Guntur

News August 13, 2025

గుంటూరు ప్రజలకు కమిషనర్ సూచన

image

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఏ సమస్య తలెత్తకుండా జీఎంసీ అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని గుంటూరు కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. బుధవారం వర్ష ప్రభావిత ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు తాగునీటి సమస్యలు, చెట్లు విరిగి ట్రాఫిక్‌కి అడ్డుగా ఉన్నా, వర్షం నీరు నిలిచినా 08632345103, 104,105 నంబర్‌లకు సమాచారం అందించాలని చెప్పారు.

News August 12, 2025

పనులు పూర్తైనా బిల్లులు రావడంలేదు: కాంట్రాక్టర్ల ఆవేదన

image

రాష్ట్రంలోని కాంట్రాక్ట్ పనులను పూర్తి చేసినప్పటికీ బిల్లులు రావడం లేదని రాష్ట్ర బిల్డింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.విజయకుమార్, ప్రధాన కార్యదర్శి ఎం వి ఏ సూర్య ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తాడేపల్లి బైపాస్ రోడ్డులో వారు మాట్లాడారు. ప్రభుత్వం స్పందించి కేటాయించిన బడ్జెట్ వినియోగంపై ఉన్న త్రైమాసిక పరిమితులను సడలించాలని డిమాండ్ చేశారు.

News August 12, 2025

జాతీయ లోక్ అదాలత్‌కు సిద్ధం కండి: ప్రధాన న్యాయమూర్తి

image

బ్యాంకులు, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ సంస్థల ప్రతినిధులతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కల్యాణ చక్రవర్తి మంగళవారం సమావేశమయ్యారు. సెప్టెంబర్ 13న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ విజయవంతం కోసం ఈ సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. క్రిమినల్, సివిల్ కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. న్యాయ విజ్ఞాన సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జియావుద్దీన్ ఆర్‌డిఓ ఆఫీస్‌ను సందర్శించారు.

News August 12, 2025

‘తెనాలి జిల్లా’ ఆశలు మరోసారి ఆవిరి.?

image

రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజనకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. 26 జిల్లాలను 32 జిల్లాలుగా పెంచుతూ నిర్ణయం తీసుకుంటుంది. ఆ జాబితాలో తెనాలి పేరు లేకపోవడంతో ‘తెనాలి జిల్లా’ ఆశలు మళ్లీ ఆవిరవుతున్నాయి. దీంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. ఇప్పటికే పార్లమెంటును కోల్పోయిన ఈ ప్రాంతానికి ప్రత్యేక జిల్లాకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఆ అవకాశం కూడా దక్కకపోతుండటం అందరిని నిరాశ పరుస్తోంది.

News August 12, 2025

ఆనాటి ఉద్యమ సారథి కల్లూరి చంద్రమౌళి

image

1942లో క్విట్ ఇండియా తీర్మానంలో పాల్గోన్న ప్రముఖ స్వాతంత్ర యోధుడు కల్లూరి చంద్రమౌళి తిరిగి తెనాలికి వచ్చారు. దీనిలో భాగంగా 1942 ఆగస్టు 12న ఆయన నాయకత్వంలో తెనాలిలో ఉద్యమం జరిగింది. శాంతియుత అందోళన అదుపు తప్పి హింసాత్మక రూపు ధరించింది. తెనాలి రైల్వై స్టేషన్ పూర్తిగా తుగలపెట్టిన ఆందోళనకారులు తమ తదుపరి లక్ష్యంగా తాలుకా ఆఫీస్ వైపు వెళ్తుండగా పోలీసులు కాల్పులు జరపటంతో 7 మృతి చెందగా అనేకమంది గాయపడ్డారు.

