India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రకృతి విపత్తులు నెలకొన్నప్పుడు క్షేత్ర స్థాయిలో ఉండే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది చురుగ్గా పనిచేయాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు పేర్కొన్నారు. సచివాలయ సిబ్బంది కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడే ప్రజా సమస్యలు తెలుస్తాయని తెలిపారు. సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 50 దరఖాస్తులు వచ్చాయి.
ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో చంద్రబాబు అరెస్ట్ కాగా, ఆ ఘటన జరిగి నేటికి ఏడాది సందర్భంగా మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ‘నిండు చంద్రుడు, ప్రజలు ఒక వైపు.. నియంత జగన్ కుట్రలు మరో వైపు.. చంద్రబాబు అక్రమ నిర్బంధంపై తెలుగుజాతి ఒక్కటై ఉద్యమించింది. రాష్ట్ర ప్రగతి కోసం, తెలుగు ప్రజల కోసం పరితపించే చంద్రబాబు ఏడాది క్రితం తప్పుడు కేసులో అరెస్ట్ చేయడమే వైసీపీ సమాధికి జనం కట్టిన పునాది అయింది’ అని పోస్ట్ చేశారు.
ఓ ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పట్టాభిపురం పీఎస్లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ హనుమంతురావు కోర్టులో పనిచేసే ఉద్యోగినికి అసభ్యకర పోస్టులు పెడుతూ వేధిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆమె పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన అనంతరం, నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేశారు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మయన్మార్కు చెందిన కొండన్న(38) ఆదివారం పాముకాటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, కాటేసిన పాముకోసం వెతుకుతూ గంటన్నర పాటు వెతకడం ప్రాణాలు పోయేలా చేసినట్లు తెలుస్తోంది. మయన్మార్లో ఎవరినైనా పాము కరిస్తే దానిని చంపి ఆస్పత్రికి తీసుకెళ్తే, ఆపాము జాతిని బట్టి వైద్యం చేస్తారు. ఇదే విధంగా కొండన్న కూడా పాము కోసం వెతికి వైద్యసాయం ఆలస్యంగా పొందడమే చనిపోవడానికి కారణమైంది.
అకాల వర్షాల కారణంగా మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో జరగాల్సిన ప్రజా వేదిక కార్యక్రమం వారం రోజుల పాటు రద్దు అయినట్లు కార్యాలయ కార్యదర్శి పరుచూరి అశోక్ బాబు తెలిపారు. అకాల వర్షాలు, వరదలు కారణంగా అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉండటంతో మంగళగిరి టీడీపీ పార్టీ కేంద్ర కార్యలయంలో జరగాల్సిన ప్రజా వేదిక కార్యక్రమం ఇవన్నీ ఈనెల 9 నుంచి 15 వరకు రద్దు అయినట్లు తెలిపారు.
అకాల వర్షాల కారణంగా మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో జరగాల్సిన ప్రజా వేదిక” కార్యక్రమం వారం రోజుల పాటు రద్దు అయినట్లు కార్యాలయ కార్యదర్శి పరుచూరి అశోక్ బాబు తెలిపారు. అకాల వర్షాలు, వరదలు కారణంగా అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉండటంతో మంగళగిరి టీడీపీ పార్టీ కేంద్ర కార్యలయంలో జరగాల్సిన “ప్రజా వేదిక” కార్యక్రమం ఇవన్నీ ఈనెల 9 నుంచి 15 వరకు రద్దు అయినట్లు తెలిపారు.
కలెక్టరేట్లో సోమవారం నిర్వహించవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు పరిచినట్లు గుంటూరు కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి IAS ఆదివారం తెలిపారు. జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో MA బుద్ధిస్ట్ స్టడీస్ చదువుతున్న మయన్మార్ విద్యార్థి కొండన్న పాముకాటుకు గురై మృతి చెందడంపై మంత్రి <<14050417>>నారా లోకేశ్ సంతాపం తెలిపారు.<<>> ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా యూనివర్సిటీ అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నానని, కొండన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.
గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయంలో రక్త పింజర పాముకాటుతో విద్యార్థి మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మయన్మార్కు చెంది కొండన్న ANUలో MA బుద్ధిజం చదువుతున్నాడు. శనివారం క్యాంపస్ ఆవరణలో పుట్టగొడుగులు ఏరుతుండగా పాముకాటుకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న విద్యార్థులు, సిబ్బంది అతణ్ని ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
కాసేపట్లో ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ MD రోణంకి కూర్మనాథ్ తెలిపారు. నాగార్జునసాగర్ వద్ద ఇన్ఫ్లో, ఔట్ ఫ్లో 2.99 లక్షల క్యూసెక్కులు ఉందని, పులిచింతల వద్ద ఇన్ఫ్లో 2.75, ఔట్ ఫ్లో 2.97 లక్షల క్యూసెక్కులు రాగా, ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.88 లక్షల క్యూసెక్కులు వస్తుందన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.