India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గుంటూరు మిర్చి యార్డుకు మంగళవారం 43,284 మిర్చి టిక్కీలు విక్రయానికి రాగా ముందురోజు నిల్వ ఉన్న వాటితో కలిపి 41,648 అమ్మకం జరిగినట్లు గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి చంద్రిక తెలిపారు. ఇంకా యార్డు ఆవరణలో 7,909 మిర్చి టిక్కీలు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. వివిధ రకాల మిరపకాయలకు ధరలు పలు విధాలుగా నమోదయ్యాయి.

అంబేడ్కర్ విగ్రహాన్ని వైసీపీనే ధ్వంసం చేసి, ప్రభుత్వంపై బురద జల్లేందుకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. మంగళగిరిలో ఆయన మాట్లాడారు. దళితులంటే జగన్కు ఎందుకు అంత చిన్నచూపని ఆయన ప్రశ్నించారు. దళితుడైన సింగయ్యపై కారు ఎక్కించి చంపిన క్రూర స్వభావి జగన్ అన్నారు. రాజ్యాంగాన్ని లెక్కచేయని వైసీపీని రాష్ట్రం నుంచి బాయికాట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

పురాణాల్లో దేవుళ్లు మంచి పనులు చేస్తుంటే రాక్షసులు అడ్డుపడినట్టు, సీఎం చంద్రబాబు మంచి పనులు చేస్తుంటే జగన్ అడ్డుపడుతున్నాడని ఏపీ డబ్ల్యూసీఎఫ్సీ ఛైర్మన్ పీతల సుజాత మండిపడ్డారు. మంగళవారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళల అభ్యున్నతికి టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషా శ్రీచరణ్, మేరుగ నాగార్జున సహా పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో జిల్లాకు 5 రాష్ట్ర స్థాయి, 48 జిల్లా స్థాయి స్వచ్ఛ అవార్డులను కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రదానం చేశారు. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ నిషేధం వంటి అంశాల్లో అసాధారణ కృషి చేసినవారికి ఈ అవార్డులు ఇచ్చారు. ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు 36 లక్షల మరుగుదొడ్లు నిర్మించి, చెత్త నుంచి సంపద సృష్టించారని కొనియాడారు.

అన్నమయ్య జిల్లా నకిలీ మద్యం కేసులో A-12 ముద్దాయిగా ఉన్న తెనాలికి చెందిన కొడాలి శ్రీనివాసరావు పరారీలో ఉన్నాడు. అతని కోసం ఎక్సైజ్ అధికారులు గాలిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల రోజున వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్తో కలిసి, తెనాలి ఐతానగర్లోని పోలింగ్ బూత్లో ఓటరు గొట్టిముక్కల సుధాకర్పై జరిగిన దాడి కేసులోనూ శ్రీనివాసరావు A-11 ముద్దాయిగా ఉన్నట్లు సమాచారం.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జులై నెలలో జరిగిన ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ రెగ్యులర్ సెకండ్ సెమిస్టర్ ఫలితాలను యూనివర్సిటీ పరీక్షల సర్వ నియంత్రణ అధికారి ఆచార్య ఆలపాటి శివప్రసాద్ సోమవారం విడుదల చేశారు. పరీక్షలు వ్రాసిన 73మంది విద్యార్థులకు గాను 64 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. పరీక్ష పత్రాల రీ వెరిఫికేషన్ కోసం ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈనెల 15వ తేదీ లోపు రూ.1860 నగదు చెల్లించాలన్నారు.

అమరావతి రాజధానిలో పలు ఇంటర్నేషనల్ స్కూల్స్కు భూమి కేటాయింపులు జరిగిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటివరకు CRDA మొత్తం ఐదు ఇంటర్నేషనల్ స్కూల్స్కు భూ కేటాయింపులు జరిపినట్లు సమాచారం. వాటిలో పోదర్ ఇంటర్నేషనల్ స్కూల్ – 3 ఎకరాలు, చిన్మయ మిషన్ స్కూల్ – 3 ఎకరాలు గ్లెండేల్ అకాడమీ – 5 ఎకరాలు, కేంద్రీయ విద్యాలయం – 5 ఎకరాలు, మోంట్ఫోర్ట్ ఇంటర్నేషనల్ అకాడమీ – 3 ఎకరాలు (స్థల క్లియరెన్స్ జరుగుతోంది).

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వ్యాయామ కళాశాలలో పీజీ డిప్లొమా ఇన్ యోగ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్, ఎమ్మెస్సీ ఇన్ యోగ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్, ఎమ్మెస్సీ యోగా లేట్రల్ ఎంట్రీ కోర్సులకు కౌన్సిలింగ్ పూర్తి అయిన తర్వాత మిగిలి ఉన్న సీట్లకు ఆహ్వానం పలుకుతున్నట్లు అధికారులు సోమవారం తెలిపారు. ఈనెల 7 నుంచి 20వ వరకు ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 7396458123, 9703000795ను సంప్రదించాలన్నారు.

గుంటూరు–అమరావతి రోడ్డు పనుల కోసం రూ.6.30 కోట్లు మంజూరు అయ్యాయి. కాగా త్వరలో పనులు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పల్నాడు జిల్లా అమరావతి – గుంటూరు రహదారి రోడ్డు పనులు పలుమార్లు మరమ్మతు పనులు చేశారు. అయినా భారీ వాహనాల రాకపోకలతో రోడ్డు ఎక్కువ శాతం దెబ్బతింది. దీంతో సర్కార్ ఎట్టకేలకు రోడ్డు పనుల కోసం నిధులు మంజూరు చేసింది.
Sorry, no posts matched your criteria.