Guntur

News October 16, 2024

బాపట్ల: గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి

image

బాపట్ల డిపోకు చెందిన RTC బస్సు బుధవారం రేపల్లె నుంచి చీరాల వెళుతున్న క్రమంలో కర్లపాలెంలోని ఓ టీ స్టాల్ దాటిన తరువాత బస్సు డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో డ్రైవర్ వెంటనే బస్సును పక్కనే ఉన్న పొలాలలోకి సురక్షితంగా నిలిపాడు. అనంతరం RTC డ్రైవర్ సాంబశివరావు గుండెపోటుతో బస్సులోనే మృతిచెందాడు. ఈ బస్సులో 60 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News October 16, 2024

17 నుంచి ANUలో దూరవిద్యా పరీక్షలు

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని దూర విద్యాకేంద్రంలో ఈ నెల 17 నుంచి యూజీ, పీజీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలం పేర్కొన్నారు. మంగళవారం పరీక్ష కేంద్రాల చీప్ సూపరింటెండెంట్లతో రిజిస్ట్రార్ సమావేశమయ్యారు. పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని సూచించారు. గతంలో మాదిరిగా అక్రమాలు జరిగితే ఉపేక్షించబోమని చెప్పారు. పరీక్షల నిర్వహణలో సూపరింటెండెంట్లు కీలకమన్నారు.

News October 16, 2024

గుంటూరు జిల్లా నిరుద్యోగ యువతకు గమనిక

image

గుంటూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ నెల 19న విజయవాడలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి విక్టర్ బాబు తెలిపారు. డిప్లొమా, డిగ్రీ చదివి, 19-25ఏళ్ల లోపు అభ్యర్థులు అర్హులని తెలిపారు. అర్హతలు గల అభ్యర్థులు ముందుగా tinyurl.com/jobdrive-vjdeastలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News October 15, 2024

కేంద్రమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన నరసరావుపేట ఎంపీ

image

రాష్ట్రంలో CRIF పథకం కింద రాష్ట్ర రహదారుల అభివృద్ధికి రూ.400 కోట్లు విడుదల చేసిన కేంద్రమంత్రి నితిన్ గట్కారిని మంగళవారం ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పల్నాడులో దుర్గి-వెల్దుర్తి రహదారి, పలువాయి జంక్షన్-సత్రశాల రోడ్డు(వయా) పాశర్లపాడు, జెట్టిపాలెం రహదారికి నిధులు మంజూరైనట్లు ఎంపీ తెలిపారు. కుప్పగంజి వాగు నుంచి వోగేరు వాగు వరకు డ్రైన్ల నిర్మాణం కోసం గ్రాంట్ విడుదల చేయాలని కోరారు.

News October 15, 2024

గుంటూరు రైల్వే ఓవర్ బ్రిడ్జికి నిధులు.. గడ్కరీకి చంద్రబాబు కృతజ్ఞతలు

image

గుంటూరు రైల్వే ఓవర్ బ్రిడ్జి పునర్నిర్మాణానికి రూ.98 కోట్లు కేంద్ర మంత్రి గడ్కరీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. గుంటూరు అభివృద్ధికి ఈ నిధులు ఉపయోగపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చొరవతో గడ్కరి చేసిన ప్రకటన ఎన్నో ఏళ్ల గుంటూరు వాసుల కల నెరవేర్చనుంది.

News October 15, 2024

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనగాని

image

తుపాను విపత్తును సమర్థంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. 4 నుంచి 5 రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసిందన్నారు. అతిభారీ వర్షాలు కురిసి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదం ఉన్నందున ప్రజలు అధికారుల సూచనలు పాటించి తక్షణం సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులకు సూచించారు.

News October 15, 2024

గుంటూరు రైల్వే ఓవర్ బ్రిడ్జికి రూ.98 కోట్లు విడుదల

image

గుంటూరు రైల్వే ఓవర్ బ్రిడ్జి పునర్మిణానికి రూ.98 కోట్లు కేంద్ర మంత్రి గడ్కరీ విడుదల చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ సమస్యని నితిన్ గట్కరీ దృష్టికి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ పలుమార్లు తీసుకెళ్లారు. ఎన్నికల అనంతరం ఫ్లైఓవర్‌పై మున్సిపల్ అధికారులతో పెమ్మసాని అనేక రివ్యూలు చేపట్టారు. ఎట్టకేలకు పెమ్మసాని చొరవతో గుంటూరు నగర ప్రజల కల త్వరలో నెరవేరనుంది.

News October 15, 2024

గుంటూరు: భార్యాభర్తలకు జాక్‌పాట్.. ఏకంగా 6 షాపులు

image

గుంటూరు జిల్లాలో మద్యం దుకాణాలు నిర్వహించిన లాటరీలో భార్య భర్తలకు ఏకంగా ఆరు మద్యం దుకాణాలు లభించడంతో సంబరాలు చేసుకుంటున్నారు. గుంటూరులో ఒక బారు నిర్వహిస్తున్న యజమాని తన అదృష్టాన్ని పరిశీలించుకోవటానికి తన భార్య పేరుతో కలిసి 40 దరఖాస్తులు చేశారు. వారికి జిల్లాలో ఆరు మద్యం దుకాణాలు లాటరీలో రావటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

News October 15, 2024

గుంటూరు: మహిళలకు ఎన్ని మద్యం షాపులు వచ్చాయంటే?

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో పోలీసుల బందోబస్తు మధ్య మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ ముగిసింది. 373 షాపులకు 9,191 దరఖాస్తులు వచ్చాయి. కాగా గుంటూరు జిల్లాలో 4 గంటల్లోనే లాటరీ ప్రక్రియ ముగియడం విశేషం. గుంటూరు జిల్లాలో 127 షాపులకు 11 మహిళలకు దక్కాయి. అటు బాపట్ల జిల్లాలో 117 దుకాణాలకు గాను 7, పల్నాడు జిల్లాలో 129 షాపులకు 7 చోట్ల మహిళలకు దక్కాయి. అత్యధికంగా మంగళగిరిలో 28 షాపులకు 6 మహిళలకే దక్కడం విశేషం.

News October 15, 2024

గుంటూరు: ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో టీవీ అండ్ ఫిల్మ్ స్టడీస్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కోర్స్ కో-ఆర్డినేటర్ మధుబాబు సోమవారం తెలిపారు. రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ విధానంలో ఈ కోర్సును నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కోర్సులో ప్రవేశాలు పొందేందుకు ఏదైనా డిగ్రీ కోర్స్ ఉత్తీర్ణత కలిగి ఉండాలని సూచించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.