India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
* పల్నాడు జిల్లాలో వైసీపీ నేతపై దాడి
*బడ్జెట్పై స్పందించిన నారా లోకేశ్
* బాపట్ల జిల్లా వాసులకు SP హెచ్చరిక
*బడ్జెట్పై YS షర్మిల కీలక వ్యాఖ్యలు
* YCP ఎమ్మెల్యేకి మంత్రి లోకేశ్ కౌంటర్
*తాడేపల్లి నుంచి నేడు ఢిల్లీకి వెళ్లిన జగన్
* పల్నాడులో విషాదం.. నాలుగేళ్ల చిన్నారి మృతి
*పల్నాడు: నాగార్జున యాదవ్కు 41ఏ నోటీసులు
పెదకూరపాడు మండల పరిధిలోని 75 తాళ్లూరు గ్రామానికి చెందిన నియోజకవర్గ వైసీపీ నేత ఈదా సాంబిరెడ్డిపై మంగళవారం రాత్రి దాడి జరిగింది. మండల పరిధిలోని ఉంగుటూరు- ఖమ్మంపాడు మధ్యలో గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై దాడి చేశారు. ఈ దాడిలో సాంబిరెడ్డికి రెండు కాళ్ళు రెండు చేతులు విరిగాయి. చికిత్స నిమిత్తం గుంటూరు ప్రయివేటు హాస్పిటల్కు తీసుకువెళ్లారు.
బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనలకు తాను చాలా సంతోషిస్తున్నానని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర బడ్జెట్లో తమ పోరాటాన్ని గుర్తించి, పారిశ్రామికాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, నీటిపారుదల.. హెచ్ఆర్డీ వంటి ముఖ్యమైన రంగాలను కవర్ చేస్తూ.. ప్రత్యేక, సంపూర్ణ ప్యాకేజీ అందించడం రాష్ట్ర ప్రజలకు చాలా గర్వకారణమని అన్నారు.
జిల్లాలో వ్యవసాయరంగం అభివృద్ధికి బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్ నాగలక్ష్మీ తెలిపారు. మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన బ్యాంకర్ల జిల్లా కన్సల్టేటివ్ కమిటీ సమావేశం జరిగింది. యువతను, మహిళలను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ప్రోత్సహించేందుకు కృషి చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు బ్యాంకర్లు విరివిగా రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి రూ.15 వేల కోట్ల గ్రాంట్ ఇవ్వటం అభినందనీయమని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మంగళవారం అన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశం అనంతరం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. అమరావతి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించిన ప్రధానికి, కేంద్ర ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
కేంద్ర బడ్జెట్లో కేటాయింపులతో రాజధాని <<13688307>>అమరావతి<<>>లో పనులు పరుగులు పెట్టనున్నాయి. ఐదేళ్ల తర్వాత అమరావతి నిర్మాణానికి రూ.15వేల కోట్లు కేంద్ర బడ్జెట్లో కేటాయించారు. అవసరాలను బట్టి నిధులు పెంపు ఉంటుందని ప్రకటించిన నేపథ్యంలో రాజధానిలో అభివృద్ధి పరుగులు పెడుతుందని కూటమి నేతలు చెబుతున్నారు. తమ ప్రభుత్వం ఏర్పడగానే రాజధాని పనులు ప్రారంభిచామని, తాజా ప్రకటనతో AP అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
అసెంబ్లీ వద్ద వైసీపీ అధినేత <<13680502>>జగన్<<>> సోమవారం పోలీసు అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మధుసూదనరావు అని సంబోధిస్తూ జగన్ మాట్లాడిన వీడియో నిన్న వైరల్ అయింది. కాగా, ఆయన పేరు మధుసూదన్ రావు కాదనే వార్తను టీడీపీ తన అధికారిక ‘X’లో పోస్ట్ చేసింది. ‘ఫేకు జగన్.. మరోసారి బకరా అయ్యారు’ అని అందులో పేర్కొంది.
ఎమ్మెల్సీ అప్పిరెడ్డి జగన్ ప్రభుత్వం హయాంలో సాధారణ ఎమ్మెల్సీ, YCP కార్యాలయ కార్యదర్శిగా ఉన్నారు. మాజీ సీఎం జగన్తో పోల్చుకుంటే అప్పిరెడ్డి స్థాయి చిన్నది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. శాసనమండలిలో అప్పిరెడ్డిని ప్రతిపక్ష నేతగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడంతో ఆ హోదాకు తగినట్టు అప్పిరెడ్డికి ప్రత్యేక ఛాంబర్, ప్రోటోకాల్, గౌరవం మర్యాదలు లభిస్తాయి. కానీ YCP అధ్యక్షుడు జగన్కు మాత్రం ఇవేమీ ఉండవు.
గుంటూరు పశ్చిమ మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి YCPకి సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనికి గల కారణంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. 2019లో TDP నుంచి YCPలో చేరిన ఆయనకు 2024 ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. అదే సమయంలో గిరికి పార్టీ నగర అధ్యక్ష బాధ్యతల్ని అప్పగించినా, ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా లేరని సమాచారం. త్వరలో రాజకీయ భవిష్యత్తుపై ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఆధ్వర్యంలో ఈనెల 24, 25 తేదీల్లో చౌడవరం ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజులపాటు అంతరిక్ష వైజ్ఞానిక ప్రదర్శన (స్పేస్ ఎగ్జి బిషన్) ఉంటుందని జిల్లా విద్యాశాఖాధికారి పి.శైలజ తెలిపారు. ప్రదర్శనలో రాకెట్ నమూనాలు, వివిధ ప్రయోగాలు, లాంచ్ ప్యాడ్ల ప్రదర్శనతోపాటు శాస్త్రవేత్తల ఉపన్యాసాలు ఉంటాయని తెలిపారు. 25వ తేదీ ఉదయం విద్యార్థులకు ప్రతిభా పరీక్ష ఉంటుందని తెలిపారు.
Sorry, no posts matched your criteria.