Guntur

News March 28, 2024

ఎడ్లపాడు వద్ద రోడ్డు ప్రమాదం.. యువకుడికి గాయాలు

image

మండలంలోని తిమ్మాపురం వద్ద జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. చిలకలూరిపేట వైపు నుంచి గుంటూరు వెళ్తున్న కారు, ఎడ్లపాడు మండలం తిమ్మాపురం వైపు వెళ్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న యువకుడికి తీవ్ర గాయాలు కాగా.. మెరుగైన వైద్యం కోసం మంగళగిరి NRI ఆసుపత్రికి తరలించారు. యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 28, 2024

గ్రూపులో ప్రతి పోస్ట్‌కి అడ్మిన్ దే బాధ్యత: గుంటూరు ఎస్పీ

image

సోషల్ మీడియాలో ఎన్నికల వేళ చేసే ప్రతి పోస్ట్‌కి అడ్మిన్ దే బాధ్యత అని గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ దూడి అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశారు. వివాదాస్పద పోస్టులు, కామెంట్లను ఎప్పటికప్పుడు డిలీట్ చేయాలన్నారు. వివాదాస్పద పోస్టులు పెట్టే సభ్యులను గ్రూప్ నుంచి తొలగించాలని, అలాంటి పోస్టుల వివరాలు పోలీసులకు సమాచార ఇవ్వాలని ఎస్పీ సూచించారు.

News March 28, 2024

నరసరావుపేట ఎంపీగా గెలిచేదెవరు.?

image

నరసరావుపేట లోక్‌సభ స్థానంలో MP లావు కృష్ణదేవరాయలు, MLA అనిల్ మధ్య పోరు రసవత్తరంగా ఉండనుంది. YCPకి రాజీనామా చేసి టీడీపీ నుంచి బరిలో దిగుతున్న లావు.. పల్నాడు అభివృద్ధి కోసమే గుంటూరు YCP ఎంపీ టికెట్ వద్దనుకున్నట్లు ప్రకటించారు. మరోవైపు, వైసీపీ పాలనను టీడీపీ ప్రభుత్వంతో బేరీజు వేసుకొని తీర్పు ఇవ్వాలని అనిల్ అంటున్నారు. వీరిద్దరూ నాన్ లోకల్ కాగా, విజయం ఎవరిని వరిస్తుందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News March 28, 2024

గుంటూరు: ప్రశాంతంగా ముగిసిన టెన్త్‌ పరీక్షలు

image

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో భాగంగా ప్రధాన సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు బుధవారం ముగిశాయి. ఎటువంటి పొరపాటుకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయి. బుధవారం జరిగిన సాంఘిక శాస్త్రం పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 147 కేంద్రాల పరిధిలో కేటాయించిన 27,934 మంది విద్యార్థులకు గానూ 27,284 మంది హాజరయ్యారు. 46 కేంద్రాల్లో అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

News March 28, 2024

బాపట్లలో గెలుపు ఎవరిది.?

image

బాపట్ల నియోజకవర్గంలో గెలుపుపై తెలుగుదేశం పార్టీ ఆశలు పెట్టుకుంది. 1999లో చివరిగా టీడీపీ నుంచి మంతెన అనంతవర్మ గెలుపొందారు. అప్పటి నుంచి బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ గెలవలేదు. రానున్న ఎన్నికల్లో టీడీపీ నుంచి వేగేశన నరేంద్ర వర్మ, వైసీపీ నుంచి ఎమ్మెల్యే కోన రఘుపతి పోటీ చేస్తున్నారు. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండటంతో, విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. 

News March 28, 2024

పోలీసులకు DGP పథకాలు.. IG పాలరాజుకు గోల్డ్ డిస్క్

image

పోలీస్ శాఖలో రాష్ట్రస్థాయిలో వివిధ కేసుల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్రప్రభుత్వం డీజీపీ గోల్డ్ డిస్క్, సిల్వర్ డిస్క్, బ్రాంచ్ డిస్క్ అవార్డులకు ఎంపిక చేసింది. వారిలో గుంటూరు రేంజ్ ఐజి పాలరాజుకు గోల్డ్ డిస్క్, ఏఎస్పి సుప్రజ, డీఎస్పీ పోతురాజులకు సిల్వర్ డిస్క్, ఏఎస్పీ A. శ్రీనివాసరావు, డి.ఎస్.పిలు T. శ్రీనివాసరావు, B సీతారామయ్య మరికొందరికి బ్రాంచ్ డిస్క్‌లకు ఎంపికయ్యారు.

News March 27, 2024

ANU: ‘డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలి’

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి జరగవలసిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని ఎమ్మెల్సీ కె.ఎస్ లక్ష్మణరావు సూచించారు. ఈ మేరకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి. రాజశేఖర్‌కు బుధవారం వినతి పత్రం సమర్పించారు. లక్ష్మణరావుతోపాటు అధ్యాపక సంఘాల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సిలబస్ పూర్తికాని దృష్ట్యా సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు.

News March 27, 2024

క్రోసూరు: గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని మృతి

image

గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని చిలకా చిన్నారి (15) మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. క్రోసూరు మండలం నాగవరాని చెందిన విద్యార్థిని స్థానిక హైస్కూల్‌లో చదువుతూ బృగుబండలో పది పరీక్షలు రాస్తోంది. బుధవారం సైన్సు పరీక్షకు హాజరై ఇంటికి రాగానే అస్వస్థతకు గురైంది. వెంటనే చికిత్స కోసం సత్తెనపల్లి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో చనిపోయింది. విద్యార్థినికి కొన్నాళ్లుగా గుండె సమస్య ఉన్నట్లు సమాచారం. 

News March 27, 2024

బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్‌కు డీజీపీ డిస్క్ గోల్డ్ మెడల్

image

బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌కు డీజీపీ డిస్క్ గోల్డ్ మెడల్ అవార్డు లభించింది. రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో శాంతి భద్రతల విభాగంతో పాటు దిశ, కన్విక్షన్ బెస్ట్ పోలీసింగ్‌లో ఎస్పీ వకుల్ జిందాల్ ఉత్తమ ప్రతిభ కనబరిచారు. పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అవార్డును అందించనున్నారు.

News March 27, 2024

గుంటూరు పశ్చిమ ఇండియా కూటమి అభ్యర్థిగా అజయ్ 

image

గుంటూరు పశ్చిమ ఇండియా కూటమి అభ్యర్థిగా CPI జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు గుంటూరులోని CPI కార్యాలయంలో కూటమి సభ్యులు సమావేశం నిర్వహించి అజయ్ కుమార్‌ను ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన్ను సత్కరించి అభినందనలు తెలిపారు. అజయ్ కుమార్ మాట్లాడుతూ.. కార్మిక, రైతు, పేద, బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.