Guntur

News April 22, 2024

గుంటూరు: నేడు నామినేషన్లు వేసే YCP అభ్యర్థులు వీరే

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో నేడు వైసీపీ, టీడీపీ బలపరిచిన , ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపల్లె నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి ఈపూరి గణేశ్, చిలకలూరిపేట నుంచి కే మనోహర్ నాయుడు, తాడికొండ నుంచిమేకతోటి సుచరిత వైసీపీ నుంచి నామినేషన్ వేయనున్నారు.

News April 22, 2024

అనిల్ కుమార్ యాదవ్ ఆస్తుల వివరాలు

image

➤ పార్లమెంట్: నరసరావుపేట
➤ అభ్యర్థి: పాలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ (YCP)
➤ భార్య: జాగృతి
➤ విద్యార్హతలు: B.D.S
➤ చరాస్తి విలువ: రూ.2.43 కోట్లు
➤ భార్య చరాస్తి విలువ: రూ.2.10కోట్లు
➤ కేసులు: 1
➤ అప్పులు: రూ.1.59కోట్లు
➤ చేతిలో ఉన్న డబ్బులు: రూ.2 లక్షలు
➤ బంగారం: 12 గ్రాములు, డైమండ్ రింగ్ భార్యకు 900 గ్రాములు
NOTE: ఎన్నికల అఫిడవిట్‌లో అభ్యర్థి పేర్కొన్న వివరాలు ఇవి.

News April 22, 2024

రేపు తెనాలి రానున్న వైఎస్ షర్మిల

image

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మంగళవారం సాయంత్రం తెనాలి రానున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళవారం సాయంత్రం 7గంటలకు మార్కెట్ సెంటర్లో బహిరంగ సభ జరుగుతుందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

News April 22, 2024

నాదెండ్ల: ఈతకు వెళ్లి ఇద్దరు పిల్లలు మృతి

image

నాదెండ్ల మండల పరిధిలోని తూబాడు గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. తూబాడు చిరుమామిళ్ళ గ్రామాల మధ్యనున్న సాగర్ కాలువలో ఈత కొడదామని వెళ్ళిన ఇద్దరు చిన్నారులు షేక్ సిద్దిక్ (15), షేక్ అత్తర్ (15) నీట మునిగి చనిపోయారు. నీటి ప్రవాహానికి కాలువలో కొట్టుపోవడంతో గమనించిన స్థానికులు బయటకు తీసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. 

News April 22, 2024

జిల్లాలోని సమస్య ఆత్మక పోలింగ్ స్టేషన్లో కలెక్టర్ బస

image

సార్వత్రిక ఎన్నికల 2024 కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ మాచర్ల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను, చెక్ పోస్టులను అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల విధులను అప్రమత్తత నిర్వహించాలన్నారు. మద్యం, నగదు ఇతర వస్తువులు అక్రమ రవాణాను నివారించాలని, సిబ్బందికి సలహాలు అందజేశారు. తనిఖీ అనంతరం మందడం జిల్లా పరిషత్ పాఠశాలలో రాత్రి బస చేశారు.

News April 21, 2024

ANUలో ICET-2024 నోటిఫికేషన్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెల్ఫ్ సపోర్ట్ విధానంలో 8 కోర్సులకు ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు ANU- ICET-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఎంబీఏలో పలు రకాల కోర్సులు, ఎంసీఏ కోర్సులలో చేరే విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని ఆ విభాగ సంచాలకులు డాక్టర్ అనిత తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు మే 9లోగా దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా పంపించాలని కోరారు. 

News April 21, 2024

గుంటూరు: 6.5కిలోల వెండిని సీజ్ చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్  

image

జిల్లాలో ఆదివారం ఫ్లయింగ్ స్క్వాడ్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో తెనాలి నియోజకవర్గ పరిధిలో రూ.4,60,880ల విలువ గల 6584 గ్రాముల వెండి సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో జరిగిన తనిఖీలలో ఏప్రిల్ 21 వ తేది సాయంత్రం 6 గంటల వరకు రూ.2,31,26,840ల  నగదు, మద్యం జప్తు చేశామన్నారు. 

News April 21, 2024

గుంటూరులో వృద్ధురాలి మృతి.. కేసు నమోదు

image

గుంటూరులో వృద్ధురాలు మృతి చెందిన ఘటనపై ఆదివారం లాలాపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు సుమారు 70 సంవత్సరాలు కలిగిన గుర్తుతెలియని వృద్ధురాలు సంగడిగుంట లాంచర్ రోడ్డులో అపస్మారక స్థితిలో పడి ఉంది. స్థానికులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆచూకీ తెలిసినవారు లాలాపేట పోలీసులకు తెలియజేయాలని అన్నారు.

News April 21, 2024

నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి: శివశంకర్

image

పోస్టల్ బ్యాలెట్‌కి సంబంధించి ఎన్నికల కమిషన్ రూపొందించిన నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సూచించారు. ఆదివారం నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్ తదితర అంశాలపై రిటర్నింగ్ అధికారులతో వెబెక్స్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News April 21, 2024

గుంటూరు: అమర్నాథ్ యాత్రికులకు వైద్య పరీక్షలు

image

ఈ ఏడాది గుంటూరు జిల్లా నుంచి అమర్నాథ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో ప్రతి మంగళ, గురు వారాల్లో వైద్యపరీక్షలు నిర్వహించి మెడికల్ సర్టిఫికెట్ జారీ చేస్తామని ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధీర్ బాబు శనివారం తెలిపారు. ఈ యాత్రకు వెళ్లేందుకు 13 నుంచి 75 ఏళ్లలోపు వయస్సు వారు మాత్రమే అర్హులని ఆయన తెలిపారు.