Guntur

News July 15, 2024

హైకోర్టులో నందిగం సురేశ్ పిటిషన్‌ విచారణ.. రేపటికి వాయిదా

image

మంగళగిరి టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఇదే కేసులో ఇప్పటికే పలువురు వైసీపీ నేతలకు న్యాయస్థానం ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

News July 15, 2024

నరసరావుపేట: కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ శ్రీనివాసరావు

image

పల్నాడు జిల్లాకు నూతన ఎస్పీ శ్రీనివాసరావు సోమవారం కలెక్టర్ పి. అరుణ్ బాబును కలెక్టర్ ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతి భద్రతలపై కొద్దిసేపు చర్చించారు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కలెక్టర్ ఆయనకు సూచించారు.

News July 15, 2024

సిమెంట్ ఫ్యాక్టరీ ఘటనలో 4కి చేరిన మృతుల సంఖ్య

image

జగ్గయ్యపేట మండలం బూదవాడ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య<<13582186>> ఇప్పటివరకు 4కి చేరింది. <<>>విజయవాడ మణిపాల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సిమెంట్ కర్మాగార ఉద్యోగి శ్రీమన్నారాయణ నేడు మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. మృతుని స్వస్థలం పల్నాడు జిల్లా మాచర్లగా అధికారులు వెల్లడించారు.

News July 15, 2024

బాపట్ల: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌లు సీజ్

image

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను బాపట్ల రూరల్ పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కథనం మేరకు.. బాపట్ల మండలం నందిరాజు తోట గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారం మేరకు దాడి నిర్వహించి ఒక జెసీబీ, రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News July 14, 2024

గుంటూరు జిల్లాలో నేడు టాప్ న్యూస్ ఇవే

image

* CM చంద్రబాబు బయోపిక్ షూటింగ్ ప్రారంభం
* బాపట్ల: అన్న హత్యకు తమ్ముడే సూత్రధారి
* గుంటూరు: మహిళతో సహజీవనం..
* మంగళగిరిలో రోడ్డు ప్రమాదంలో.. బాలుడి మృతి
* అంబానీ పెళ్లి వేడుకల్లో గుంటూరు MP పెమ్మసాని
* గుంటూరులో వ్యక్తి మృతి.. హత్యా? ఆత్మహత్యా?
* రేపల్లేలో గంజాయి అమ్ముతున్న 10 మంది అరెస్ట్
* టీడీపీ నేత మృతి.. సంతాపం తెలిపిన మంత్రి లోకేశ్
* ఫిరంగిపురంలో 178 క్వింటాళ్ళ బియ్యం పట్టివేత

News July 14, 2024

మంగళగిరి వద్ద ప్రమాదం.. బాలుడి మృతి

image

మంగళగిరిలోని తెనాలి ఫ్లై ఓవర్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న కారు ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రమాదాన్ని గమనించి క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు.

News July 14, 2024

టీడీపీ నేత మృతికి మంత్రి లోకేశ్ సంతాపం

image

టీడీపీ నేత, ఓటర్ రామకృష్ణగా అందరికి సుపరిచితులైన అన్నే రామకృష్ణ హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు.‌ టీడీపీ కోసం అహర్నిశలు శ్రమించిన రామకృష్ణకు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. TDP ఓటర్ వెరిఫికేషన్ విభాగానికి ఎనలేని సేవ చేశారని రామకృష్ణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాని తన ట్విటర్ (X)లో ట్వీట్ చేశారు.

News July 14, 2024

గుంటూరు: వ్యక్తి మృతి.. హత్యా? ఆత్మహత్యా?

image

గుంటూరు నగరంలోని లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రాస శివయ్య(39) అనే వ్యక్తి శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని భార్య రాస సామ్రాజ్యం ఫిర్యాదు మేరకు ఎస్సై సుబ్బారావు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్యకి పాల్పడ్డాడని మృతుని భార్య వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు హత్యా, ఆత్మహత్యా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

News July 14, 2024

బాపట్ల: అన్న హత్యకు తమ్ముడే సూత్రధారి

image

ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలులో ఈనెల 5వ తేదీన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ కేసులో సోదరుడే ప్రధాన నిందితుడిగా గుర్తించారు. బాపట్ల జిల్లాకు చెందిన కంపిరి సురేశ్ హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. అతనికి ఇద్దరు కూమారులు. వారిలో పెద్దవాడు గంజాయికి బానిసై డబ్బు ఇవ్వాలని లేందటే తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించేవాడు. అన్న తల్లిదండ్రులను చంపేస్తాడని భావించి తమ్ముడే హత్య చేశాడని SI తెలిపారు.

News July 13, 2024

గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా సతీశ్ కుమార్

image

గుంటూరు జిల్లా నూతన ఎస్పీగా సతీశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 37 మంది ఐపీఎస్‌లను ప్రభుత్వం తాజాగా బదిలీ చేసింది. ఇప్పటి వరకు గుంటూరు జిల్లా ఎస్పీగా పని చేసిన తుషార్ డూడిని బాపట్ల ఎస్పీగా నియమించారు. కాగా త్వరలోనే గుంటూరు జిల్లా ఎస్పీగా సతీశ్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు.