Guntur

News November 5, 2024

మాచవరం రానున్న డిప్యూటీ సీఎం పవన్

image

మాచవరం మండలం చెన్నాయపాలెంలోని సరస్వతి ఇండస్ట్రియల్ భూములను మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించినట్లు తహశీల్దార్ క్షమారాణి మంగళవారం తెలిపారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడతామని సుమారు 1000 ఎకరాల వరకు రైతుల వద్ద నుంచి భూములు సేకరించి ఇప్పటివరకు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టలేదన్నారు. దీంతో వవన్ పర్యటనపై జిల్లాలో ఉత్కంఠ నెలకొంది.

News November 4, 2024

అమరావతి అభివృద్ధికి తొలగిన అడ్డంకులు: మంత్రి

image

అమరావతి అభివృద్ధి పనులకు అడ్డంకిగా ఉన్న పాత టెండర్లను క్లోజ్ చేసే మార్గం సుగమం అయ్యిందని మంత్రి నారాయణ అన్నారు. CRDAపై సీఎం సమీక్ష అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. త్వరలోనే నూతన టెండర్లను పిలిచే ప్రక్రియను ప్రారంభించి రానున్న మూడేళ్లలో అమరావతి అభివృద్ధి పనులను అన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. హైకోర్టు, అసెంబ్లీ భవన నిర్మాణాలకు జనవరి లోపు నూతన టెండర్లు పిలుస్తామని చెప్పారు.

News November 4, 2024

కూతురు పుట్టిందన్న ఆనందం.. అంతలోనే విషాదం.!

image

సత్తెనపల్లిలో ఆదివారం రాత్రి వెన్నాదేవి సమీపంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల కథనం మేరకు యడ్లపాడు మండలం లింగారావుపాలెంకు చెందిన రోశయ్య(32)కు వివాహం అయిన నాలుగేళ్లకు కుమార్తె పుట్టింది. ఆనందంతో తన బంధువైన వీరేంద్రతో కలిసి కుమార్తెను చూసి వస్తుండగా గుంటూరు-పిడుగురాళ్ల మధ్యమార్గంలో వారు వెళ్తున్న బైక్‌ను బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. 

News November 4, 2024

ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే..!

image

ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 11:30 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి వెలగపూడిలోని సచివాలయానికి చేరుకుంటారు. అనంతరం సీఆర్డీఏపై సమీక్ష చేసి స్పోర్ట్స్ పాలసీపై రివ్యూ చేస్తారు. సాయంత్రం వ్యవసాయ పశుసంవర్ధక శాఖపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.

News November 4, 2024

గుంటూరులో నడిరోడ్డుపై కత్తితో వీరంగం

image

గుంటూరులో రుణం తిరిగి చెల్లించే విషయంలో కొందరు వ్యక్తులు కత్తులు, రాళ్లతో బీభత్సం సృష్టించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల మేరకు.. రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి తాను ఇచ్చిన డబ్బులు ఎందుకు ఇవ్వలేదని సుబ్రహ్మణ్యేశ్వర రావును నిలదీశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి తమ అనుచరులను పిలుచుకొని ఒకరినొకరు కార్లతో గుద్దుకొని భయభ్రాంతులకు గురిచేశారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News November 4, 2024

వైసీపీ నేతలు కళ్లకు గంతలు విప్పుకోవాలి: ప్రత్తిపాటి

image

వైసీపీ నేతలు వారి కళ్లకు కట్టుకున్న నీలి గంతలు విప్పుకుంటే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాలు కనిపిస్తాయని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అన్నారు. నాదెండ్ల మండలం జంగాలపల్లి, తూబాడులో ఆదివారం పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. తూబాడులోని రూ.15 లక్షలతో సీసీ రహదారులు, డ్రైన్ల నిర్మాణానికి, జంగాలపల్లిలో సీసీ రహదారులకు భూమిపూజ చేశారు.

News November 3, 2024

‘రుషికొండ భవనాలు చూసి ఆశ్చర్య పోయావా చంద్రబాబు’

image

‘రుషికొండ భవనాలు చూసి ఆశ్చర్యపోయావా!.. అమరావతిలో ఇలా కట్టలేదని సిగ్గుపడ్డావా?’.. అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా సెటైర్లు వేశారు. ఈ మేరకు Xలో ఆయన ఓ పోస్ట్ చేశారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం విశాఖపట్నంలోని రుషికొండ భవనాలను పరిశీలించిన విషయం తెలిసిందే. కాగా అంబటి ట్వీట్‌తో కూటమి నేతలు మండిపడుతున్నారు. 

News November 3, 2024

అమరావతికి రూ.15వేల కోట్లు గ్రాంట్‌గా ఇవ్వాలి: సీపీఎం

image

రాజధాని అమరావతికి అప్పు కాదు.. కేంద్ర ప్రభుత్వం రూ.15వేల కోట్లు గ్రాంట్‌గా ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ బాబురావు అన్నారు. శనివారం అమరావతి తుళ్లూరులో సీఆర్డీఏ ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో బాబురావు మాట్లాడారు. భవిష్యత్తులో అమరావతిపై అనిశ్చిత పరిస్థితి మళ్లీ తలెత్తే అవకాశం లేకుండా చట్టబద్ధంగా, పటిష్ఠంగా వ్యవస్థీకృతమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. 

News November 3, 2024

హంతకులకు కొమ్ము కాస్తున్నారు : అంబటి

image

చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో బాలిక శైలజ మృతి బాధాకరమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బాలిక హత్య జరిగి నాలుగు నెలలు దాటిన ప్రభుత్వం చేపట్టిన చర్యలు శూన్యమన్నారు. వైసీపీ తరఫున మాజీ సీఎం జగన్ బాలిక కుటుంబానికి రూ.10లక్షలు ఇచ్చారన్నారు. రాష్ట్రంలో ఈ తరహా ఘటనలు అనేకం జరుగుతున్నా.. ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి హంతకులకు కొమ్ము కాస్తోందని ఆరోపించారు.

News November 2, 2024

మాచర్ల: ఇంజినీరింగ్ విద్యార్థి సూసైడ్

image

మాచర్లలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థి తన రూమ్‌లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. దీంతో సహచర విద్యార్థులు ఒక్కసారిగా కంగారుపడ్డారు. ఇప్పటి వరకు తనతో పాటూ ఉన్న స్నేహితుడు చనిపోవడంపై కన్నీటి పర్యంతమయ్యారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.