India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

స్కిల్ సెన్సస్ నిరుద్యోగ యువతకు ఉపయోగకరంగా ఉండాలని, యువతకు ఉద్యోగాల కల్పనే సెన్సస్ అంతిమ లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. స్కిల్ సెన్సస్, స్కిల్ డెవలప్ మెంట్ శాఖపై ఉండవల్లి నివాసంలో లోకేశ్ బుధవారం సమీక్షించారు. ఎసెస్మెంట్ చేయకుండా కేవలం సెన్సస్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని, ప్రిఎసెస్ మెంట్ కూడా వేగంగా పూర్తిచేయాలని అన్నారు.

గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు, సూపర్ స్టార్ కృష్ణ మనవడు అశోక్ గల్లా నటించిన ‘దేవకీనందన వాసుదేవ’ చిత్రం విజయోత్సవ వేడుకలు బుధవారం గుంటూరులో జరగనున్నాయి. చిత్రబృందం కొరిటెపాడులోని హరిహరమహాల్కు సాయంత్రం 5.30గంటలకు విచ్చేస్తుందని అశోక్ సన్నిహితులు తెలిపారు. ఇందులో భాగంగా లక్ష్మీపురం మధర్ థెరిస్సా విగ్రహం వద్ద కేక్ కటింగ్ జరుగుతుందని, గల్లా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 11.40 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి సచివాలయానికి వెళ్తారు. అక్కడ 12.30 గంటలకు మారిటైం పాలసీపై సమీక్షిస్తారు. తిరిగి 04.0 గంటలకు ఎలక్ట్రానిక్ వెహికిల్ పాలసీపై అధికారులతో సమీక్ష చేస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వచ్చే రూట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ కొడలు చీర కార్గో పార్శిల్లో మాయమైందని పలు ప్రచార మాధ్యమాల్లో వచ్చింది. ఈ నేపథ్యంలో వినుకొండ ఆర్టీసీ డీపో మేనేజర్ను వివరణ కోరగా, ఈ ఘటనపై డీఎం మాట్లాడుతూ.. ఒంగోలు నుంచి నెల్లూరుకు ఇచ్చిన పార్శిల్లో ఒక చీర మాయం అయినట్లు తెలిసిందన్నారు. ఈ సంఘటనపై హైయర్ బస్సు ఓనర్, డ్రైవర్కు నోటీసులు జారీ చేశామని చెప్పారు. త్వరలో వారు వచ్చి వివరణ ఇస్తారని తెలిపారు.

IPL వేలం పాటలోకి గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన క్రీడాకారుడు వృథ్వీ రాజ్ యార్రాకు నిరాశ ఎదురైంది. ఇతడు గతంలో కేకేఆర్ జట్టుకు ఆడాడు. క్రికెట్లో మంచిగా రాణిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సారి వృథ్వీ రాజ్ యార్రా IPLలో రూ.30,00,000 బెస్ ప్రైజ్తో వేలంలో నిలిచాడు. అయితే అతడిని ఏ జట్టు కొనుగోలు చేయలేదు.

భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల కారణంగానే అన్ని రంగాల్లో మహిళలు ముందున్నారని జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాతబస్టాండ్ పరీక్షా భవన్లో పలు అంశాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సోమవారం డీఈవో బహుమతులు ప్రదానం చేశారు. ప్రతీ విద్యార్థి రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఉప విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు, ఉర్దూ డీఐ ఖాశీం పాల్గొన్నారు.

రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నట్లు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. సోమవారం మంగళగిరిలో టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి కార్యాచరణ, పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ఇచ్చిన హామీల అమలుపై ఆయన సమావేశం నిర్వహించారు. ఆలయాల పవిత్రత కాపాడేలా గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పవన్ తెలిపారు.

జాతీయ రహదారులు మాదిరిగా APలో కూడా పీపీపీ విధానంతో పలురోడ్లు గుత్తేదారులకు నిర్వహణ బాధ్యత అప్పజెప్పేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాగా గుంటూరు జిల్లాలో తొలి విడతకు గుంటూరు-పర్చూరు 41.44 కి.మీ, గుంటూరు-బాపట్ల 51 కి.మీ, మంగళగిరి-తెనాలి-నారాకోడూరు 40.25 కి.మీ, ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఏటా ఆయా రోడ్లపై గుంతలు పడితే వాటిని పూడ్చేందుకు PPP విధానంతో సదరు గుత్తేదారు సంస్థ చూసుకోనుంది.

ఎంఎస్ఎంఈ (మైక్రో,స్మాల్&మీడియం ఎంటర్ప్రైజెస్) ద్వారా గుంటూరు జిల్లాలో 16.085 యూనిట్లు రూ.477.56కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో 2వ స్థానం సాధించింది. ముందు వరుసలో విశాఖ, తర్వాత నెల్లూరు, కృష్ణా జిల్లాలు ఉన్నట్లు సామాజిక ఆర్థిక సర్వే-2024 వెల్లడించింది. ప్రభుత్వ పారిశ్రామిక పాలసీతో 2023-27ల్లో 19,86,658 మందికి ఉపాధి లక్ష్యంగా కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనిపై మీ కామెంట్..

సీఎం చంద్రబాబు సోమవారం షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి బయలుదేరి వెలగపూడి సచివాలయానికి వెళతారు. అక్కడ సీఆర్డీఏపై రివ్యూ చేస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు మున్సిపల్ శాఖపై సమీక్ష చేస్తారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రోడ్ల మరమ్మతులపై చంద్రబాబు రివ్యూ చేయనున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.