India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎన్నికల్లో జరిగిన దాడుల కేసుల్లో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కాగా శుక్రవారం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్పై హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. గురువారం ఇరువర్గాల వాదన ముగిసింది. ఇప్పటికే జిల్లా కోర్టులో రెండు సార్లు పిన్నెల్లి బెయిల్ పిటిషన్ కొట్టివేసిన విషయం తెలిసిందే.
నకరికల్లులో 26న అండర్-18 ఆట్యా పాట్యా అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు శంకరభారతీపురం పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు పుల్లయ్య తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే విద్యార్థులు 1-01-2007 తర్వాత జన్మించిన వారై ఉండాలని, వయసు, ఎత్తు కలిపి బాలురు 250 నుంచి 260 వరకు, బాలికలైతే 230 నుంచి 240 వరకు ఇండెక్స్ కలిగి ఉండాలన్నారు. ఎంపికైన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.
రాష్ట్ర స్థాయి క్యారమ్స్ పోటీలను చిలకలూరిపేటలోని సీఆర్ క్లబ్ ఈనెల 24, 25 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర క్యారమ్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ జలీల్ తెలిపారు. చిలకలూరిపేటలో ఆయన మాట్లాడుతూ.. పోటీలకు జాతీయ స్థాయిలో ఆడిన క్రీడాకారులు, రాష్ట్ర సెక్రటేరియట్ ఉద్యోగులతో పాటు పలువురు క్రీడాకారులు మొత్తం 160 మంది వరకు తలపడనున్నారని వివరించారు.
రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలు మాత్రమే ఇసుక రవాణా చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. శుక్రవారం నుంచి స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక బుకింగ్ చేయడం లేదని, తుళ్లూరు, తాడేపల్లి తహశీల్దార్ కార్యాలయాల్లో, గుంటూరు ఆర్డీఒ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్ర 5 గంటల వరకు బుకింగ్ చేసుకోవాలని అన్నారు. తాళ్లాయపాలెం, లింగాయపాలెం స్టాక్ పాయింట్లలో 3 లక్షల టన్నుల ఇసుక నిల్వ ఉందన్నారు.
బాలికను మోసం చేసిన ఓ యువకుడిపై కేసు నమోదు చేసినట్లు వేమూరు ఎస్సై రవికృష్ణ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు ప్రకారం.. వేమూరు మండలం ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికకు కొన్ని నెలల క్రితం ఆదే గ్రామానికే చెందిన నాగచైతన్య ప్రేమిస్తున్నానని పలుమార్లు ఆమెతో సన్నిహితంగా మెలిగాడు. బాలిక గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని కోరింది. అందుకు అతను నిరాకరించడంతో బాలిక పోలీసులను ఆశ్రయించింది.
తుళ్లూరు మండలంలోని తాళాయపాలెం, లింగాయపాలెం ఇసుక స్టాక్ పాయింట్లను గురువారం కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సతీశ్ కుమార్ పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానాన్ని మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతో స్టాక్ పాయింట్లను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. అనుమతి ఉన్న వాహనాలకు మాత్రమే స్టాక్ యార్డులోకి అనుమతి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.
రాష్ట్రంలో వైసీపీకి సంబంధించి పలు పదవులను ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భర్తీ చేశారు. గుంటూరు జిల్లా నుంచి చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా గంజి చిరంజీవిని నియమించగా.. విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పానుగంటి చైతన్యను నియమించారు. ఈ సందర్భంగా జగన్ వారికి పలు సూచనలు చేస్తూ.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మెగాస్టార్ చిరంజీవికి మంత్రి నారా లోకేశ్ X వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ నటన తెలుగు ప్రేక్షకులకు ఓ వరం. మీ డాన్స్ అభిమానులకు కనుల విందు. బ్లడ్ బ్యాంక్ ద్వారా ప్రాణ దానం చేస్తున్న మీ సేవా స్ఫూర్తి మాకు ఆదర్శం. దేవుని ఆశీస్సులతో, తెలుగు ప్రజల ఆదరాభిమానాలతో, ఆయురారోగ్యాలతో వందేళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.
తల్లి పేరుతో మొక్క నాటే కార్యక్రమంలో భాగంగా నరసరావుపేటలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ అరుణ్ బాబు తన తల్లి పేరుతో గురువారం మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ తల్లి పేరుతో మొక్కలు నాటాలన్నారు. తద్వారా పర్యావరణాన్ని పరిష్కరించుకోవచ్చని అన్నారు. సకాలంలో వర్షాలు కురుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
గుంటూరు రేంజ్ పరిధిలో 13 మంది సీఐలను బదిలీ చేస్తూ ఐజీ త్రిపాఠి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్ల జిల్లా వేమూరు సీఐగా పీవీ ఆంజనేయులు, రేపల్లె రూరల్ సీఐగా సురేశ్ బాబులను నియమించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సీఐగా గన్నవరపు శ్రీనివాసరావు, మేడికొండూరు సీఐగా నాగూర్ మీరా, గుంటూరు దిశా-1 సీఐగా నారాయణ, పల్నాడు జిల్లా సత్తెనపల్లి సీఐగా బ్రహ్మయ్య, నరసరావుపేట టూ టౌన్ సీఐగా హైమారావును నియమించారు.
Sorry, no posts matched your criteria.