India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పల్నాడు జిల్లాలో బస్సు యాత్ర నిర్వహిస్తున్న సీఎం జగన్ మంగళవారం ప్రజల మధ్య ఉగాది వేడుకలు జరుపుకోనున్నారు. వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం గంటవారిపాలెంలో జగన్ సతీసమేతంగా వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన ఉగాది పంచాంగ శ్రవణం వింటారు. నిన్న జగన్ యాత్ర పల్నాడు జిల్లాలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.
ఇండియా కూటమిలో భాగంగా సీపీఎం రాష్ట్రంలోని 10 ఎమ్మెల్యే, ఒక లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఈ క్రమంలో మంగళగిరి సీపీఎం అభ్యర్థిగా జొన్నా శివశంకర్కు టికెట్ కేటాయించింది. కాంగ్రెస్ పార్టీలో చర్చల అనంతరం సీపీఎం సోమవారం అభ్యర్థులను ఫైనల్ చేసింది. మరోవైపు, మంగళగిరి నుంచి వైసీపీ బరిలో మురుగుడు లావణ్య, కూటమి అభ్యర్థిగా నారా లోకేశ్ బరిలో దిగుతున్న విషయం తెలిసిందే.
రానున్న సార్వత్రిక ఎన్నికలలో పీఓలు భయంతో కాకుండా బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ శివ శంకర్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో పిఓలు, ఏఎల్ఎంటీలకు ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పోలింగ్ జరిగే రోజున జాగ్రత్తగా విధులు నిర్వహించాలని, ప్రతికూల పరిస్థితులు ఏమైనా ఎదురైతే చాకచక్యంగా వ్యవహరించి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్నారు.
మండలంలోని ముట్లూరు గ్రామంలో సోమవారం విద్యుత్ షాక్తో యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ముట్లూరుకు చెందిన అలెక్స్ (24) తన నివాసంలో మంచినీటి మోటారు మరమ్మతులు చేస్తుండగా.. విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు. అలెక్స్ హైదరాబాద్లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల తండ్రికి అనారోగ్యంగా ఉండడంతో ముట్లూరు వచ్చాడు.
వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పై అనర్హత వేటు వెయ్యాలని అసెంబ్లీ కార్యదర్శికి వైసీపీ ఫిర్యాదు చేసింది. కౌన్సిల్ విప్ లేళ్ల అప్పిరెడ్డి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన జంగా కృష్ణమూర్తి పార్టీ నిబంధనలు ఉల్లంఘించడంతో ఆయనపై అనర్హత వేటు వెయ్యాలని కోరారు.
ఈనెల 10న పిడుగురాళ్ల బైపాస్ వద్ద సీఎం జగన్ మేమంతా సిద్ధం బహిరంగ సభ జరుగుతుందని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. సోమవారం కొండమోడులో విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. 12వ తేదీన రాజుపాలెం నుంచి గుంటూరు వైపు సత్తెనపల్లి మీదుగా రోడ్ షో ఉంటుందని తెలిపారు. అలాగే 24న సత్తెనపల్లి వైసీపీ అభ్యర్థిగా తాను నామినేషన్ దాఖలు చేస్తున్నానని చెప్పారు.
మాచర్లలో 1967 ఎన్నికల్లో 80 ఓట్ల మెజారిటీతో వెన్న లింగారెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఈయన జూలకంటి నాగిరెడ్డిని ఓడించారు. ఈ నియోజకవర్గంలో ఇదే ఇప్పటి వరకు అత్యల్ప మెజారిటీ. మరోవైపు, ఇదే నియోజకవర్గంలో పి. లక్ష్మారెడ్డిది అత్యధిక మెజారిటీ. (2004లో 30,666). తాజా ఎన్నికల్లో వైసీపీ నుంచి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, కూటమి నుంచి జూలకంటి బ్రహ్మనందరెడ్డి పోటీ పడుతున్న విషయం తెలిసిందే.
విద్యుదాఘాతం వల్ల కౌలు రైతు కుటుంబం సర్వస్వం కోల్పోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్లూరు మండలం తడికలపూడి గ్రామానికి చెందిన రావుల కిరణ్ బాబు పూరిళ్లు విద్యుదాఘాతంతో దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంటితో పాటు రూ.3 లక్షల నగదు, ఆస్తి పత్రాలు, సామాన్లు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ.7 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధిత కుటుంబం తెలిపింది.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నర్సాపూర్- సికింద్రాబాద్ మధ్య నడిచే ప్రత్యేక రైలును గుంటూరు మీదుగా నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈ రైలు (07169) ఈనెల 14, 21, 28 తేదీల్లో నర్సాపూర్లో 18.00 గంటలకు బయలుదేరి, విజయవాడ 21, 35, గుంటూరు 22: 45 సత్తెనపల్లి 23.24, పిడుగురాళ్ల 23: 56 సికింద్రాబాద్ 04.50 గంటలకు చేరుతుంది.
గుంటూరు పట్టణంలో ఓ ప్రైవేట్ వైద్యశాలలో నర్సుగా పనిచేస్తున్న బెల్లంకొండ మండలానికి చెందిన యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికుల కథనం మేరకు యువతికి తల్లిదండ్రులు లేరని ప్రైవేట్ వైద్యశాలలో నర్సుగా పనిచేస్తూ జీవనం సాగిస్తుందన్నారు. ఆదివారం యువతి నిస్సహాయ స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.