Guntur

News April 17, 2024

సత్తెనపల్లిలో మంత్రి అంబటి ఫొటోతో టీ కప్పులు

image

సత్తెనపల్లిలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో పట్టణంలోని టీ స్టాల్‌లలో మంత్రి అంబటి రాంబాబు, నరసరావుపేట పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్‌ల ఫొటోలతో ఉన్న టీ కప్పులు దర్శనమిస్తున్నాయి. కొందరు వైసీపీ నాయకులు తమకు ఈ కప్పులు ఇచ్చారని, టీ కొట్టు నిర్వాహకులు చెబుతున్నారు.

News April 17, 2024

గుంటూరు జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలివే.!

image

గుంటూరులో బుధవారం లీటర్ పెట్రోల్ ధర రూ.109.73, లీటర్ డీజిల్ ధర రూ.97.56గా ఉంది. పది రోజులుగా వీటి ధరలు నిలకడగానే ఉన్నాయి. బాపట్లలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.98 ఉండగా, డీజిల్ ధర రూ.96.85గా ఉంది. పల్నాడులో డీజిల్ ధర రూ.97.42 ఉండగా, పెట్రోల్‌ను రూ.109.60కి విక్రయిస్తున్నారు.

News April 17, 2024

గుంటూరు: నేడు టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే.?

image

మాజీ MLA నంబూరు సుభాని నేడు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఆయన తన తనయుడు, డిప్యూటీ మాజీ మేయర్ గౌస్‌తో కలిసి చంద్రబాబు, లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 2004లో గుంటూరు తూర్పు నుంచి సుభాని గెలిచారు. 2014, 19 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపునకు పని చేశారు. టీడీపీలో చేరేందుకు సిద్ధమైన సుభాని, ఉండవల్లికి కార్లతో ర్యాలీగా వెళ్లనున్నట్లు సమాచారం.

News April 17, 2024

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: ఐజీ త్రిపాఠి

image

ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు నిర్వహించాలని గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం పోలీస్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ ప్రక్రియను ఎలక్షన్ కమిషన్ నిబంధన ప్రకారం అమలు చేయాలన్నారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎస్పీ తుషార్, ఏఎస్పీలు పాల్గొన్నారు.

News April 16, 2024

ఈనెల 18 నుంచి నామినేషన్లు స్వీకరిస్తాం: పల్నాడు కలెక్టర్

image

ఈనెల 18 నుంచి ఎన్నికల నామినేషన్ల స్వీకరిస్తున్నట్లు పల్నాడు కలెక్టర్ శివశంకర్ తెలిపారు. 18న ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. 18 నుంచి నామినేషన్లను స్వీకరించనున్నట్లు చెప్పారు. నామినేషన్ల గడువు 25తో ముగుస్తుందన్నారు. 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు అన్నారు. మే 13వ తేదీ పోలింగ్ జరుగుతుందని, జూన్ 4వ ఓట్ల లెక్కింపు ఉంటుందని ఆయన తెలిపారు. 

News April 16, 2024

ముప్పాళ్లలో ట్రాక్టర్ బోల్తా.. మహిళ మృతి

image

ట్రాక్టర్ బోల్తా పడి వివాహిత మృతి చెందిన ఘటన ముప్పాళ్ల మండలం తురకపాలెంలో జరిగింది. తురకపాలెం గ్రామానికి చెందిన పలువురు పొలం పనుల నిమిత్తం ట్రాక్టర్‌లో వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనలో కృపావతి (40) మృతి చెందగా.. నలుగురికి గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాల తరలించి, క్షతగాత్రులను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 16, 2024

గుంటూరులో వృద్ధుడు మృతి.. కేసు నమోదు

image

గుంటూరులో ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటనపై మంగళవారం రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రైల్వే స్టేషన్‌లోని నాలుగో ఫ్లాట్ ఫారంపై వృద్ధుడు అపస్మారక స్థితిలో పడి ఉండగా అక్కడి సిబ్బంది ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని వివరాలు తెలిసిన వాళ్ళు గుంటూరు రైల్వే పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

News April 16, 2024

గుంటూరు: 45 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు

image

గుంటూరు పార్లమెంట్‌, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల విధుల నిర్వహణకు 4600 మంది పోలింగ్‌ అధికారులను నియమించారు. ఇందులో సోమవారం మొదటి విడతగా 2300 మందికి శిక్షణనిచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరవ్వని 45 మందికి షోకాజు నోటీసులు జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. నోటీసులు అందుకున్న వారు 24 గంటల్లోగా సంజాయిషీ ఇవ్వాలని స్పష్టం చేశారు.

News April 16, 2024

గుంటూరు మీదుగా సికింద్రాబాద్-సంత్రాగచి ప్రత్యేక రైలు.

image

వేసవికాలం ప్రయాణికుల రద్దీ కారణంగా గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈనెల 20 నుంచి జూన్ 29వ తేదీ వరకు ప్రతి మంగళ, శనివారాల్లో సికింద్రాబాద్లో బయలుదేరి సంత్రాగచి బుధ, శనివారాల్లో చేరుతుందన్నారు. తిరిగి ఈనెల 21 నుంచి జూన్ 30వ తేదీ వరకు సత్రాగచిలో ప్రతి బుధ, ఆదివారాల్లో బయలుదేరి సికింద్రాబాద్ గురు, సోమవారాల్లో చేరుతుందన్నారు. 

News April 16, 2024

నరసరావుపేట BSP ఎమ్మెల్యే అభ్యర్థిగా బూదాల

image

నరసరావుపేట బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బూదాల బాబురావుని నియమిస్తున్నట్లు, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు భక్కా పరంజ్యోతి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. నరసరావుపేటలోని అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పార్టీని బలోపేతం చేసి గెలుపు దిశగా ప్రయాణించాలని అన్నారు. అన్ని వర్గాల వారు బాబురావు సహాయ సహకారాలు అందించాలని కోరారు.