Guntur

News April 2, 2024

గురజాల: ఒకప్పటి శత్రువులు ఇప్పుడు మిత్రులవుతున్నారు

image

గురజాలలో ఒకప్పుడు ఒకరిపై ఒకరు శాసనసభ్యులుగా పోటీ చేసిన ఎరపతినేని శ్రీనివాసరావు, జంగా కృష్ణమూర్తులు ఇప్పుడు మిత్రులు కాబోతున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ జంగా ఎట్టకేలకు చంద్రబాబును కలిశారు. గురజాలలో జరిగే ప్రజాగళం బహిరంగ సభలో జంగాతో పాటు గురజాల నియోజకవర్గంలో ఆయన అనుచరులు వేలాదిమంది టీడీపీలో చేరనున్నారు. గురజాల వైసీపీ టికెట్ కోసం జంగా ప్రయత్నించగా.. కాసుకు జగన్ టికెట్ కేటాయించిన విషయం తెలిసిందే.

News April 2, 2024

బాపట్ల: ట్రాన్స్ జెండర్ గొంతు కోసిన ఆగంతుకుడు

image

చెరుకుపల్లి మండలం గూడవల్లికి చెందిన ట్రాన్స్ జెండర్ కొల్లూరులోని ఓ దుకాణం వద్ద చందా తీసుకుంటుంది. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న ఆగంతుకుడు ఆమె వెనుకగా వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె బయపడి అతని చెంపపై కొట్టింది. దీంతో అతడు పదునైన ఆయుధంతో గొంతుపై గాయం చేసి పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రురాలిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News April 2, 2024

సచివాలయాల ద్వారా పెన్షన్ పంపిణీ: గుంటూరు కలెక్టర్

image

ఎన్నికల నిబంధనల మేరకు ప్రజలకు సచివాలయాల ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తామని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. పెన్షన్ పంపిణీపై ఎన్నికల సంఘం కచ్చితమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. సచివాలయాలలో పెన్షన్ పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని ఇప్పటికే సచివాలయ సిబ్బందికి లాగిన్లు ఇచ్చామన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు.

News April 1, 2024

మద్యం మత్తులో కొడుకుని హత్య చేసిన తండ్రి

image

పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధి క్రిస్టియన్ పేటకు చెందిన తవనం మోజెస్(29) తండ్రి కవిరాజు చేతిలో హత్యకు గురయ్యాడు. ఆదివారం అర్ధరాత్రి తండ్రీ కుమారుడు మద్యం మత్తులో గొడవ పడ్డారు. ఆ సమయంలో తండ్రి కోపంతో అందుబాటులో ఉన్న మంచం కోడుతో దాడి చేశాడు. ఈ సంఘటనలో మోజేస్ అక్కడే ప్రాణాలు విడిచాడు. మోజేస్‌కు వివాహం కాలేదు. సీఐ రమేష్ బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 1, 2024

గుంటూరులో వ్యక్తి దారుణ హత్య

image

గుంటూరులో సోమవారం ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురి కావడం కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం.. పాత గుంటూరు క్రిస్టియన్ పేటకు చెందిన వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో వెంటాడి హతమార్చినట్లు పేర్కొన్నారు. ప్రాణాలు కాపాడుకోవడానికి కొంత దూరం పరిగెత్తినప్పటికీ విడిచిపెట్టకుండా హత్య చేసినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 1, 2024

గుంటూరు: నూర్పిడి యంత్రంలో పడి కూలీ మృతి

image

కాకుమాను మండలంలోని వల్లూరులో ఓ వ్యవసాయ కూలీ నూర్పిడి యంత్రంలో పడి మృతి చెందాడు. వట్టిచెరుకూరు మండలం కారంపూడి పాడుకు చెందిన నరసింహ (20) కూలీ పనుల నిమిత్తం వల్లూరు వచ్చాడు. ఆదివారం నూర్పిడి యంత్రంలో కోత కోసిన శనగ పంట వేస్తుండగా పొరపాటున లోపలికి పడిపోయాడు. తోటి కూలీలు వెంటనే అతన్ని పైకి లాగేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 1, 2024

వేమూరు అసెంబ్లీ నియోజకవర్గం..

image

వేమూరు అసెంబ్లీ నియోజకవర్గం 1995లో ఏర్పడింది. అయితే అంతకు ముందు అమృతలూరు నియోజకవర్గంలో ఉండేది. 1965 నుంచి 2004 వరకు జనరల్ నియోజకవర్గంగా ఉండగా.. 2009లో ఈ నియోజకవర్గం (SC)గా మారింది. అయితే 1955 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో ఇప్పటివరకు మహిళా అభ్యర్థినులు గెలవలేదు. రాబోవు ఎన్నికల్లో అయినా నియోజకవర్గంలో మహిళలు పోటీ చేస్తారా లేదా అన్నది తెలియాల్సిఉంది. మరి మీ కామెంట్.

News April 1, 2024

గుంటూరులో బాలుడిపై పోక్సో కేసు నమోదు

image

గుంటూరులో ఓ బాలుడిపై ఆదివారం నగరంపాలెం పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లాకు చెందిన 17 ఏళ్ల ఓ బాలుడు గుంటూరులోని వసతి గృహంలో ఉంటూ చదువుతున్నాడు. అదే వసతి గృహంలో చదువుకుంటున్న బాలిక కొద్ది రోజుల క్రితం నుంచి కనిపించడంలేదు. బాలుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదుపై CI లోకనాథం పోక్సో, కిడ్నాప్ కేసు నమోదు చేశారు.

News April 1, 2024

వినుకొండ: మరిగే నీటిని మర్మాంగంపై పోసి హత్యాయత్నం

image

నిద్రిస్తున్న భర్త మర్మాంగంపై సలసల మరిగే నీటిని పోసి భార్య హత్యాయత్నానికి పాల్పడిన ఘటన వినుకొండలో ఆదివారం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు చెందిన భార్యభర్తలు గత కొద్దిరోజులుగా హనుమాన్ నగర్ 13వ లైన్‌లో నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహాలతో లుంగీ కట్టుకొని నిద్రిస్తున్న భర్త మర్మాంగంపై వేడి నీరు పోసి హత్యాయత్నం చేసిందని బాధితుడు వాపోయాడు. కేసు నమోదైంది.

News April 1, 2024

హెడ్ కానిస్టేబుల్‌ను సన్మానించిన బాపట్ల ఎస్పీ

image

ఏ.ఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తూ పదవి విరమణ పొందిన కె.వి. సుబ్రహ్మణ్యంని ఆదివారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఘనంగా సన్మానించారు. అనంతరం 40 సంవత్సరాల పాటు వివిధ విభాగాలలో పోలీస్ శాఖకు విశేష సేవలు అందించి పదవి విరమణ పొందిన ఏ.ఆర్ హెడ్ కానిస్టేబుల్ కె.వి. సుబ్రహ్మణ్యంని జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయం నందు వారి కుటుంబసభ్యుల సమక్షంలో దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు.