India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంటూరు జిల్లాలో బుధవారం నుంచి గురువారం వరకు భారీ వర్షాలు కురిశాయి. ఫిరంగిపురం మండలంలో అత్యధికంగా 55.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. తుళ్లూరులో 41 మి.మీ, కొల్లిపర 27.5 మి.మీ, తాడికొండలో 27, గుంటూరు వెస్ట్ ప్రాంతంలో 25.75 మి.మీల వర్షపాతం నమోదైంది. మంగళగిరి ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో 22.5 మి.మీ, పొన్నూరు 19.5, దుగ్గిరాల 18, తెనాలి 15 మి.మీ చొప్పున వర్షం కురిసినట్టు వాతావరణ శాఖ తెలిపింది.
గుంటూరు మిర్చి యార్డుకు గురువారం సుమారు 55 వేల బస్తాల వరకు ఏసీ సరుకు చేరుకుంది. కేజీల వారిగా ధరలు ఈ విధంగా ఉన్నాయి. తేజ బెస్ట్: రూ. 80-120, తేజ ఏ/సి: రూ. 125-143, 355 ఏ/సి: రూ. 100-135 వరకు ఉంది. 2043 ఏ/సి: రూ. 120-135, 341 ఏ/సి: రూ. 120-150, షార్కు ఏ/సి: రూ. 110-130, నంబర్ 5 ఏ/సి: రూ. 125-142, డీడీ రకం ఏ/సి: రూ. 110-140, ఎల్లో రకం: రూ. 200-230, బుల్లెట్: రూ. 90-135 వరకు ధర లభించింది.
బాపట్ల వాసి బక్క గోపిని పట్టాభిపురం పోలీసులు నకిలీ నోట్లు మార్చుతుండగా అరెస్ట్ చేశారు. రత్నగిరి నగర్లో నివాసం ఉంటున్న గోపికి హైదరాబాద్కు చెందిన భరత్ ద్వారా కలకత్తా వాసి గోపాల్ పరిచయమయ్యాడు. గోపాల్ వద్ద నుంచి గోపి 160 నకిలీ రూ.500 నోట్లు కొనుగోలు చేసి గుంటూరులో మార్చుతున్నాడు. పోలీసులు అతడి వద్ద నుంచి 25 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, రిమాండ్ విధించారు.
తెనాలికి స్వతంత్ర సంగ్రామంలో ప్రత్యేక చరిత్ర ఉంది. స్వతంత్రం ప్రకటించిన రోజే తెనాలిలో ఓ థియేటర్ ఓపెన్ చేశారని మీకు తెలుసా? అదే స్వరాజ్ టాకీస్. 1947 ఆగస్టు 15న ప్రారంభించారు. స్వాతంత్ర్యానికి చిహ్నంగా ఈ పేరు పెట్టారు. లండన్, జపాన్ నుంచి పరికరాలను దిగుమతి చేసుకుని ఆరోజుల్లోనే రూ.1.24 లక్షల వ్యయంతో దీనిని నిర్మించారు. ప్రస్తుతం ఇది మూతబడింది.
నైతిక విలువలనే ఆస్తిపాస్తులుగా జీవించిన స్వాతంత్ర్య సమరయోధుడు షేక్ అబ్దుల్ వహాబ్. 1903 డిసెంబర్ 10న తెనాలిలో జన్మించారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొన్నారు. 1929లో గాంధీజీ తెనాలి వచ్చినప్పుడు సతీ సమేతంగా వెళ్లి తమ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలన్నింటినీ స్వరాజ్య నిధికి సమర్పించారు. తెనాలి మున్సిపల్ కౌన్సిలర్గా 36 ఏళ్లు, 15 ఏళ్ల పాటు వైస్ ఛైర్మన్గా, 5ఏళ్లు ఛైర్మన్గా సేవలందించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూము ఏర్పాటు చేశారు. జిల్లా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 0863 2234014 నంబర్కు ఫోన్ చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి కోరారు. ఈ కంట్రోల్ రూం 24 గంటలు పనిచేస్తుందని చెప్పారు.
బ్రిటిష్ వలస పాలన ముగిసిన తర్వాత మిగిలిన ప్రాంతాల్లో మాదిరిగానే గుంటూరులో 1947 ఆగస్టు 15వ తేదీన ప్రజలు స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహించారు. స్థానిక AC కళాశాలలో అదే రోజు జెండా ఎగురవేశారు. AC కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వైవీ నారాయణ తన మాటలతో ప్రజలను ఉత్సహ పరిచరారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు ఆలపించారు. ప్రముఖ వ్యక్తులు ప్రసంగించారు. పైన ఉన్నది అప్పటి ఫొటోనే.
గుంటూరు జిల్లాలో వేల ఎకరాలు నీట మునిగాయని వైసీపీ ఆరోపిస్తుంది. ‘పెదకాకాని మండలం గొల్లమూడి సమీపంలో గుంటూరు ఛానల్ కాలువకు గండి పడినా కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. గండి పడే అవకాశం ఉందని రైతులు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు కంటితుడుపుగా మరమ్మతులు చేసి వదిలేశారు. పంట నష్టపోయిన రైతు కన్నీటికి కారణం నీ నిర్లక్ష్యం కాదా చంద్రబాబు?’ అని ప్రశ్నిస్తూ YCP ట్వీట్ చేసింది.
స్వాతంత్ర్య సంగ్రామంలో భాగంగా గాంధీజీ 3సార్లు తెనాలి వచ్చారు. 1929లో తొలిసారి తెనాలి వచ్చి పట్టణ నడిబొడ్డున సభలో ప్రసంగించారు. అందుకే ఆ ప్రాంతానికి గాంధీచౌక్గా నామకరణం చేశారు. 1933లో 2వ సారి వచ్చి రైల్వే స్టేషన్ పడమర వైపున బహిరంగ సభలో ప్రసంగించారు. అనంతరం చెంచుపేటలోని ఇప్పటి శబరి ఆశ్రమాన్ని ప్రారంభించి రాత్రికి ఐతనగర్లో బస చేశారు. 1946లో 3వసారి మద్రాస్ వెళుతూ రైల్వే స్టేషన్లో సేద తీరారు.
గుంటూరు జిల్లాలో గత 24 గంటల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆగస్టు 12 ఉదయం 8:30 నుంచి 13 ఉదయం 8:30 వరకు అత్యధికంగా పొన్నూరులో 203.5 మి.మీ, దుగ్గిరాలలో 189.5 మి.మీ, తుళ్లూరులో 167.0 మి.మీ వర్షపాతం నమోదైంది. గుంటూరు వెస్ట్ 158, ఈస్ట్ మి.మీ, పెదకాకాని 156.5, తెనాలిలో 143.75, మంగళగిరిలో 138.0, కాకుమాను 108.0, ఫిరంగిపురం 94.25, కొల్లిపర 92.5, ప్రత్తిపాడులో 63.0మి.మీ వరకు నమోదైంది.
Sorry, no posts matched your criteria.