులో ఆయన మాట్లాడారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో అర్జీలు ఇవ్వాలనుకున్న ప్రజలు గమనించవలసిందిగా కోరారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని గుంటూరు కలెక్టరేట్లో రేపు(సోమవారం) జరిగే గ్రీవెన్స్ డేని రద్దు చేశారు. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి ప్రకటన విడుదల చేశారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా పబ్లిక్ హాలిడే ఉన్నందున గ్రీవెన్స్ను డే రద్దు చేసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి అధికార యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
మహానాడు ప్రాంతంలో వరద ముంపు నివారణకు రూ.300 కోట్లతో రిటైనింగ్ వాల్ మంజూరైందని, పనులకు త్వరలో శంకుస్థాపన చేస్తామని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. మంగళగిరి రూరల్ యర్రబాలెంలోని మన ఇల్లు-మన లోకేశ్ కార్యక్రమంలో భాగంగా 5వరోజు మహానాడు కాలనీవాసులకు పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రిటైనింగ్ వాల్ నిర్మాణంపై ఆయన మాట్లాడారు. మంగళగిరిని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామన్నారు.
ఇంటర్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అద్భుత విజయం సాధించారని అడ్మిన్ అడ్వైజర్ సీఏ మట్టుపల్లి మోహన్ తెలిపారు. MECలో లిఖిత, గీతిక, హరిణి 494/500 మార్కులు సాధించారు. 490కి పైగా 88 మంది, 480 ఆపైన 498 మంది, 649 మందికి 475 ఆపైన మార్కులు వచ్చాయి. సీనియర్ ఇంటర్లో సాత్విక 982 మార్కులు, 970 ఆపైన 71 మంది, 141 మంది 960 ఆపైగా మార్కులు సాధించారని పేర్కొన్నారు. విద్యార్థులను యాజమాన్యం అభినందించింది.
గుంటూరు సమీపంలోని ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఫిరంగిపురానికి చెందిన కాకుమాను సందీప్ మృతి చెందాడు. సందీప్ స్కూటీపై గుంటూరు వెళుతుండగా పలకలూరు రోడ్డులోని JLE సినిమా హాల్ సమీపంలో లగేజ్ ఆటో ఢీకొట్టింది. ఈ వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.