Guntur

News October 15, 2024

గుంటూరు: మహిళలకు ఎన్ని మద్యం షాపులు వచ్చాయంటే?

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో పోలీసుల బందోబస్తు మధ్య మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ ముగిసింది. 373 షాపులకు 9,191 దరఖాస్తులు వచ్చాయి. కాగా గుంటూరు జిల్లాలో 4 గంటల్లోనే లాటరీ ప్రక్రియ ముగియడం విశేషం. గుంటూరు జిల్లాలో 127 షాపులకు 11 మహిళలకు దక్కాయి. అటు బాపట్ల జిల్లాలో 117 దుకాణాలకు గాను 7, పల్నాడు జిల్లాలో 129 షాపులకు 7 చోట్ల మహిళలకు దక్కాయి. అత్యధికంగా మంగళగిరిలో 28 షాపులకు 6 మహిళలకే దక్కడం విశేషం.

News October 15, 2024

గుంటూరు: ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో టీవీ అండ్ ఫిల్మ్ స్టడీస్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కోర్స్ కో-ఆర్డినేటర్ మధుబాబు సోమవారం తెలిపారు. రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ విధానంలో ఈ కోర్సును నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కోర్సులో ప్రవేశాలు పొందేందుకు ఏదైనా డిగ్రీ కోర్స్ ఉత్తీర్ణత కలిగి ఉండాలని సూచించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.

News October 14, 2024

అమరావతి డ్రోన్ సదస్సు నిర్వహణకు ఉత్తర్వులు

image

అక్టోబరు 22, 23వ తేదీల్లో జరగనున్న అమరావతి డ్రోన్ సదస్సు-2024 నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను ఈ జాతీయ సెమినార్ నిర్వహణ భాగస్వామిగా నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ సదస్సు నిర్వహణకు రూ.5.54 కోట్ల వ్యయం అవుతుందని పేర్కొంది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో 2 రోజుల పాటు ఈ జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు.

News October 14, 2024

నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్ కొట్టివేత

image

జైల్లో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్‌ను గుంటూరు జిల్లా కోర్టు కొట్టి వేసింది. వెలగపూడిలో మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సురేశ్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ కొరకు జిల్లా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయగా పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.

News October 14, 2024

అమరావతి: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే

image

ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం షెడ్యూల్‌ను సీఎం కార్యాలయ అధికారులు విడుదల చేశారు. చంద్రబాబు 12 గంటలకు సచివాలయానికి వస్తారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో తీసుకువస్తున్న పలు నూతన పాలసీలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఇండస్ట్రియల్, ఎంఎస్ఎంఈ, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, డ్రోన్ డ్రాఫ్ట్ పాలసీలపై విడి విడిగా సీఎం అధికారులతో చర్చిస్తారని కార్యాలయం తెలిపింది.

News October 14, 2024

కర్లపాలెంలో చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి

image

చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. కర్లపాలెం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలిక శనివారం సాయంత్రం ఇంటి సమీపంలో కుళాయి వద్ద నీరు పడుతోంది. ఈ క్రమంలో 50ఏళ్ల వయసున్న భాగ్యారావు బాలికకు మాయ మాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News October 14, 2024

కామన్వెల్త్ పోటీల్లో మంగళగిరి యువతికి 4 పతకాలు

image

ఈనెల 4 నుంచి 13వ తేదీ వరకు సన్ సిటీ, సౌత్ ఆఫ్రికా దేశంలో జరిగిన కామన్ వెల్త్ పవర్ లిఫ్టింగ్ సబ్ జూనియర్, జూనియర్ పోటీల్లో మంగళగిరికి చెందిన షేక్ సాదియా అల్మాస్ జూనియర్ 57 కిలోలు విభాగంలో బంగారు పతకం సాధించారు. స్క్వాట్ -185 కిలోల బంగారు పతకం, బెంచ్ ప్రెస్ 95 కిలోల బంగారు పతకం, డెడ్‌లిఫ్ట్ 180 కిలోలు బంగారు పతకం, ఓవర్ల్ 460 కిలోలు బంగారు పతకం, ఓవరాల్ గా నాలుగు బంగారు పతకాలు సాధించారు.

News October 14, 2024

యువగళం పాదయాత్రలోని మరో హామీని నెరవేర్చా: లోకేశ్

image

యువగళం పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నెరవేర్చినట్లు మంత్రి లోకేశ్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని బోయ, వాల్మీకి సోదరులు పాదయాత్రలో తనను కలిసి విన్నవించారన్నారు. వారి సెంటిమెంట్‌ను గౌరవిస్తూ వాల్మీకి జయంతిని ఈనెల 17వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు లోకేశ్ తెలియజేశారు.

News October 13, 2024

చిలకలూరిపేటలో జాబ్‌మేళా..1000 పైగా ఉద్యోగాలు

image

చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడులోని యువత కోసం ఈనెల 19వ తేదీన మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పుల్లారావు తెలిపారు. చిలకలూరిపేటలోని ప్రత్తిపాటి గార్డెన్స్‌లో ఉదయం 9 గంటల నుంచి మేళా ప్రారంభమవుతుందన్నారు. 30కి పైగా కంపెనీలు, 1000కి పైగా జాబ్‌ ఆఫర్లతో ఈ జాబ్‌ మేళా జరుగుతుందన్నారు. 2016-2024 మధ్య 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, బీటెక్, ఎంటెక్‌ చేసిన వారంతా అర్హులేనని అన్నారు. Shareit

News October 13, 2024

గుంటూరు: డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ

image

డీఎస్సీ ఉచిత శిక్షణకు అర్హులైన SC,ST అభ్యర్థుల నుంచి ఏపీ సాంఘిక సంక్షేమశాఖ అమరావతి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష కోసం ఉచిత బోధన, భోజన, వసతి సౌకర్యాలతో పాటు 3 నెలల ఉచిత శిక్షణ పొందుటకు అవకాశం కల్పించారు. http://jnanabhumi.ap.gov.in ఆన్లైన్ వెబ్‌సైట్‌లో అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చని, అభ్యర్థుల వార్షిక ఆదాయం రూ.2.50లక్షల లోపు ఉండాలన్నారు.