Guntur

News July 13, 2024

పల్నాడు, బాపట్ల ఎస్పీలు బదిలీ

image

పల్నాడు, బాపట్ల జిల్లా ఎస్పీలు మలికా గర్గ్, వకుల్ జిందాల్‌ను బదిలీ చేస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. విజయనగరం ఎస్పీగా వకుల్ జిందాల్‌, విజయనగరం APSP బెటాలియన్‌ కమాండెంట్‌గా మలికాను నియమించారు. ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లు అప్పుడు పల్నాడు ఎస్పీగా మలికా గర్గ్ వచ్చారు. బాపట్ల కొత్త జిల్లాగా ఏర్పాటైనప్పటి నుంచి వకుల్ జిందాల్ అక్కడ ఎస్పీగా పని చేస్తున్నారు.

News July 13, 2024

కూటమి ప్రభుత్వంలో దేవాలయాలకు మహర్దశ: ఎంపీ లావు

image

మంగళగిరి మండలం కొలనుకొండలోని శ్రీ హరే కృష్ణ గోకుల క్షేత్రంలో వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా సీఎం చంద్రబాబు చేపట్టిన పూజా కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రితో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో దేవాలయాలకు మహర్దశ రానుందని చెప్పారు.

News July 13, 2024

నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు షెడ్యూల్ ఇదే..

image

సీఎం చంద్రబాబు శనివారం ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఉంటారు. ఈ సాయంత్రం 4:30 గంటలకు ముంబై వెళ్లనున్నారు. ముకేశ్ అంబానీ కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో అక్కడికి బయలుదేరుతారు. రాత్రికి ముంబైలోనే బస చేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఉండవల్లి నివాసానికి తిరిగి చంద్రబాబు చేరుకోనున్నారు.

News July 13, 2024

గుంటూరు మిర్చి యార్డుకు 21,027 టిక్కీలు

image

గుంటూరు మిర్చి యార్డుకు శుక్రవారం 21,027 టిక్కీల మిర్చి రాగా పాత నిల్వలతో కలిపి 25,626 టిక్కీలు విక్రయించారు. ఇంకా 12,347 టిక్కీలు నిల్వ ఉన్నాయి. నాన్ ఎసి కామన్ వెరైటీలు సగటున కనిష్ట ధర రూ.8వేలు పలకగా గరిష్టంగా రూ.16 వేలు పలికింది. నాన్ ఏసీ స్పెషల్ వెరైటీలు కనిష్టంగా రూ.8 వేలు, గరిష్టంగా రూ.18,600 లభించాయి. ఏసీ కామన్ వెరైటీలు సగటు కనిష్ట ధర రూ.8500, గరిష్ట ధర రూ.16,500 పలికింది.

News July 13, 2024

గుంటూరు: ప్రభుత్వ బంగ్లాలో YCP ప్రచార సామగ్రి.. TDP నేతల ఆగ్రహం

image

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ట్రావెలర్స్ బంగ్లా మాజీ సీఎం జగన్ ప్రచార పుస్తకాలకు నిలయంగా మారిందని గుంటూరు టీడీపీ నేతలు ఆరోపించారు. ఎన్నికలకు ముందు వైసీపీ నాయకులు ప్రచారం కోసం ‘ఆంధ్రప్రదేశ్ ‌కు జగనే ఎందుకు కావాలి? ‘అనే పుస్తకాలను పెద్దఎత్తున ముద్రించి, నిల్వ చేశారన్నారు. వైసీపీ ఓడిపోయినా ఆ బంగ్లాలోని 2 గదుల్లో పుస్తకాలు భద్రంగా ఉంచారని, వాటిని తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు.

News July 13, 2024

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం పొడిగింపు

image

రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం పథకాన్ని 2024-25 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ GOMS నెం. 82 ను జారీ చేసినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీం (WJHS) పొడిగింపునకు సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రతిపాదనలు పంపించగా ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వివరించారు.

News July 13, 2024

యువతకు శిక్షణా, ఉపాధి కల్పించాలి: బాపట్ల కలెక్టర్

image

జిల్లాలోని స్కిల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులందరూ డీఆర్డీఏ, మెప్మా అధికారులను సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని కలెక్టర్ నాగలక్ష్మీ పేర్కొన్నారు. 2024-25 సంవత్సరానికి నిరుద్యోగ యువతకు శిక్షణా, ఉపాధి కల్పించడంపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఇందుకు అవసరమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. శుక్రవారం కలక్టరేట్‌లో స్కిల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

News July 12, 2024

గుంటూరు: TODAY HEADLINES

image

* గుంటూరు: జగన్‌, సునీల్ కుమార్‌లపై కేసు.!
*చేబ్రోలులో ‘డార్లింగ్‌’ సినిమా యూనిట్‌ సందడి
*పిడుగురాళ్లలో కలవరపెడుతున్న డయేరియా.!
*గుంటూరులో తప్పిపోయిన బాలుడు సేఫ్
*బాపట్లలో కండక్టర్‌పై మహిళ దాడి
*నరసరావుపేట ఎంపీ లావుకు కీలక బాధ్యతలు
*సత్తెనపల్లి: సినీ ఫక్కీలో సెల్ ఫోన్ దొంగతనం
*తాడేపల్లి: ‘మాట నిలబెట్టుకున్న చంద్రబాబు’
*మరోసారి పిడుగురాళ్లకు మంత్రి నారాయణ

News July 12, 2024

పల్నాడు ప్రథమ కలెక్టర్ జిల్లాకు రాక

image

పల్నాడు జిల్లా ప్రథమ కలెక్టర్‌గా పని చేసిన లోతేటి శివశంకర్ ఈనెల 13న నరసరావుపేట రానున్నారు. పల్నాడు జిల్లా ఏర్పడ్డాక ఆయనను ప్రభుత్వం ప్రథమ కలెక్టర్‌గా నియమించింది. ఈ సందర్భంగా ఆయన జిల్లాకు చేసిన సేవలకు గుర్తింపుగా “లోతేటి శివశంకర్ ఐఏఎస్”అనే పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎంపీ లావు, ఎమ్మెల్యే చదలవాడ, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొననున్నట్లు తెలిపారు.

News July 12, 2024

ANU: డిగ్రీ 7వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలలో బీఎస్సీ కెమిస్ట్రీ కోర్స్ చదువుతున్న విద్యార్థులు, రాయాల్సిన 7వ సెమిస్టర్ (Y20 బ్యాచ్) థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఆగస్టు 1, 2, 3, 5, 6 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవచ్చు.