Guntur

News March 27, 2024

గుంటూరు: నియోజకవర్గాలకు ఎలక్షన్ ఇ‌న్‌ఛార్జ్‌ల నియామకం

image

గుంటూరు జిల్లాలోని పలు నియోజకవర్గాలకు ఎలక్షన్ ఇన్‌ఛార్జ్‌లను వైసీపీ అధిష్ఠానం ప్రకటించింది. పొన్నూరు, మంగళగిరి నియోజకవర్గాలకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. తాడికొండ, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్ నియోజకవర్గాలకు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ను నియమించింది. సత్తెనపల్లి, చిలకలూరిపేట, వేమూరులకు మోదుగుల వేణుగోపాల్‌ను.. రేపల్లెకు ఎలక్షన్ అబ్జర్వర్‌గా గాదె మధుసూదన్ రెడ్డిని నియమిస్తున్నట్లు ప్రకటించింది.

News March 27, 2024

వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా సమగ్ర ప్రణాళిక: కలెక్టర్

image

వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. బాపట్ల కలెక్టరేట్‌లో మంగళవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి నేపథ్యంలో తాగునీటి అవసరాల కొరకు ఏప్రిల్ 8వ తేదీన సాగర్ నీరు విడుదల కానుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. విడుదలయ్యే నీటితో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నింపాలన్నారు.

News March 26, 2024

అందరితో సంప్రదించాకే నిర్ణయం: ఎమ్మెల్సీ జంగా

image

అందరితో సంప్రదించిన తర్వాతే తన రాజకీయ నిర్ణయం ప్రకటిస్తానని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి స్పష్టం చేశారు. ఈ మేరకు జంగా సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గురజాల నియోజకవర్గంలో అనిశ్చితి రాజకీయాన్ని ఆసరాగా చేసుకుని మీడియాలో రకరకాల దుష్ప్రచారాలు చేస్తున్నారని, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పెద్దల సలహాలను, సూచనలను తీసుకొని తుది నిర్ణయం ప్రకటిస్తానని అన్నారు.

News March 26, 2024

సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ తుషార్

image

ఎన్నికలవేళ సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. రాజకీయ పార్టీలు, ఎలక్షన్ కమిషన్ పేరిట మోసాలకు పాల్పడుతున్నారని, గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ మంగళవారం తెలిపారు. అపరిచిత వ్యక్తులు ఓటర్ కార్డ్ ఆన్లైన్‌లో నమోదు కాలేదని, ఎన్నికల సర్వేలో పాల్గొంటే బహుమతులని ఫోన్‌కు లింకులు పంపిస్తున్నారు. ఇలాంటి సందేశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తుషార్ డూడీ సూచించారు.

News March 26, 2024

REWIND: గుంటూరులో గల్లా జయదేవ్‌దే అత్యల్పం

image

గుంటూరు లోక్‌సభ నుంచి మహామహులు ఎన్నికయ్యారు. ఎన్జీ రంగా, లాల్ జాన్ బాషా, కొత్త రఘురామయ్య, రాయపాటి జయకేతనం ఎగురవేశారు. గత 2 పర్యాయాలు గల్లా జయదేవ్ ఇక్కడ విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో 69,111 ఓట్ల మెజార్టీతో గెలిచిన ఆయన.. 2019లో కేవలం 4,205 ఓట్లతో గట్టెక్కారు. ఈ లోక్‌సభ స్థానంలో ఇదే అత్యల్పం. ఈ ఎన్నికల్లో TDP కూటమి నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, YCP నుంచి కిలారు రోశయ్య బరిలో దిగుతున్నారు.

News March 26, 2024

గుంటూరు రైల్వే డివిజన్ సరికొత్త రికార్డు

image

సరుకు రవాణాలో గుంటూరు రైల్వే డివిజన్ రికార్డు సృష్టించింది. 2013-14లో ఉన్న అత్యధిక లోడింగ్ 3.127 మిలియన్ టన్నులను సోమవారం అధిగమించి సరికొత్త రికార్డు నమోదు చేసుకుంది. 2003లో డివిజన్ ప్రారంభించిన తర్వాత తొలిసారి గరిష్ఠ స్థాయి రికార్డ్ నమోదు చేసుకుంది. దీంతో అధికారులు, కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. రైల్వే అధికారి రామకృష్ణ ఉన్నతాధికారుల ప్రశంసలందుకున్నారు.

News March 26, 2024

పోలింగ్ నిర్వహణలో అధికారులు, సిబ్బందే కీలకం: కలెక్టర్

image

సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించడంలో పోలింగ్ అధికారులు, సిబ్బందే అత్యంత కీలకమని గుంటూరు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్లోని వీసీ సమావేశ మందిరంలో ఎన్నికల విధులకు సిబ్బంది కేటాయింపు, శిక్షణలకు సంబంధించి సోమవారం అధికారులతో మాట్లాడారు. పోలింగ్ రోజు విధులు నిర్వహించే అధికారులు, ఇతర సిబ్బందికి సంబంధించి రాండమైజేషన్ చేపట్టాల్సి ఉందన్నారు.

News March 25, 2024

గుంటూరులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

image

గుంటూరు మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో సోమవారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రెండు బైకులు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో వెంటనే ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. అనంతరం క్షతగాత్రులను  ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని క్షతగాత్రుల వివరాలు తెలియాల్సిఉందని పోలీసులు తెలిపారు.

News March 25, 2024

రెంటచింతల: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తరలి వ్యక్తి మృతి చెందిన ఘటన రెంటచింతల మండల పరిధిలోని పాలువాయి గ్రామంలో సోమవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుంట మణికంఠ రెడ్డి (32) తన ఇంటి ఎదురుగా ఉన్న విద్యుత్ మోటారు పట్టుకోగా షాక్ తగిలి చనిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News March 25, 2024

గుంటూరు: రైలు కింద పడి యువకుడి మృతి

image

రైలు కిందపడి యువకుడు మృతిచెందిన ఘటనపై సోమవారం గుంటూరు GRP పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నంబూరు నుంచి రెడ్డిపాలెం వెళ్లే మార్గంలో రైలు పట్టాలపై యువకుడి మృతదేహం ఉందని సమాచారంతో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రమేశ్ వెళ్లి పరిశీలించారు. యువకుడి పేరు, వివరాలు తెలియలేదని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. వివరాలు తెలిసిన వాళ్లు GRP పోలీసులను సంప్రదించాలన్నారు.