India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంటూరు రేంజ్ పరిధిలో ఏడుగురు ఏఏస్ఐలకు ఎస్ఐలుగా ప్రమోషన్ కల్పిస్తూ సౌత్ కోస్టల్ జోన్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠీ ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్ల, గుంటూరు, ప్రకాశంలో విధులు నిర్వహిస్తున్న ఏడుగురు ఏఏస్ఐలు ఈ జాబితాలో ఉన్నారు. వీరికి గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఫోస్టింగ్స్ ఇస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.
వైసీపీ అధినేత జగన్ బుధవారం గుంటూరులో పర్యటిస్తారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి 11 గంటలకు గుంటూరు సబ్ జైలుకు చేరుకుంటారు. మాజీ ఎంపీ నందిగం సురేశ్తో ములాఖత్ అవుతారు. 11.30 గంటలకు జైలు నుంచి బయల్దేరి ఎస్వీఎన్ కాలనీలో టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ ఈదా సాంబిరెడ్డిని పరామర్శిస్తారు. 11.55కి ఎస్వీఎన్ కాలనీ నుంచి తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు.
వరద బాధితులకు అమరావతి పరిధిలోని 29 గ్రామాల రైతులు అండగా నిలిచారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.3.30 లక్షలు అందజేశారు. సంబంధిత చెక్ను సీఎం చంద్రబాబుకు విజయవాడలో అందజేశారు. రైతులను సీఎం చంద్రబాబు అభినందించారు. కార్యక్రమంలో రైతులు చిట్టిబాబు, శ్రీధర్, రవి, అనిల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు కుర్రాడికి ఇండియా టీంలో చోటు దక్కింది. దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా-ఏ జట్టుకు జురెల్ స్థానంలో షేక్ రషీద్ను ఎంపిక చేశారు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రషీద్ ఎంపికైన విషయం తెలిసిందే. ఇండియా అండర్-19 జట్టుకూ ప్రాతినిధ్యం వహించాడు. ఈ 19ఏళ్ల గుంటూరు కుర్రాడు బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా చేస్తాడు.
బాలికను గర్భవతి చేసిన పాస్టర్కు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. తుళ్లూరు మండలం వెంకటపాలెంకి చెందిన కోటేశ్వరరావు (55) చర్చి నిర్వహించేవారు. 2018లో 15ఏళ్ల బాలికపై పాస్టర్ లైంగికదాడికి పాల్పడినట్లు ఆమె తల్లిదండ్రులు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. నేరం రుజువు కావడంతో శిక్ష పడింది.
రెంటచింతల మండల కేంద్రంలోని ఆనంద్ పేటలో ఏర్పాటుచేసిన వినాయక చవితి లడ్డూ వేలం పాట రికార్డ్ స్థాయిలో రూ.7.10 లక్షలు పలికింది. మాజీ ఎంపీపీ గొంటు సుమంత్ రెడ్డి తండ్రి ఆదిరెడ్డి కైవసం చేసుకున్నారు. పోటాపోటీగా జరిగిన వేలంపాటలో తెలుగుదేశం పార్టీ నాయకులు లడ్డూను దక్కించుకున్నారు. నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఊరేగింపుగా లడ్డును ఆదిరెడ్డికి అందజేశారు.
ఫిర్యాదు దారుని సమస్యల పట్ల శ్రద్ధ వహించి వారి సమస్యలను గడువులోగా పరిష్కరించాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ తదితర సమస్యల పరిష్కారం కోసం ప్రజలు వినతి పత్రాలను అందజేశారు. వాటిని వెంటనే పరిష్కరించాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 11న గుంటూరు నగరానికి రానున్నారు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసు విషయంలో బ్రాడీపేటలోని సబ్- జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్తో ఈ సందర్భంగా జగన్ ములాఖత్ కానున్నారు. తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరి గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు రోడ్డు మీదుగా సబ్ జైలుకు జగన్ చేరుకోనున్నారు.
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఓఎస్డీగా మాజీ ఐఏఎస్ సుబ్బారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్గా విధులు నిర్వహించి పదవి విరమణ చేశారు. అనంతరం మంత్రి ఓఎస్డీగా నియమితులై సోమవారం బాధ్యతలు స్వీకరించారు. తహశీల్దార్ నుంచి ఈ స్థాయికి చేరుకున్నారు.
భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటల అంచనాను 24 గంటల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. ప్రభుత్వం అందించిన ఫార్మాట్లలో సమాచారాన్ని పొందుపరచాలన్నారు. వ్యవసాయం, ఉద్యానవనం, మత్స్యశాఖ అంచనాలు విడివిడిగా అందజేయాలన్నారు. పట్టణాలు, మండలాల్లో ఇళ్లు దెబ్బతిన్న వాటిని వేర్వేరుగా నమోదు చేయాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు.
Sorry, no posts matched your criteria.