Guntur

News September 6, 2024

15 వరకు కొండవీడు నగరవనం మూసివేత

image

భారీ వర్షాలతో కొండవీడు ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడుతున్న కారణంగా ఈ నెల 15 వరకు పర్యాటకులు కొండవీడు కోటకు రావద్దని పల్నాడు కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. కలెక్టర్, జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు గురువారం కొండవీడు ఘాట్ రోడ్డు, నగర వనం సందర్శించారు. ఘాట్ రోడ్డులో ప్రయాణం ప్రమాద రహిత స్థాయికి చేరుకున్న తర్వాతే రాకపోకలను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.

News September 6, 2024

వరద బాధితులను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత: కలెక్టర్

image

వరద బాధితులను ఆదుకునేందుకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, స్వయం సహాయక సంఘాలు, మెప్మా ఆధ్వర్యంలో రూ. 80 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఆర్థిక సహాయం చెక్కును
గురువారం కలెక్టర్ నాగలక్ష్మికి అందజేశారు. వరద బాధితుల కోసం ప్రభుత్వ శాఖలు, స్వయం సహాయక సంఘాలు ముందుకు రావడం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు. ఇదే తరహాలో అందరూ చొరవ చూపాలన్నారు.

News September 5, 2024

సీఎం రిలీఫ్ ఫండ్‌కు పెమ్మసాని ఫౌండేషన్ రూ. కోటి విరాళం

image

వరద ప్రభావిత ప్రాంతాల్లో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న బాధితుల సహాయార్థం పెమ్మసాని ఫౌండేషన్ రూ. కోటి విరాళం అందించారు. పెమ్మసాని ఫౌండేషన్ తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి రూ. కోటి చెక్కును కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అందజేశారు. విజయవాడ కలెక్టరేట్‌లో రివ్యూ కార్యక్రమాల్లో పాల్గొని, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సమక్షంలో ఆయన చెక్కు అందజేశారు.

News September 5, 2024

చంద్రబాబు బాపట్ల పర్యటన రద్దు

image

బాపట్ల జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన గురువారం కూడా రద్దయినట్లు అధికారులు ప్రకటించారు. గురువారం వేకువ జాము నుంచి బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో పర్యటనకు అవకాశం లేకుండా పోయిందన్నారు. వాతావరణం అనుకూలించని కారణంగా గురువారం కూడా ముఖ్యమంత్రి పర్యటన రద్దు అయినట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని వివరించారు.

News September 5, 2024

ఇసుక రవాణాపై పల్నాడు కలెక్టర్ సమీక్ష

image

నరసరావుపేటలోని కలెక్టర్ కార్యాలయంలో ఇసుక రవాణాపై కలెక్టర్ అరుణ్ బాబు బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లారీ యజమానులు జీపీఎస్ కలిగి ఉండాలన్నారు. ఇసుకను బుక్ చేసుకోవడానికి గనుల శాఖ అనుమతి తప్పనిసరి అని తెలిపారు. దూరాన్ని బట్టి చార్జీలు వసూలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్, తదితరులు పాల్గొన్నారు.

News September 4, 2024

రేపు గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో వర్షాలు

image

రేపు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు, రేపు బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు.

News September 4, 2024

రేపు వేమూరు నియోజకవర్గంలో సీఎం పర్యటన

image

వేమూరు నియోజకవర్గంలో గురువారం సీఎం చంద్రబాబు పర్యటించనున్నారని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలిపారు. బుధవారం వేమూరు మార్కెట్ యార్డ్ వద్ద ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్‌ను ఆయన పరిశీలించారు. బాపట్ల జిల్లాలోని ముంపు ప్రాంతాలలో ముఖ్యమంత్రి పర్యటించి బాధితులను పరామర్శించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి కుమార్ పాల్గొన్నారు.

News September 4, 2024

బురదలో చెప్పులు లేకుండా పర్యటించిన లోకేశ్

image

ఇటీవల కురిసిన ఆకస్మిక వర్షాల వల్ల బుడమేరుకు భారీ గండ్లు పడిన విషయం తెలుసుకున్న మంత్రి లోకేశ్ మరో మంత్రి నిమ్మలతో కలిసి పరిశీలించారు. వరదనీరు పోటెత్తగా విజయవాడతో పాటు, బుడమేరు పరీవాహక ప్రాంతాలు, గ్రామాలు, పొలాలు జలదిగ్బంధమయ్యాయి. భారీ గండ్ల వల్ల కొండపల్లి శాంతినగర్-కవులూరు మార్గంలో రాకపోకలు నిలిచాయి. కాగా లోకేశ్ వరద ముంపు ప్రాంతాల్లోని బురదలో చెప్పులు లేకుండా పర్యటించారు.

News September 4, 2024

పల్నాడు: కొండవీడు నగరవనం మూసివేత

image

జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు కొండవీడు ఘాట్ రోడ్డులో కొండచరియలు రోడ్డుపై విరిగిపడిన విషయం తెలిసిందే. మళ్లీ వర్షాలు పడి కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉన్న కారణంగా ఈనెల 6 వరకు కొండవీడు నగరవనం మూసివేస్తున్నట్ల జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు ఒక ప్రకటనలో తెలిపారు. పర్యాటకులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.

News September 4, 2024

ప్రకాశం బ్యారేజీకి క్రమంగా తగ్గుతున్న వరద

image

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. మంగళవారం రాత్రి 10గంటలకు బ్యారేజీ నుంచి 70గేట్ల ద్వారా 6.61 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 500 క్యూసెక్కుల నీటిని కాలువలకు మళ్లించారు. వరద ఉద్ధృతి గంట గంటకూ తగ్గుముఖం పట్టడంతో లంకగ్రామాల ప్రజల ఊపిరి పీల్చుకున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ, బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గాల్లో నీటమునిగిన లంక గ్రామాలు బయటపడుతున్నాయి.