India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంటూరు సమీపంలోని ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఫిరంగిపురానికి చెందిన కాకుమాను సందీప్ మృతి చెందాడు. సందీప్ స్కూటీపై గుంటూరు వెళుతుండగా పలకలూరు రోడ్డులోని JLE సినిమా హాల్ సమీపంలో లగేజ్ ఆటో ఢీకొట్టింది. ఈ వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
విజ్ఞాన్ యూనివర్సిటీ ఈ ఏడాది విశాట్-2025 ఫేజ్-1కు విశేష స్పందన లభించిందని తెలిపింది. శనివారం విడుదలైన ఫలితాలు విద్యార్థుల్ని ఉత్సాహపరిచాయి. ఏప్రిల్ 16 నుంచి 20 వరకు హైదరాబాద్లో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు వైస్ ఛాన్సలర్ నాగభూషణ్ వెల్లడించారు. అలాగే, ఫేజ్-2 ప్రవేశ పరీక్షలు ఏప్రిల్ 13 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో మెరుగైన ప్రతిభ చూపారు. శనివారం సాయంత్రం కళాశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో విద్యా సంస్థల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్ మాట్లాడుతూ.. విద్యార్థుల కృషితో పాటు అధ్యాపకుల సహకారమే ఈ విజయానికి కారణమన్నారు. అధినేత లావు రత్తయ్య ఫలితాలపై ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
దుగ్గిరాల (M) చినపాలెంలో శనివారం జరిగిన విషాద ఘటన గ్రామాన్ని కన్నీళ్లలో ముంచింది. ఓ జూనియర్ కాలేజీలో CEC మొదటి సంవత్సరం చదువుతున్న అవినాశ్ (17) ఇంటర్ పరీక్షల్లో 2 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఫలితాలు వెలువడిన వెంటనే తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూలి పనుల నుంచి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు అవినాశ్ను చూసి కన్నీటి పర్యంతమయ్యారు.
బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యాన పౌర్ణమి సందర్భంగా శనివారం చండీహోమం నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు మస్తానయ్య మాట్లాడుతూ.. విశ్వ మానవాళి కోసం శాంతిని కాంక్షిస్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో 9 మంది వేద పండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించడం జరిగిందన్నారు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో పొన్నూరుకు చెందిన విద్యార్థిని సత్తా చాటుకుంది. నాదెండ్ల కృష్ణ ప్రియ అనే విద్యార్థిని ఇంటర్ ఫస్ట్ ఈయర్లో 467 మార్కలు సాధించింది. ఆమె ఫాదర్ గవర్నమెంట్ టీచర్గా పని చేస్తున్నారు. మంచి మార్కులు రావడంపై తల్లిదండ్రులు, అధ్యాపకులు కృష్ణ ప్రియను అభినందిస్తున్నారు.
రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సంబంధించి ఫస్టియర్లో గుంటూరు జిల్లా 58 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచింది. సెకండియర్లో 76% ఉత్తీర్ణతతో జిల్లా విద్యార్థులు 2వ స్థానంలో నిలవడం విశేషం. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు సాధించిన ఈ విజయాన్ని అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందిస్తున్నారు.
పాత గుంటూరులో ఏప్రిల్ 1న జరిగిన హత్య కేసులో పరారీలో ఉన్న ఫైరోజ్, ఫయాజ్లు అరెస్టైయ్యారు. షేక్ అర్షద్ బాలికను వేధిస్తున్నాడు. విషయం తెలుసుకున్న బాలిక సోదరులు ఫైరోజH, ఫయాజ్లు స్నేహితులతో కలిసి అర్షద్ను తీవ్రంగా కొట్టారు. దీంతో అర్షద్ కుటుంబ సభ్యులు బాలిక కుటుంబంపై దాడి చేశారు. ప్రతిగా ఫైరోజ్, ఫయాజ్లు అర్షద్ కుటుంబంపై దాడి చేయడంతో అర్షద్ అమ్మమ్మ చనిపోయింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇంటర్ ఫలితాల్లో గుంటూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఇంటర్ సెకండ్ ఇయర్లో 28, 231 మంది పరీక్షలు రాయగా 25, 246 మంది పాసయ్యారు. 91 శాతం పాస్ పర్సంటేజీతో గుంటూరు జిల్లా రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్లో 32,613 మందికి 26,872 మంది పాసయ్యారు. 82 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 2వ స్థానంలో గుంటూరు జిల్లా నిలిచింది.
మాచవరం మండలం చెన్నాయిపాలెంలో శుక్రవారం రాత్రి వైసీపీ నేత, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఈర్ల సుబ్బారావు, ఆయన సోదరుడు వెంకటేశ్వర్లుపై గ్రామంలోని కొందరు దాడి చేశారు. సుబ్బారావు తలకు తీవ్ర గాయమైంది. సుబ్బారావు ఫిర్యాదుతో మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. గాయపడిన వారిని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Sorry, no posts matched your criteria.