Guntur

News January 1, 2025

నిజాంపట్నం: భర్తను హత్య చేసిన భార్య

image

భర్తను భార్య హత్య చేసిన దారుణ ఘటన నిజాంపట్నం మండలం కొత్తపాలెం పంచాయతీలోని పెద్దూరు గ్రామంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. 31వ తేదీ రాత్రి అమరేంద్రబాబు మద్యం తాగి ఇంటికి రాగా భార్యాభర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో భర్త అమరేంద్ర (38) తలపై భార్య కర్రతో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న రేపల్లె రూరల్ సురేశ్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 1, 2025

చిలకలూరిపేట: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

నూతన సంవత్సరం రోజున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం తాతపూడి జాతీయ రహదారి రక్తమోడింది. ద్విచక్ర వాహనంపై ముగ్గురు వ్యక్తులు మార్టూరు వైపు వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మహిళను చిలకలూరిపేట ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 1, 2025

పల్నాడు: కొత్త సంవత్సరం వేళ కుటుంబంలో తీవ్ర విషాదం

image

నూతన సంవత్సరం వేళ ఓ కుటుంబంలో తీరని విషాదం చోటుచేసుకుంది. కుమారుడికి కేక్ కొనిచ్చేందుకు తీసుకెళ్తుండగా లారీ మృత్యువు రూపంలో వెంటాడింది. నకరికల్లు మండలం త్రిపురాపురం గ్రామం వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాద విషాదాంతమిది. గ్రామానికి చెందిన దుర్గారావు బైక్‌పై కుమారుడితో కలిసి వెళ్తుండగా లారీ ఢీకొనడంతో బాలుడు కార్తీక్ మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.

News January 1, 2025

వివాహిత హత్య కేసులో నలుగురు అరెస్ట్

image

వివాహిత షేక్ మల్లిక(29) హత్య కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వివరాల ప్రకారం.. పెదకాకాని(M) నంబూరికి చెందిన మల్లికకు అక్బర్‌తో 15ఏళ్ల క్రితం వివాహం అయింది. పెళ్లైన ఏడేళ్ల తర్వాత ఆమె భర్తను, పిల్లలను వదిలేసి ఓ యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత రెహమాన్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే మరో యువకుడితో కూడా సహజీవనం చేస్తున్నట్లు తెలియడంతో రెహమాన్ ఆమెను చంపించాడు.

News January 1, 2025

వినుకొండలో న్యూఇయర్ వేడుకలు.. PIC OF THE DAY

image

వినుకొండలో విద్యార్థులు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మంగళవారం రంగవల్లిని అందంగా అలంకరించారు. లైట్లు వెలిగించి వాటి చుట్టూ క్యాండిల్స్ వెలిగించారు. అనంతరం రంగవల్లుల చుట్టూ విద్యార్థులు మానవహారం నిర్వహించారు. దీంతో రంగవల్లి చుట్టూ ఉన్న చిన్నారుల ఫొటో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

News December 31, 2024

న్యూయర్ వేడుకలకు గుంటూరు సర్వం సిద్ధం

image

ఉమ్మడి గుంటూరులో న్యూయర్ వేడుకలకు యువత సిద్ధమైంది. గతంతో పోలిస్తే ఈ వేడుకల్లో ఎంతో తేడా కనిపిస్తుంది. 10ఏళ్ల కిందట వరకు గ్రీటింగ్ కార్డ్స్ పంచుకుంటూ శుభాకంక్షలు తెలిపేవారు. హైటెక్ యుగంలో వాట్సాప్ ద్వారా విషెస్ తెలుపుకుంటున్నారు. రంగురంగుల లైట్లతో నగరం, పల్లెలు మెరిసిపోతుండగా ఇళ్ల ముందు ముగ్గులతో పల్లెలు కళకళలాడుతున్నాయి. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. 

News December 31, 2024

కోరుకొండ: రేవ్ పార్టీలో 19 మంది అరెస్ట్.. వివరాలివే

image

తూ.గో(D) కోరుకోండలోని రేవ్ పార్టీపై పోలీసుల దాడిలో మొత్తం 19మందిని అరెస్ట్ చేశారు. గుంటూరుకి చెందిన గోపాలకృష్ణ అనే వ్యక్తి ఫంక్షన్ హాల్ బుక్ చేసి పార్టీ నిర్వహించారు. ఇక్కడికి TNK, ఆచంట, గోపాలపురానికి చెందిన 10మంది ఎరువుల డీలర్లను రప్పించారు. కాకినాడకు చెందిన మహిళ ద్వారా ఐదుగురు అమ్మాయిలను తీసుకొచ్చారు. వారితో మద్యం తాగుతూ డ్యాన్స్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి నిందితుల్ని కోర్టులో హాజరుపర్చారు.

News December 31, 2024

ఫిబ్రవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు: మంత్రి అనగాని

image

రాష్ట్రంలో ప్రజాహిత పాలన కొనసాగుతుందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. లక్ష 82 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టామని, రెవెన్యూ సదస్సులకు మంచి రెస్పాన్స్ వస్తోందని అన్నారు. గడిచిన ఐదేళ్లు రెవెన్యూ సమస్యలు గాలికి వదిలేశారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం చేసిన తప్పులు ఇప్పుడు సవరిస్తున్నామని అన్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేస్తమన్నారు.

News December 30, 2024

అమరావతి: పవన్ కళ్యాణ్‌ను కలిసిన దిల్‌రాజు

image

అమరావతిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో నిర్మాత దిల్‌రాజు సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన గేమ్ ఛేంజర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు పవన్‌ను ఆహ్వానించారు. సినిమా టికెట్‌ రేట్లు, సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలు, ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఏర్పాట్లపై చర్చించారు. కాగా కార్యక్రమం విజయవాడలో ఘనంగా నిర్వహించనున్నారు. పవన్‌ హాజరవుతారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

News December 30, 2024

2024: ఉమ్మడి గుంటూరు పొలిటికల్ పిక్చర్ ఛేంజ్

image

ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని 2024 ఎన్నికలు మార్చేశాయి. 2019 ఎన్నికల్లో మొత్తం 17 నియోజకవర్గాల్లో 15 YCP, 2 సీట్లలో TDP గెలిచింది. కాగా ఈసారి 3 ఎంపీ సీట్లతో పాటు 16 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ, ఒక స్థానంలో జనసేన నెగ్గి క్లీన్ స్వీప్ చేశాయి. సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ మంగళగిరి నుంచి 90 వేల మెజార్టీతో నెగ్గడం విశేషం. మంత్రులుగా నారా లోకేశ్, నాదెండ్ల, అనగాని కొనసాగుతున్నారు.