India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రెంటచింతల మండల కేంద్రంలోని ఆనంద్ పేటలో ఏర్పాటుచేసిన వినాయక చవితి లడ్డూ వేలం పాట రికార్డ్ స్థాయిలో రూ.7.10 లక్షలు పలికింది. మాజీ ఎంపీపీ గొంటు సుమంత్ రెడ్డి తండ్రి ఆదిరెడ్డి కైవసం చేసుకున్నారు. పోటాపోటీగా జరిగిన వేలంపాటలో తెలుగుదేశం పార్టీ నాయకులు లడ్డూను దక్కించుకున్నారు. నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఊరేగింపుగా లడ్డును ఆదిరెడ్డికి అందజేశారు.
ఫిర్యాదు దారుని సమస్యల పట్ల శ్రద్ధ వహించి వారి సమస్యలను గడువులోగా పరిష్కరించాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ తదితర సమస్యల పరిష్కారం కోసం ప్రజలు వినతి పత్రాలను అందజేశారు. వాటిని వెంటనే పరిష్కరించాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 11న గుంటూరు నగరానికి రానున్నారు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసు విషయంలో బ్రాడీపేటలోని సబ్- జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్తో ఈ సందర్భంగా జగన్ ములాఖత్ కానున్నారు. తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరి గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు రోడ్డు మీదుగా సబ్ జైలుకు జగన్ చేరుకోనున్నారు.
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఓఎస్డీగా మాజీ ఐఏఎస్ సుబ్బారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్గా విధులు నిర్వహించి పదవి విరమణ చేశారు. అనంతరం మంత్రి ఓఎస్డీగా నియమితులై సోమవారం బాధ్యతలు స్వీకరించారు. తహశీల్దార్ నుంచి ఈ స్థాయికి చేరుకున్నారు.
భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటల అంచనాను 24 గంటల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. ప్రభుత్వం అందించిన ఫార్మాట్లలో సమాచారాన్ని పొందుపరచాలన్నారు. వ్యవసాయం, ఉద్యానవనం, మత్స్యశాఖ అంచనాలు విడివిడిగా అందజేయాలన్నారు. పట్టణాలు, మండలాల్లో ఇళ్లు దెబ్బతిన్న వాటిని వేర్వేరుగా నమోదు చేయాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు.
ప్రకృతి విపత్తులు నెలకొన్నప్పుడు క్షేత్ర స్థాయిలో ఉండే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది చురుగ్గా పనిచేయాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు పేర్కొన్నారు. సచివాలయ సిబ్బంది కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడే ప్రజా సమస్యలు తెలుస్తాయని తెలిపారు. సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 50 దరఖాస్తులు వచ్చాయి.
ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో చంద్రబాబు అరెస్ట్ కాగా, ఆ ఘటన జరిగి నేటికి ఏడాది సందర్భంగా మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ‘నిండు చంద్రుడు, ప్రజలు ఒక వైపు.. నియంత జగన్ కుట్రలు మరో వైపు.. చంద్రబాబు అక్రమ నిర్బంధంపై తెలుగుజాతి ఒక్కటై ఉద్యమించింది. రాష్ట్ర ప్రగతి కోసం, తెలుగు ప్రజల కోసం పరితపించే చంద్రబాబు ఏడాది క్రితం తప్పుడు కేసులో అరెస్ట్ చేయడమే వైసీపీ సమాధికి జనం కట్టిన పునాది అయింది’ అని పోస్ట్ చేశారు.
ఓ ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పట్టాభిపురం పీఎస్లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ హనుమంతురావు కోర్టులో పనిచేసే ఉద్యోగినికి అసభ్యకర పోస్టులు పెడుతూ వేధిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆమె పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన అనంతరం, నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేశారు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మయన్మార్కు చెందిన కొండన్న(38) ఆదివారం పాముకాటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, కాటేసిన పాముకోసం వెతుకుతూ గంటన్నర పాటు వెతకడం ప్రాణాలు పోయేలా చేసినట్లు తెలుస్తోంది. మయన్మార్లో ఎవరినైనా పాము కరిస్తే దానిని చంపి ఆస్పత్రికి తీసుకెళ్తే, ఆపాము జాతిని బట్టి వైద్యం చేస్తారు. ఇదే విధంగా కొండన్న కూడా పాము కోసం వెతికి వైద్యసాయం ఆలస్యంగా పొందడమే చనిపోవడానికి కారణమైంది.
అకాల వర్షాల కారణంగా మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో జరగాల్సిన ప్రజా వేదిక కార్యక్రమం వారం రోజుల పాటు రద్దు అయినట్లు కార్యాలయ కార్యదర్శి పరుచూరి అశోక్ బాబు తెలిపారు. అకాల వర్షాలు, వరదలు కారణంగా అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉండటంతో మంగళగిరి టీడీపీ పార్టీ కేంద్ర కార్యలయంలో జరగాల్సిన ప్రజా వేదిక కార్యక్రమం ఇవన్నీ ఈనెల 9 నుంచి 15 వరకు రద్దు అయినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.