India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా మనం అందించే సహాయం దేశ రక్షణలో అశువులు బాసిన వీర జవాన్ల కుటుంబ సంక్షేమానికి ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ నాగలక్ష్మీ పేర్కొన్నారు. శనివారం కలక్టరేట్లో ఫ్లాగ్ డే సందర్భంగా నిర్వహించిన సాయుధ దళాల పతాక దినోత్సవ విరాళాల కార్యక్రమాన్ని కలెక్టర్ మొదటి విరాళాన్ని ఇచ్చి ప్రారంభించారు. డీఆర్ఓ షేక్ ఖాజావలి, ఆర్డీఓ కే. శ్రీనివాస రావు కూడా విరాళాలు అందించారు.

గుంటూరు లక్ష్మీపురంలోని స్పా సెంటర్లో జరుగుతున్న వ్యభిచార గుట్టు పోలీసులు రట్టు చేసిన విషయం తెలిసిందే. వ్యభిచారం జరుగుతుందని సమాచారం అందడంతో ఒకే సారి 17 సెంటర్లపై ఏఎస్పీ సుప్రజ నేతృత్వంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో థాయ్ లాండ్కి చెందిన నలుగురు, నార్త్ ఇండియాకి చెందిన ముగ్గురు, మరో స్పా సెంటర్లో ఏడుగురు యువతులు, ముగ్గురు విటులు, ఆయా సెంటర్ల నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నామన్నారు.

దేశ వ్యాప్తంగా 85 కొత్త కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించేందుకు ఆమోదం తెలిపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్లో 8 కేంద్రియ విద్యాలయాలకు ఆమోదం లభించిందని ఎంపీ లావు కృష్ణదేవరాయలు అన్నారు. ఇందులో పల్నాటి వాసులు ఎంతగానో ఎదురు చూస్తున్న రొంపిచర్ల, మాచర్ల మండలంలోని తాళ్లపల్లిలో కేంద్రియ విద్యాలయాలకు ఆమోదం లభించి, ప్రారంభానికి లైన్ క్లియర్ అయిందన్నారు. ఈ సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ఈనెల 10,11 తేదీలలో వెలగపూడి సచివాలయం వద్ద జరిగే జిల్లా కలెక్టర్ల సమావేశానికి సంబంధించి ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం కలెక్టర్ నాగలక్ష్మీ పరిశీలించారు. సీటింగ్ ఏర్పాట్లు, అకామడేషన్ ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు చేశారు. వెహికల్ పార్కింగ్, సెక్యూరిటీ, భోజన ఏర్పాట్ల గురించి ఆమె స్థానిక అధికారులతో మాట్లాడారు. డ్యూటీలు కేటాయించిన అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని కలెక్టర్ చెప్పారు.

బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ శుక్రవారం కేంద్ర మంత్రి అమిత్షాను న్యూఢిల్లీలో కలిశారు. ఈ భేటీలో ఎంపీ కృష్ణప్రసాద్ రాష్ట్రంలో అమలవుతున్న విపత్తు నిర్వహణ విధానాన్ని, ఇటీవల వచ్చిన వరదల గురించి ఆయనకు తెలియజేశారు. రాష్ట్రంలో విజయవాడతో సహా వరదలకు ప్రభావితమయ్యే ప్రాంతాల వివరాలను ఎంపీ తెన్నేటి, అమిత్ షాకు వివరించారు.

సీఎం చంద్రబాబు శనివారం షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి బాపట్ల చేరుకుంటారు. పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఉండవల్లి నివాసానికి చంద్రబాబు వస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి విజయవాడలో పలు కార్యక్రమంలో పాల్గొని, తిరిగి రాత్రికి హైదరాబాద్లోని నివాసానికి వెళతారు.

బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి ఆహ్వానించినందుకు మంత్రి లోకేశ్ యాజమాన్య కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. మెగా పీటీఎంలో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. విద్యా శాఖలో విప్లవాత్మక మార్పులకు ఈ డిజిటల్ ఇన్విటేషన్లు ఓ ఉదాహరణ. అని ట్వీట్ చేశారు. లక్షలాది మంది పూర్వ విద్యార్థులతో పండుగ వాతావరణంలో Mega PTM జరుపుదామని చెప్పారు.

గుంటూరు లక్ష్మీపురంలోని ఓ స్పా సెంటర్ ముసుగులో జరుగుతున్న వ్యభిచారం గుట్టును పోలీసులు రట్టు చేశారు. వ్యభిచారం జరుగుతుందని సమాచారం అందడంతో ఏఎస్పీ సుప్రజ నేతృత్వంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా అక్కడ జరుగుతున్న ఉదంతాన్ని చూసి పొలీసులే కంగుతిన్నారు. ఈ క్రమంలో సెంటర్ లోపల ఉన్న పలువురు యువతులు, యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు పట్టుబడిన వారిలో ఎక్కువగా యువతులు ఉండటం గమనార్హం.

గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ, జాయింట్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ పాల్గొని అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే పౌరులకు ప్రాధమిక హక్కులు లభించాయని కలెక్టర్ చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తితో అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని అన్నారు.

తమిళ నటుడు జెమినీ గణేశన్ సావిత్రి ఫోటోలు తీయటంతో వారి పరిచయం పెళ్లిగా మారింది. అప్పటికే ఆయనకు ఇద్దరు భార్యలున్నారు. సావిత్రికి విజయ చాముండేశ్వరి అనే కూతురు, సతీశ్ కుమార్ అనే కొడుకు జన్మించారు. కుటుంబ కలహాలు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడంతో ఒక దశలో బాగా బతికిన ఆమె చివరి దశలో పేద జీవితాన్ని గడిపింది. అనారోగ్యంతో ఒక సంవత్సరం కోమాలో ఉండి 1981 డిసెంబరు 26న 46 సంవత్సరాల వయసులో మరణించింది.
Sorry, no posts matched your criteria.