India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఐ-టీడీపీ సోషల్ మీడియా వైసీపీ నాయకులపై పెట్టిన అసభ్యకరమైన పోస్టులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం దుర్మార్గమైన చర్య అని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. గతంలో నగరంలోని పలు స్టేషన్లలో ఐ-టీటీడీపై తాము ఇచ్చిన ఫిర్యాదుల పురోగతిని తెలుసుకోవడానికి పార్టీ శ్రేణులతో కలిసి అంబటి శనివారం పోలీస్ స్టేషన్కు వెళ్లారు.

గుంటూరులో శుక్రవారం రాత్రి దారుణ ఘటన వెలుగుచూసింది. ఏడేళ్ల చిన్నారిపై బీటెక్ విద్యార్థి హత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల తెలిపిన వివరాలు.. గుంటూరులో దంపతులు ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. పక్కింటికి చెందిన నవీన్(20) బాలికను ఎవరూలేని ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యం చేశాడు. బాలిక కేకలు వేయడంతో తల్లిదండ్రులు రాగా విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నవీన్ను అదుపులోకి తీసుకున్నారు.

ఉండవల్లి నివాసంలో శుక్రవారం సాయంత్రం సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంట్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ ఎంపీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు ఎంపీలతో చర్చించారు. అలాగే పార్టీ పాలనాపరమైన అంశాలు, కేంద్రంపై వ్యూహాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

★ గుంటూరు: సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
★ మంగళగిరి: మంత్రి లోకేశ్పై అనుచిత వ్యాఖ్యలు.. కేసు నమోదు
★ గుంటూరు: కారంచేడు రైల్వే గేటును ఢీ కొన్న కారు
★ గుంటూరు: తుపాకీ మిస్ ఫైర్.. కానిస్టేబుల్ శ్రీనివాస్ మృతి
★ వినుకొండ: స్నానానికి వెళ్లిన స్వాములు.. ఇద్దరు మృతి
★ దాచేపల్లిలో డివైడర్ను ఢీకొని యువకుడు మృతి

గుంటూరు జిల్లా శాంతి భద్రతల విభాగ ఏఎస్పీగా రవికుమార్ శుక్రవారం బాధ్యత స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీలలో ప.గో జిల్లా ఏఎస్పీగా ఉన్న రవికుమార్ గుంటూరు జిల్లాకు నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి మెక్కను అందించారు. జిల్లాలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని ఎస్పీ సూచించారు.

గుంటూరులో ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాస్ మృతి కలకలం రేపింది. పోలీసుల వివరాల మేరకు.. శ్రీనివాస్ ఎస్కార్ట్ సెక్యూరిటీకి డ్యూటీ చేస్తూ ఉంటాడు. అయితే తుపాకీ మిస్ ఫైర్ అయి శ్రీనివాస్ మృతిచెందినట్లు పోలీసులు చెబుతున్నారు. శ్రీనివాస్ మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ఉంచారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మంత్రి నారా లోకేశ్ని కించపరిచే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వ్యక్తిపై మంగళగిరి పట్టణ పోలీసు పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. గత నెల 21వ తేదీన ఐ.వెంకటేశ్వరరెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియాలో మంత్రి లోకేశ్ని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై ఐటీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ కరీముల్లా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

సికింద్రాబాద్లో జరిగే RRB పరీక్షకు గుంటూరు నుంచి హాజరయ్యే అభ్యర్థులకు అన్-రిజర్వుడ్ స్పెషల్ ట్రైన్ను నడపనున్నారు. ఈ మేరకు గుంటూరు డీఆర్ఎం రామకృష్ణ గురువారం ప్రకటన విడుదల చేశారు. గుంటూరు- సికింద్రాబాద్ RRB స్పెషల్ ట్రైన్(07171) ఈ నెల 24, 25, 26, 28, 29 తేదీల్లో ఉదయం 8 గంటలకు బయలుదేరి మంగళగిరి, విజయవాడ మార్గంలో ప్రయాణించి సాయంత్రం 4.15కి సికింద్రాబాద్ చేరుకుంటుందని తెలిపారు.

గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా నటించిన 2వ చిత్రం ‘దేవకీనంద వాసుదేవ’ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కొరిటెపాడులోని హరిహర మహాల్ వద్ద ఉదయం 11.30 ని.లకు గల్లా అభిమానులు కేక్ కటింగ్ సంబరాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు టీడీపీ శ్రేణులు, అభిమానులు హాల్ వద్దకు భారీగా తరలి రావాలని గల్లా అశోక్ అభిమానులు పిలుపునిచ్చారు.

గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న కోర్టు ప్రాంగణాల్లో డిసెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి YVSBGV పార్థసారథి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కక్షిదారులు, పోలీసులు లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చొరవ చూపాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధానంగా సివిల్, చెక్ బౌన్స్ కేసులు రాజీ చేసుకోవాలని చెప్పారు.
Sorry, no posts matched your criteria.