India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అధికారిక గణాంకాల ప్రకారం ఉమ్మడి గుంటూరు జిల్లాలో HIV రోగులు భారీగా ఉన్నారు. గుంటూరులో 16,630, పల్నాడులో 17,536, బాపట్లలో 11,356 మంది HIV రోగులుండగా, 2023లో అత్యల్ప సంఖ్యలో కొత్తగా వైరస్ సోకిన జిల్లాలో గుంటూరు ఉంది. కాగా HIV రోగులకు ప్రతి నెలా రూ.4,000 పింఛన్ ఇస్తున్నట్లు AP స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ(ఏపీ శాక్స్) అధికారులు తెలిపారు. మొత్తంగా రాష్ట్రంలో 42,924 మందికి ఈ పింఛన్ అందుతుంది.

కారంపూడి వీరుల తిరుణాల్లా సందర్భంగా మూడోరోజు మందపోరు… కోడిపోరులో రాజ్యాన్ని కోల్పోయిన మలిదేవాదుల అరణ్యవాసం చేసేందుకు మందాడి గ్రామంలో ఉంటాడు. బ్రహ్మనాయుడిని ఎలాగైనా చంపాలని మండాది గ్రామంపై దాడి చేసింది. ఈ క్రమంలో ఆవులను అంతమొందించేందుకు నాగమ్మ పన్నాగం ద్వారా అడవి చెంచులు దాడి చేసే క్రమంలో కాపరి లంకన్న అసువులు బాస్తాడు. లంకన్నకు శంఖుతీర్ధం ఇవ్వటం ద్వారా బ్రహ్మన్న విముక్తిని ప్రసాదిస్తాడు.

పల్నాటి వీరుల చరిత్రను తొలిసారి శ్రీనాథుడు 300 సంవత్సరాల తర్వాత మంజరీ ద్విపద కావ్యముగా రచించగా, ఇది ఆయన చివరి రచన. శ్రీనాథుని తర్వాత కొండయ్య, మల్లయ్య (16వ శతాబ్దం) అను కవులు రచించారు. ఆ తర్వాత 1862 ప్రాంతంలో ముదిగొండ వీరభద్రకవి ఈ కథను వీర భాగవతం పేరుతో మనోహరమైన పద్యకావ్యంగా రచించారు. అక్కిరాజు ఉమాకాంతం మొట్టమొదట పల్నాటి వీరచరిత్ర యొక్క ప్రతులు సంపాదించి, సంస్కరించి 1911లో అచ్చువేయించారని సమాచారం.

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు వరకు ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెనాలి పట్టణ పరిధిలోని ఐతానగర్లో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి ధాన్యం విక్రయించవద్దని, ప్రభుత్వానికి ధాన్యం విక్రయించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు మీద ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని భరోసా కల్పించారు.

మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో సోమవారం ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కార్యాలయ నిర్వాహకులు ఆదివారం తెలిపారు. రేపు జరిగే ప్రజా వేదికలో గుంటూరు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, APTDC ఛైర్మన్ నూకసాని బాలాజీ, ఏపీ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఛైర్మన్ కేకే చౌదరి పాల్గొంటారని చెప్పారు. ఈ ప్రజా వేదికలో వారు ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారన్నారు. అందరూ ఈ ప్రజా వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

పల్నాటి ఉత్సవాలలో భాగంగా ప్రస్తుతం వీరాచారాన్ని చేస్తున్నది పిడుగు వంశీకులలోని పిడుగు తరుణ్ చెన్నకేశవ అయ్యవారు. ఆయన తండ్రి విజయ్, తల్లి సరస్వతి. చిరుప్రాయంలోనే పల్నాటి వీరాచారాన్ని కొనసాగిస్తున్నాడు. ఒక పక్క చదువుతూ తండ్రి బొగ్గరం విజయ్ నేతృత్వంలో ఆచారాన్ని కొనసాగిస్తూ ప్రజల మన్ననలు పొందారు. గ్రామంలో నేటికి అలనాటి చారిత్రక చిహ్నాలు ఉన్నప్పటికి ఆదరించే అధికారులు కానరాక శిథిలావస్థకు చేరాయి.

కారంపూడి వీరుల తిరుణాల్ల సందర్భంగా రెండోరోజు రాయబారం.. అలరాజు కోడిపోరులో ఓడిన మాచర్ల రాజ్యాన్ని తిరిగి మలిదేవులకు అప్పగించాలని గురజాల రాజు నలగాముని వద్దకు సంధికి వెళతాడు. ఈ క్రమంలో నాగమ్మ ప్రభావంతో తంబళ్ల జీయర్ ద్వారా చర్లగుడిపాడు వద్ద హత్యకు గురవుతాడు. ఆనాటి హత్యాకాండను వీరవిద్యావంతులు ఆలపిస్తుంటారు. ఈ క్రమంలో ఆచారవంతులు అవేశపూరితంగా కత్తిసేవ చేస్తుండటం నేటికి దర్శనీయమే.

దేశాన్ని, రాష్ట్రాన్ని ఆర్థిక క్రమశిక్షణలో నడిపిస్తున్న పీఎం నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబుపై అభిమానం వెయ్యి రెట్లు పెరిగిందని చెప్పడానికి గర్వంగా ఉందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులో ఏపీ టాక్స్ ప్రాక్టీషనర్స్ కన్సల్టెన్సీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశ ఆర్థిక ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న ఆడిటర్లు, అకౌంటెంట్లకు అభినందనలు తెలిపారు.

బియ్యం అక్రమ రవాణాపై పవన్ చొరవ సంతోషకరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో శనివారం మాట్లాడుతూ డిప్యూటీ సీఎం హోదాలో పవన్కి.. ఎక్కడికైనా వెళ్లి విచారణచేసే అర్హత ఉందన్నారు. మేం కూడా బియ్యం అక్రమ రవాణాపై ప్రశ్నించామన్నారు. జగన్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. అదానీతో జగన్ ఒప్పందంపై విచారణ జరపాలని పురంధేశ్వరి డిమాండ్ చేశారు.

పల్నాటి యుద్ధం, ఆంధ్రాలోని పల్నాడు ప్రాంతములో 1176-1182 మధ్యకాలంలో జరిగింది. మహాభారతానికి, పల్నాటి వీరుల చరిత్రకు దగ్గరి పోలికలు ఉండటంతో దీనిని ‘ఆంధ్ర భారతం’ అనికూడా అంటారు. పల్నాటి యుద్ధంలో జరిగిన అపారమైన జన, ఆస్తి నష్టం వల్ల ఆంధ్ర రాజులందరూ బలహీనులయ్యారు. ఈ పరిస్థితిలో కాకతీయులు ఇక్కడున్న రాజులందరినీ ఓడించారు. కాగా కారంపూడిలో యుద్ధం జరిగిన స్థలాన్ని గుర్తించారు.
Sorry, no posts matched your criteria.