India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అన్నమయ్య జిల్లా నకిలీ మద్యం కేసులో A-12 ముద్దాయిగా ఉన్న తెనాలికి చెందిన కొడాలి శ్రీనివాసరావు పరారీలో ఉన్నాడు. అతని కోసం ఎక్సైజ్ అధికారులు గాలిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల రోజున వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్తో కలిసి, తెనాలి ఐతానగర్లోని పోలింగ్ బూత్లో ఓటరు గొట్టిముక్కల సుధాకర్పై జరిగిన దాడి కేసులోనూ శ్రీనివాసరావు A-11 ముద్దాయిగా ఉన్నట్లు సమాచారం.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జులై నెలలో జరిగిన ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ రెగ్యులర్ సెకండ్ సెమిస్టర్ ఫలితాలను యూనివర్సిటీ పరీక్షల సర్వ నియంత్రణ అధికారి ఆచార్య ఆలపాటి శివప్రసాద్ సోమవారం విడుదల చేశారు. పరీక్షలు వ్రాసిన 73మంది విద్యార్థులకు గాను 64 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. పరీక్ష పత్రాల రీ వెరిఫికేషన్ కోసం ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈనెల 15వ తేదీ లోపు రూ.1860 నగదు చెల్లించాలన్నారు.

అమరావతి రాజధానిలో పలు ఇంటర్నేషనల్ స్కూల్స్కు భూమి కేటాయింపులు జరిగిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటివరకు CRDA మొత్తం ఐదు ఇంటర్నేషనల్ స్కూల్స్కు భూ కేటాయింపులు జరిపినట్లు సమాచారం. వాటిలో పోదర్ ఇంటర్నేషనల్ స్కూల్ – 3 ఎకరాలు, చిన్మయ మిషన్ స్కూల్ – 3 ఎకరాలు గ్లెండేల్ అకాడమీ – 5 ఎకరాలు, కేంద్రీయ విద్యాలయం – 5 ఎకరాలు, మోంట్ఫోర్ట్ ఇంటర్నేషనల్ అకాడమీ – 3 ఎకరాలు (స్థల క్లియరెన్స్ జరుగుతోంది).

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వ్యాయామ కళాశాలలో పీజీ డిప్లొమా ఇన్ యోగ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్, ఎమ్మెస్సీ ఇన్ యోగ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్, ఎమ్మెస్సీ యోగా లేట్రల్ ఎంట్రీ కోర్సులకు కౌన్సిలింగ్ పూర్తి అయిన తర్వాత మిగిలి ఉన్న సీట్లకు ఆహ్వానం పలుకుతున్నట్లు అధికారులు సోమవారం తెలిపారు. ఈనెల 7 నుంచి 20వ వరకు ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 7396458123, 9703000795ను సంప్రదించాలన్నారు.

గుంటూరు–అమరావతి రోడ్డు పనుల కోసం రూ.6.30 కోట్లు మంజూరు అయ్యాయి. కాగా త్వరలో పనులు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పల్నాడు జిల్లా అమరావతి – గుంటూరు రహదారి రోడ్డు పనులు పలుమార్లు మరమ్మతు పనులు చేశారు. అయినా భారీ వాహనాల రాకపోకలతో రోడ్డు ఎక్కువ శాతం దెబ్బతింది. దీంతో సర్కార్ ఎట్టకేలకు రోడ్డు పనుల కోసం నిధులు మంజూరు చేసింది.

బహిరంగ మద్యపానం వలన ప్రజల స్వేచ్ఛకు, శాంతిభద్రతలకు భంగం కలగకుండా చూసేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం తెలిపారు. మద్యం మత్తులో హత్యలు, గొడవలు వంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. మహిళలు, సామాన్య ప్రజలు స్వేచ్ఛగా తిరిగేలా భరోసా ఇస్తామని చెప్పారు. బహిరంగంగా మద్యం తాగితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

జిల్లాను పచ్చదనంతో నింపి హరిత గుంటూరును ఆవిష్కృతం చేయాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అన్నారు. వనం-మనం జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగింది. జిల్లాలో అన్ని శాఖలు సమష్టిగా, సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యా సంస్థలు, ఇతర కార్యాలయాలు, ఖాళీ స్థలాలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

YCP డిజిటల్ బుక్ అంశంపై GNT జిల్లా YCP నేతలతో జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ YV సుబ్బారెడ్డి నేడు సమావేశం కానున్నారు. తాడేపల్లి పరిధిలోని కుంచనపల్లి ఫార్చునర్ గ్రాండ్ హోటల్లో మధ్యాహ్నం ఈ సమావేశం జరుగుతుందని నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేమారెడ్డి తెలిపారు. జిల్లాలోని నియోజకవర్గ ఇన్ఛార్జ్లు, పార్లమెంటరీ కన్వీనర్లు, అబ్జర్వర్లు, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులందరూ ఈ సమావేశానికి హాజరై జయప్రదం చేయాలని కోరారు.

తెనాలి-పెదరావూరు మార్గంలో వైకుంఠపురం వద్ద సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. ఒక లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రులను స్థానికులు 108లో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఒక వ్యక్తి మరణించగా, మిగిలిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

రాజధాని అమరావతిలో రేపు ఒకేసారి 12 జాతీయ బ్యాంకుల కార్యాలయాలకు శంకుస్థాపన అంటూ వస్తున్న వార్తలు అవాస్తవం అని మంత్రి నారాయణ వ్యక్తి గత సిబ్బంది ఓ ప్రకటనలో తెలిపారు. ఇంతవరకు శంకుస్థాపనకు తేదీ నిర్ధారించలేదని బ్యాంకులు స్పష్టం చేశాయని, మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్త పూర్తిగా అవాస్తవం అని పేర్కొన్నారు. ప్రజలు గమనించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.