News August 12, 2025

వారు దేశం కోసం ప్రాణాలర్పించి నేటికీ 83 సంవత్సరాలు

image

1942 ఆగస్టు 12 న తెనాలి పట్టణంలో క్విట్ ఇండియా ఉద్యమంలో వందలాది కార్యకర్తలు పాల్గొన్నారు. అప్పుడు పోలీసులు ప్రజలు మధ్య ఘర్షణ నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసుల కాల్పులలో ఏడుగురు ఉద్యమకారులు ప్రాణాలు అర్పించారు.
★ మాజేటి సుబ్బారావు
★ శిరిగిరి లింగయ్య
★ తమ్మినేని సుబ్బారెడ్డి
★ గాలి రామకోటయ్య
★ ప్రయాగ రాఘవయ్య
★ జాస్తి అప్పయ్య
★ భాస్కరుని లక్ష్మీనారాయణ
వీరి జ్ఞాపకార్థమే మన తెనాలి రణరంగ చౌక్.

News August 12, 2025

గుంటూరు: TDP అధ్యక్షుడి కోసం పెరుగుతున్న ఆశావాహులు

image

గుంటూరులో మిర్చి ఎంత ఘాటుగా ఉంటుందో రాజకీయాలు కూడా అంతే హాట్‌గా ఉంటాయి. అలాంటి జిల్లాకు అందులోనూ అధికార పార్టీకి అధ్యక్షుడిగా ఉండటం మామూలు విషయం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రూలింగ్ పార్టీ పగ్గాలు చేతులు మారబోతున్నాయని తెలిసి భారీగా ఆశావాహులు పుట్టుకొస్తున్నారు. రాజధాని జిల్లా కావడంతో నేతలు తీవ్రస్థాయిలో పావులు కదుపుతున్నారు. అధ్యక్ష పదవీ ఎవరికి ఇస్తారనేది తెలుగు తమ్ముళ్లలో చర్చ నడుస్తోంది.

News August 12, 2025

తెనాలి: వందేమాతరం నినాదాన్ని జ్వాలలా రగిలించిన సైరా చిన్నపరెడ్డి

image

గాదె చిన్నపరెడ్డి @ సైరా చిన్నపరెడ్డి.. తెనాలి డివిజన్ చేబ్రోలు సమీప కొత్తరెడ్డిపాలెం స్వస్థలం. రెడ్డి రాజుల పరాక్రమాన్ని పుణికి పుచ్చుకున్న స్వాతంత్రోద్యమకారుడు. జాతీయోద్యమాన్ని మలుపు తిప్పిన 1909 కోటప్పకొండ దొమ్మీ ఆయన సాహసానికి ప్రతీక. వందేమాతరం నినాదంతో స్ఫూర్తిని పొంది, ఉద్యమానికి ఊపిరిలూదిన చిన్నపరెడ్డిపై గాయకులు, కథకులు ఎన్నో గేయాలు రాశారు. చివరికి బ్రిటిష్ పాలకుల కక్షకు ఉరికొయ్యన ఊయలలూగాడు.

News August 11, 2025

GNT: గవర్నర్ రాక ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

image

రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ రేపు నగరానికి రానున్నారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రెడ్‌క్రాస్ నిర్వహిస్తున్న “ఏపీ క్లైమెట్ యాక్షన్ క్యాంపెయిన్ అండ్ అమరావతి ప్లాస్టిక్ ఫ్రీ సిటీ క్యాంపెయిన్” ప్రారంభోత్సవ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొంటారు. కలెక్టర్ నాగలక్ష్మీ సోమవారం విజ్ఞాన మందిరంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

News August 11, 2025

గుంటూరు: పోటాపోటీగా టీడీపీ నామినేషన్లు?.. ఎన్నిక వాయిదా

image

గుంటూరులోని NTR స్టేడియం పాలకవర్గ ఎన్నికలు ఆగస్టు 18న జరగాల్సి ఉంది. అయితే అది వాయిదా పడటంతో TDP కార్యకర్తల్లో అసహనం పెరిగిందని చర్చ స్థానికంగా నడుస్తోంది. టీడీపీ నేతలు వర్గాలుగా చీలిపోయి పదవులకు నామినేషన్లు వేయడంతో ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. దీనిపై ఎంపీ పెమ్మసాని నగర నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఎన్నికలు వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.