Guntur

News September 11, 2024

ప్రమోషన్ వచ్చిన ఏఎస్ఐలు వీళ్లే..!

image

గుంటూరు రేంజ్ పరిధిలో ఏడుగురు ఏఎస్ఐలకు ఎస్ఐలుగా పదోన్నతులు కల్పిస్తూ సౌత్ కోస్టల్ జోన్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. పదోన్నతులు పొందిన వారిలో షేక్.బురాన్ షరీఫ్(గుంటూరు), హెచ్.రహమాన్ (బాపట్ల), బి.జయరాణి (గుంటూరు), పి.ప్రమీలా దేవి (గుంటూరు), కె.సుబ్బమ్మ (గుంటూరు), వి.జయమ్మ (గుంటూరు), ఎస్.వెంకట రమణ (బాపట్ల) ఉన్నారు.

News September 11, 2024

నానో టెక్నాలజీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

image

గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 5సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ నానో టెక్నాలజీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విభాగాధిపతి ఆచార్య వి. రవి కుమార్ తెలిపారు. 3వ విడత వెబ్ ఆప్షన్లు, రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు వెబ్ సైట్‌లో సంప్రదించాలన్నారు. ఇంటర్మీడియట్ ఎంపీసీ/బైపీసీలో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని ఆయన తెలిపారు.

News September 11, 2024

ఎమ్మెస్సీ, ఎం.టెక్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెంపు

image

గుంటూరు ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2024-25 విద్యా సంవత్సరానికి ఎమ్మెస్సీ, ఎం.టెక్, పీహెచ్ఎ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును అక్టోబరు 10వ తేదీ వరకు పొడిగించినట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ రామచంద్రరావు మంగళవారం ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని హార్డ్ కాపీలను యూనివర్సిటీలో అందజేయాలన్నారు.

News September 11, 2024

తెనాలి: యువతి ఫిర్యాదుతో యువకుడిపై కేసు

image

యువకుడు మోసం చేశాడని గుంటూరుకు చెందిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. యువతి ఇంటర్ చదువుతున్న సమయంలో తెనాలికి చెందిన యశ్వంత్ పరిచయం అయ్యాడు. యశ్వంత్ ఈ సంవత్సరం జూన్ నెలలో తన ఇంటికి పిలిచి పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని తెనాలి వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

News September 11, 2024

గుంటూరు: ఏఏస్ఐలకు ప్రమోషన్

image

గుంటూరు రేంజ్ పరిధిలో ఏడుగురు ఏఏస్ఐలకు ఎస్ఐలుగా ప్రమోషన్ కల్పిస్తూ సౌత్ కోస్టల్ జోన్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠీ ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్ల, గుంటూరు, ప్రకాశంలో విధులు నిర్వహిస్తున్న ఏడుగురు ఏఏస్ఐలు ఈ జాబితాలో ఉన్నారు. వీరికి గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఫోస్టింగ్స్ ఇస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.

News September 11, 2024

గుంటూరు: ఏఏస్ఐలకు ప్రమోషన్

image

గుంటూరు రేంజ్ పరిధిలో ఏడుగురు ఏఏస్ఐలకు ఎస్ఐలుగా ప్రమోషన్ కల్పిస్తూ సౌత్ కోస్టల్ జోన్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠీ ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్ల, గుంటూరు, ప్రకాశంలో విధులు నిర్వహిస్తున్న ఏడుగురు ఏఏస్ఐలు ఈ జాబితాలో ఉన్నారు. వీరికి గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఫోస్టింగ్స్ ఇస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.

News September 11, 2024

నేడు గుంటూరుకు జగన్ రాక

image

వైసీపీ అధినేత జగన్ బుధవారం గుంటూరులో పర్యటిస్తారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి 11 గంటలకు గుంటూరు సబ్ జైలుకు చేరుకుంటారు. మాజీ ఎంపీ నందిగం సురేశ్‌తో ములాఖత్ అవుతారు. 11.30 గంటలకు జైలు నుంచి బయల్దేరి ఎస్వీఎన్ కాలనీలో టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ ఈదా సాంబిరెడ్డిని పరామర్శిస్తారు. 11.55కి ఎస్వీఎన్ కాలనీ నుంచి తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు.

News September 11, 2024

అమరావతి రైతుల సాయం రూ.3.31లక్షలు

image

వరద బాధితులకు అమరావతి పరిధిలోని 29 గ్రామాల రైతులు అండగా నిలిచారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.3.30 లక్షలు అందజేశారు. సంబంధిత చెక్‌ను సీఎం చంద్రబాబుకు విజయవాడలో అందజేశారు. రైతులను సీఎం చంద్రబాబు అభినందించారు. కార్యక్రమంలో రైతులు చిట్టిబాబు, శ్రీధర్, రవి, అనిల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

News September 10, 2024

ఇండియా-ఏ జట్టులోకి గుంటూరు కుర్రాడు

image

గుంటూరు కుర్రాడికి ఇండియా టీంలో చోటు దక్కింది. దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఏ జట్టుకు జురెల్ స్థానంలో షేక్ రషీద్‌ను ఎంపిక చేశారు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రషీద్ ఎంపికైన విషయం తెలిసిందే. ఇండియా అండర్-19 జట్టుకూ ప్రాతినిధ్యం వహించాడు. ఈ 19ఏళ్ల గుంటూరు కుర్రాడు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా చేస్తాడు.

News September 10, 2024

తుళ్లూరు: బాలికను గర్భవతి చేసిన పాస్టర్.. 20 ఏళ్ల జైలు శిక్ష

image

బాలికను గర్భవతి చేసిన పాస్టర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. తుళ్లూరు మండలం వెంకటపాలెంకి చెందిన కోటేశ్వరరావు (55) చర్చి నిర్వహించేవారు. 2018లో 15ఏళ్ల బాలికపై పాస్టర్ లైంగికదాడికి పాల్పడినట్లు ఆమె తల్లిదండ్రులు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. నేరం రుజువు కావడంతో శిక్ష పడింది.