India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

లోక రక్షకుడు, కరుణామయుడు అయిన క్రీస్తు బోధనలు ప్రతిఒక్కరికీ మార్గదర్శకమని మంత్రి నారా లోకేశ్ అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లలులేని సంతోషాలను బహూకరించే ఉత్సవం క్రిస్మస్ అని ఏసుక్రీస్తు పుట్టిన పవిత్రమైన రోజును ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. క్రీస్తు బోధనలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

గుంటూరులో వ్యభిచార గృహం నడుపుతున్న వ్యక్తితోపాటు ముగ్గురు మహిళలను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. కొత్తపేట పోలీసుల వివరాల ప్రకారం.. ప్రకాష్ నగర్లోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్న వ్యక్తి, మహిళలతో వ్యభిచారం చేస్తున్నారని సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. ముగ్గురు మహిళలు, వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు.

జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని కలెక్టరేట్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. మనిషి పుట్టుకతోనే వినియోగదారుని జీవితం మొదలవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు తాము కొనే వస్తువు నాణ్యత కలిగి ఉండేలా చూసుకోవాలని చెప్పారు. తమకు ఎలాంటి మోసం జరిగిందని గ్రహించిన వెంటనే వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.

బెనిఫిట్ షోలపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు వ్యాఖ్యల్ని రాష్ట్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి ఆళ్ళ హరి ఖండించారు. మంగళవారం గుంటూరులో వారు మాట్లాడుతూ.. తెలంగాణాలోని ఒక ధియేటర్లో జరిగిన దురదృష్టకర దుర్ఘటనను అడ్డం పెట్టుకొని కొంతమంది రాజకీయ నాయకులు సినీ పరిశ్రమ మొత్తంపై కత్తి కట్టడం దుర్మార్గమన్నారు. అధికారం అండతో సినీ జగత్తు ఆధిపత్యం చెలాయించాలని చూడటం తగదని అన్నారు.

బొల్లాపల్లి మండలంలో జంట సాగర్ కెనాల్లో దూకడం సంచలనంగా మారింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని వెల్లటూరు గ్రామ సమీపంలో గల సాగర్ కెనాల్లో మంగళవారం ఓ జంట దూకారు. గమనించిన స్థానికులు వెంటనే కాలువలో దూకిన వారి కోసం రక్షించే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో వ్యక్తి మృతి చెందగా, మహిళను రక్షించారు. చికిత్స నిమిత్తం మహిళను ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

క్రోసూరు మండల పరిధిలోని ఎర్రబాలెం గ్రామ సమీపంలో సత్తెనపల్లి నుంచి వస్తున్న కారు ద్విచక్రదారుడిని ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే వాహనదారుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేస్తున్నామని ఎస్ఐ నాగేంద్ర తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

తెనాలి ఐతానగర్కు చెందిన ఎ. మహాలక్ష్మి సాధారణ పేద కుటుంబంలో జన్మించింది. మున్సిపల్ హైస్కూల్లో చదువుకున్న ఆమె బీఎస్ఎఫ్ జవాన్ కావాలనుకున్న తన లక్ష్యాన్ని సాధించింది. కఠోర శ్రమకు తోడు క్రమశిక్షణతో పట్టుదలగా ప్రయత్నించి ఆర్మీలో ఉద్యోగం సాధించింది. తొలి సారిగా స్వస్థలం తెనాలి వచ్చిన క్రమంలో ఆమె చదివిన ఐతానగర్లోని ఎన్ఎస్ఎం హైస్కూల్లో ఉపాధ్యాయులు సోమవారం మహాలక్ష్మిని ఘనంగా సత్కరించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం షెడ్యూల్ను సీఎం కార్యాలయ అధికారులు విడుదల చేశారు. చంద్రబాబు ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయానికి వెళతారు. సీఆర్డీఏ, బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష చేస్తారు. అనంతరం సాయంత్రం విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్లో సెమీ క్రిస్మస్ వేడుకలకు హాజరవుతారని సీఎం కార్యాలయం తెలిపింది.

అమరావతి పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం 44వ CRDA కీలక సమావేశం జరగనుంది. జోన్ 7, జోన్ 10, మౌలిక వసతుల కల్పనకు అథారిటీ ఆమోదం తెలపనుంది. ఇప్పటికే రూ.45,249 కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు ఆమోదం తెలపనున్నట్లు సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. మరో 2వేల కోట్లకు పైబడి పనులు చేపట్టేందుకు ఆమోదం తెలియజేయనుంది.

ఎన్నికల అనంతరం మాజీ హోం మంత్రి సుచరిత ఆచూకీ కనిపించడం లేదని జిల్లా ప్రజలు అంటున్నారు. ఎన్నికల్లో ఆమె పోటీ చేసిన తాడికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి డైమండ్ బాబుకు అప్పగించారు. అప్పటి నుంచి సుచరిత పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనకపోవడంతో ఆమె పార్టీ మారతారనే వార్తలు వచ్చాయి. కానీ పార్టీ మారేది లేదని అనారోగ్య కారణాల వల్ల సుచరిత దూరంగా ఉంటున్నట్లు ఆమె అనుచరులు చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.