Guntur

News September 8, 2024

మంగళగిరి: ప్రజా వేదిక వారం రోజులు రద్దు

image

అకాల వర్షాల కారణంగా మంగళగిరి ఎన్టీఆర్ భవన్‌లో జరగాల్సిన ప్రజా వేదిక” కార్యక్రమం వారం రోజుల పాటు రద్దు అయినట్లు కార్యాలయ కార్యదర్శి పరుచూరి అశోక్ బాబు తెలిపారు. అకాల వర్షాలు, వరదలు కారణంగా అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉండటంతో మంగళగిరి టీడీపీ పార్టీ కేంద్ర కార్యలయంలో జరగాల్సిన “ప్రజా వేదిక” కార్యక్రమం ఇవన్నీ ఈనెల 9 నుంచి 15 వరకు రద్దు అయినట్లు తెలిపారు.

News September 8, 2024

గుంటూరు: ప్రజా సమస్యల పరిష్కార రద్దు

image

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు పరిచినట్లు గుంటూరు కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి IAS ఆదివారం తెలిపారు. జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు.

News September 8, 2024

పాముకాటుతో విద్యార్థి మృతి బాధాకరం: నారా లోకేశ్

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో MA బుద్ధిస్ట్ స్టడీస్ చదువుతున్న మయన్మార్ విద్యార్థి కొండన్న పాముకాటుకు గురై మృతి చెందడంపై మంత్రి <<14050417>>నారా లోకేశ్ సంతాపం తెలిపారు.<<>> ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా యూనివర్సిటీ అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నానని, కొండన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.

News September 8, 2024

ANUలో పాముకాటుతో బుద్ధిజం విద్యార్థి మృతి

image

గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయంలో రక్త పింజర పాముకాటుతో విద్యార్థి మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మయన్మార్‌కు చెంది కొండన్న ANUలో MA బుద్ధిజం చదువుతున్నాడు. శనివారం క్యాంపస్ ఆవరణలో పుట్టగొడుగులు ఏరుతుండగా పాముకాటుకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న విద్యార్థులు, సిబ్బంది అతణ్ని ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

News September 8, 2024

కాసేపట్లో ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

image

కాసేపట్లో ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ MD రోణంకి కూర్మనాథ్ తెలిపారు. నాగార్జునసాగర్ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో 2.99 లక్షల క్యూసెక్కులు ఉందని, పులిచింతల వద్ద ఇన్‌ఫ్లో 2.75, ఔట్ ఫ్లో 2.97 లక్షల క్యూసెక్కులు రాగా, ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.88 లక్షల క్యూసెక్కులు వస్తుందన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News September 8, 2024

నర్సరావుపేట: సాంకేతిక సేవలు అందించేందుకు దరఖాస్తు చేసుకోండి

image

వరద సహాయక చర్యల్లో భాగంగా సాంకేతిక సేవలు అందించేందుకు పల్నాడు జిల్లాలోని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావు కోరారు. మాట్లాడుతూ వరద బాధితుల ఇళ్లల్లో ప్లంబర్, ఎలక్ట్రీషియన్ తదితర సేవలందించేందుకు ఏపీఎస్ ఎస్‌డి‌సి యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. జిల్లాలోనిఆసక్తి గల అభ్యర్థులు 9988853335, 871265 5686, 87901 17279, 87901 18349 సంప్రదించాలన్నారు.

News September 7, 2024

నర్సరావుపేట: సాంకేతిక సేవలు అందించేందుకు దరఖాస్తు చేసుకోండి

image

వరద సహాయక చర్యల్లో భాగంగా సాంకేతిక సేవలు అందించేందుకు పల్నాడు జిల్లాలోని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావు కోరారు. మాట్లాడుతూ వరద బాధితుల ఇళ్లల్లో ప్లంబర్, ఎలక్ట్రీషియన్ తదితర సేవలందించేందుకు ఏపీఎస్ ఎస్‌డి‌సి యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. జిల్లాలోనిఆసక్తి గల అభ్యర్థులు 9988853335, 871265 5686, 87901 17279, 87901 18349 సంప్రదించాలన్నారు.

News September 7, 2024

గుంటూరు: అధికారులు అప్రమత్తంగా ఉండాలి-అనిత

image

భారీ వర్షాల నేపథ్యంలో విపత్తు నిర్వహణ శాఖ కార్యాలయంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద ప్రమాదంపై అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖాధికారులను, సిబ్బందికి ఆమె ఆదేశాలు జారీ చేశారు. జలవనరుల శాఖను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మనదేనని, నీటి ప్రవాహం వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

News September 7, 2024

గుంటూరు: 2 రోజుల్లోనే పూర్తయిన గేట్ల మరమ్మతులు

image

ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతులు పూర్తి చేశారు. 67, 69వ గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్లను శనివారం మధ్యాహ్నం నాటికి విజయవంతంగా అమర్చారు. భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా రెండు రోజుల్లోనే ఇంజినీర్లు, సిబ్బంది గేట్ల మరమ్మతు పనులు పూర్తి చేశారు. నదిలో లక్షన్నర క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నా సాహసోపేతంగా పనిచేసి గేట్లు అమర్చారు. నిపుణుడు కన్నయ్యనాయుడు పర్యవేక్షణలో ఈ పనులు చేశారు

News September 7, 2024

రూ.5 లక్షల విరాళం అందజేసిన నాగశ్రవణ్

image

టీడీపీ అనుబంధ తెలుగు యువత విభాగం రాష్ట్ర కార్యదర్శి నాగశ్రవణ్ కిలారు శనివారం విజయవాడలో మంత్రి నారా లోకేశ్‌తో భేటీ అయ్యారు. వరద బాధితుల సహాయార్థం రూ.5 లక్షల విరాళాన్ని అందజేశారు. అదనంగా రూ.5 లక్షల విలువైన నిత్యావసర సరుకులు, దుప్పట్లు, ఇతర వస్తువులను బాధితుల కోసం అందజేసినట్లు నాగశ్రవణ్ తెలిపారు.