India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చేబ్రోలులో మైనర్ బాలిక మృతి కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుడు నాగరాజుకి నేర చరిత్ర ఉన్నట్లు నిర్ధారించారు. అతనిపై కొండపల్లి, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు చెప్పారు. కొండపల్లి పరిధిలో ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని ఆమెని హత్య చేసి పరారయ్యాడు. మరో మహిళతో సంబంధం పెట్టుకొని విభేదాలు రావడంతో హత్యాయత్నం చేశాడు. చేబ్రోలు వచ్చిన ఐదేళ్లలో 6 SIMలు మార్చాడని తేలింది.
రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA)లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి కోరుతూ.. సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ ఈనెల 10న పురపాలక శాఖకు లేఖ రాశారు. దీనికి ఆమోదం తెలుపుతూ.. మూడేళ్ల కాలపరిమితితో 75 ఒప్పంద పోస్టులను, పొరుగుసేవల పద్ధతిలో 68 పోస్టులను నింపేందుకు పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి GO జారీ చేశారు.
వినుకొండ పట్టణంలో బుధవారం రాత్రి హత్య జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. మలికా గార్గ్ పల్నాడు జిల్లా ఎస్పీగా ఉండి ఉంటే వినుకొండలో ఈ దారుణ హత్య జరిగి ఉండేది కాదని ‘X’ లో పోస్ట్ చేశారు.
నారయణాద్రి, విశాఖ, చెన్నై ఎక్స్ప్రెస్ రైళ్లను ఈనెల 19 నుంచి పిడుగురాళ్ల, నడికుడి స్టేషన్లలో నిలిపేదిలేదని రైల్వే అధికారులు ప్రకటించారు. దీంతో వెంటనే ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు రైల్వే అధికారులతో మాట్లాడారు. ప్రజల అవసరాల దృష్ట్యా రైళ్లను పిడుగురాళ్ల, నడికుడి రైల్వేస్టేషన్లలో నిలుపుదల చేయాలని కోరారు. రైల్వే అధికారులు స్పందించి ఈనెల 21 నుంచి 3 రైళ్లను నిలుపుదల చేస్తామని చెప్పారు.
వినుకొండ ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్వైజర్గా పనిచేస్తున్న షేక్ రషీద్ (25) బుధవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. రషీద్ ముళ్లమూరు బస్టాండ్లోని మద్యం దుకాణంలో పని ముగించుకుని బయటకు రాగానే, బయట కాపు కాసిన ఏసీ మెకానిక్ జిలాని కత్తితో రషీద్పై దాడి చేశాడు. ఈ సంఘటనపై పల్నాడు ఏఎస్సీ లక్ష్మీపతి మాట్లాడుతూ.. ఇద్దరి మధ్య వ్యక్తిగత కక్షలతోనే దాడి జరిగిందని గతంలో జిలానిపై రషీద్ దాడి చేసినట్లు చెప్పారు.
నేటి నుంచి ఈనెల 28 వరకు జరగనున్న 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్క జనసేన నాయకుడు, జనసైనికుడు, వీర మహిళ బాధ్యతగా పాల్గొనాలని మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం కోరారు. కొత్త సభ్యత్వ నమోదుతోపాటు, సభ్యత్వ రెన్యువల్ జరిగేలా, ప్రతి జనసైనికుడి కుటుంబానికి రక్షణ కల్పించాలని ఉద్దేశమన్నారు. పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఆలోచనను అమలు చేయాలని సూచించారు.
ఈనెల 30 నుంచి జరగాల్సిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ దూరవిద్య పీజీ పరీక్షలు వాయిదా పడినట్లు, జేకేసీ కళాశాల క్యాంపస్ వర్సిటీ స్టడీ సెంటర్ సమన్వయకర్త పి గోపీచంద్ తెలిపారు. పీజీ ద్వితీయ పరీక్షలు ఆగస్ట్ 20 నుంచి 25 వరకు, పీజీ ప్రథమ సంవత్సర పరీక్షలు సెప్టెంబర్ 20 నుంచి 24 వరకు జరుగుతాయని తెలిపారు. ఏపీ ఆన్లైన్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.
ఈనెల 30 నుంచి జరగాల్సిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ దూరవిద్య పీజీ పరీక్షలు వాయిదా పడినట్లు, జేకేసీ కళాశాల క్యాంపస్ వర్సిటీ స్టడీ సెంటర్ సమన్వయకర్త
పి గోపీచంద్ తెలిపారు. పీజీ ద్వితీయ పరీక్షలు ఆగస్ట్ 20 నుంచి 25 వరకు, పీజీ ప్రథమ సంవత్సర పరీక్షలు సెప్టెంబర్ 20 నుంచి 24 వరకు జరుగుతాయని తెలిపారు. ఏపీ ఆన్లైన్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.
బాపట్ల జిల్లాకు చెందిన యువకుడు ఆస్ట్రేలియాలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. బాపట్లకు చెందిన సూర్యతేజ MS కోసం ఆస్ట్రేలియా వెళ్లారు. సూర్యతేజ, ప్రకాశం జిల్లాకు చెందిన చైతన్యతో పాటు మరో స్నేహితుడు కలిసి ఆస్ట్రేలియాలోని మిల్లామిల్లా జలపాతానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు సూర్యతేజ జలపాతంలోకి జారిపడటంతో అతడిని కాపాడేందుకు చైతన్య దిగగా ఇద్దరూ మునిగి చనిపోయారు.
గుంటూరు జిల్లా నాగార్జున సాగర్లో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. నాగార్జున సాగర్తో పాటు ఏపీలోని మరో 3 ప్రాంతాల్లో చిన్నతరహా ఎయిర్పోర్ట్లు నిర్మించేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI)కు సీఎం చంద్రబాబు తాజాగా ప్రతిపాదనలు పంపించారు. కాగా ఇందుకోసం 1,800 ఎకరాల భూమి అవసరమవుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి AAI వర్గాలు తెలిపాయి.
Sorry, no posts matched your criteria.