Guntur

News December 6, 2024

మహానటి సావిత్రి పుట్టింది మన తాడేపల్లిలోనే

image

మహానటి సావిత్రి మన తాడేపల్లి మం. చిర్రావూరులో డిసెంబర్ 6, 1936న నిశ్శంకర గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు జన్మించింది. నేడు ఆమె జయంతి సందర్భంగా అభిమానులు ఆమెను గుర్తు చేసుకుంటున్నారు. ఆమె చిన్నతనంలో తండ్రిని పోగొట్టుకోగా.. పెదనాన్న వెంకట్రామయ్య ఆమెను పెంచి పెద్దచేశాడు. ఆమె చిన్న పాత్రలతో తన ప్రస్థానం మొదలు పెట్టి అగ్ర కథానాయికగా ఎదిగి.. 250కన్నా ఎక్కువ సినిమాలలో నటించారు. 

News December 6, 2024

అమరావతిలో దెయ్యాలు అంటూ వదంతులు

image

అమరావతి పరిసర ప్రాంతాల్లో ఇటీవల దెయ్యాలు సంచరిస్తున్నాయనే వదంతులు ప్రజల్లో భయాందోళనలను పెంచుతున్నాయి. అమరావతి నుంచి విజయవాడ వెళ్లే రోడ్డులోని ఓ పాతబడిన రెస్టారెంట్ వద్డ దెయ్యాలు కనిపించాయంటూ.. వారం రోజులుగా ఈ ప్రచారం జరుగుతోంది. చిన్నారులు, వృద్ధులు రాత్రి వేళ బయట తిరగడానికి భయపడుతున్నారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని అధికారులను కోరుతున్నారు.

News December 6, 2024

GNT: ANUలో గెస్ట్ ఫ్యాకల్టీ అరెస్ట్

image

ANUలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న పృథ్వీరాజ్ అరెస్ట్ అయ్యాడు. పోలీసుల కథనం.. పెదకాకాణిలోని నంబూరు విజయభాస్కర్ నగర్‌కు చెందిన యువతి ANUలో ఇంజినీరింగ్ చదువుతోంది. పృథ్వీ ఆ యువతికి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకోమని కోరగా నిరాకరించడంతో.. యువతి పోలీసులను ఆశ్రయించింది. ఆతనికి నగదు, లాప్‌ట్యాప్ ఇచ్చినట్లు పేర్కొంది. నిందితుడిని గురువారం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు.

News December 6, 2024

విడదల రజినిపై పోలీసులకు ఫిర్యాదు

image

మాజీ మంత్రి విడదల రజిని దళిత రైతుల భూములు లాక్కున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈక్రమంలో యడవల్లికి చెందిన దళిత రైతులు చిలకలూరిపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి విడదల రజిని తమను మభ్యపెట్టి విలువైన గ్రానైట్ ఉన్న తమ భూములను లాక్కున్నారని వాపోయారు. వారిద్దరిపై కేసు నమోదు చేయాలని కోరారు.

News December 6, 2024

తెనాలిని జిల్లా కేంద్రంగా మార్చాలి: సత్యకుమార్

image

తెనాలిని జిల్లా కేంద్రంగా మార్చాలని కొల్లూరుకు విచ్చేసిన రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్, మాజీ మంత్రి, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబులకు కొల్లూరు మండలం టీడీపీ సీనియర్ నేత వెంకట సత్యకుమార్ వినతిపత్రం అందజేశారు. అదే విధంగా గాజుల్లంక శ్రీకాకుళం మధ్య కాజ్వే నిర్మించాలని, 75 ఎకరాలలో మూతబడి ఉన్న జంపని షుగర్ ఫ్యాక్టరీని మెడికల్ కాలేజీగా మార్చాలని కోరారు. 

News December 5, 2024

జ‌గ‌న్ మ‌రో నాట‌కానికి సిద్ద‌మౌతున్నారు: బాలాజీ

image

అసెంబ్లీకి వెళ్లకుండా వీధి నాట‌కాలు ఆడిన వైసీపీ అధినేత జ‌గ‌న్ మ‌రో నాట‌కానికి సిద్ద‌మౌతున్నార‌ని జ‌న‌సేన సెంట్రల్ ఆంధ్ర కో-క‌న్వీన‌ర్ బాలాజి అన్నారు. గురువారం ఆయ‌న కార్యాల‌యంలో మాట్లాడుతూ.. జగన్ ప్రజల పక్షాన కూటమి ప్రభు­త్వంపై పోరాటం చేయడానికి సిద్ద‌మౌతున్న‌ట్లు ప్ర‌క‌టించార‌ని, దీని ద్వారా కూట‌మి ప్ర‌భుత్వంపై బుర‌ద‌జ‌ల్లుడు కార్య‌క్ర‌మాన్ని కొన‌సాగించ‌నున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

News December 5, 2024

ఏపీ ప్రభుత్వంతో గూగుల్ కీలక ఒప్పందం

image

ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణల కోసం ఏపీ ప్రభుత్వం, గూగుల్ సంస్థ మధ్య గురువారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి లోకేశ్ సమక్షంలో గూగుల్ మ్యాప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితా రమణి, ఏపీ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ కార్యదర్శి సురేశ్ కుమార్ నడుమ అవగాహన ఒప్పందం జరిగింది. ఒప్పందం ప్రకారం ఏఐ రంగంలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఏపీలోని పాఠశాలలు, కళాశాలల్లో గూగుల్ సంస్థ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

News December 5, 2024

గుంటూరు మిర్చి యార్డ్ తరలింపు 

image

200 ఎకరాల్లో, అత్యాధునిక సౌకర్యాలతో నూతన మిర్చి యార్డును ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. గురువారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం నడుస్తున్న గుంటూరు మిర్చి యార్డ్‌పై అనేక విధాలుగా ఒత్తిడి పడుతోందని చెప్పారు. అందరి అభిప్రాయం మేరకు యార్డును తరలిస్తామన్నారు. ఆ స్థలాన్ని వేరే ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తామని ప్రకటించారు.

News December 5, 2024

పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అనుకుంటివా: అంబటి

image

పుష్ప-2 సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. అల్లు అర్జున్ అభిమానులు బుధవారం రాత్రి నుంచి థియేటర్ల వద్ద రచ్చ రచ్చ లేపుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు సినిమాపై స్పందించారు. ‘పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అనుకుంటివా కాదు వరల్డ్ ఫైర్’ అంటూ తన X ఖాతాలో రాసుకొచ్చారు.

News December 5, 2024

మంగళగిరిలో ఎర్రచందనం పట్టివేత 

image

మంగళగిరి మండలం కాజ టోల్ ప్లాజా వద్ద బుధవారం రాత్రి ఎర్రచందనం అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 10 చక్రాల లారీలో ఎవరికి అనుమానం రాకుండా A4 పేపర్ బండిల్స్ మధ్యన సుమారు 50 దుంగలను దాచి తరలిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. చెన్నై నుంచి అస్సాం… అస్సాం నుంచి చైనా దేశానికి ఎర్ర చందనం దుంగలను తరలిస్తున్నట్టు ప్రాథమిక సమాచారం.