India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గుంటూరులో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వేశాఖ సోమవారం గుంటూరు జంక్షన్ మీదగా ప్రత్యేక రైలును నడపనున్నట్లు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. రైలు(నం.07020) విజయవాడలో సోమవారం 18:40 గంటలకు బయలుదేరి గుంటూరు 20:20కు రానుంది. పిడుగురాళ్ల 21:32, నడికుడి 22:08, సికింద్రాబాద్ 04:00, నాంథేడ్ మంగళవారం 12:00 గంటలకు చేరుతోందని చెప్పారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో ప్రముఖ సినీ నటుడు పార్థీబన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మంగళగిరి పరిధి జాతీయ రహదారి వద్ద ఉన్న పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. పవన్కు పార్ధీబన్ ప్రత్యేక చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం పలు విషయాలపై చర్చించుకున్నారు.

దీపావళి సందర్భంగా బాణాసంచా విక్రయించే షాపులు, గోడౌన్ల వద్ద భద్రతా ప్రమాణాలు పాటించాలని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశించారు. తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పోలీస్ అధికారులు తమ పరిధిలో బాణాసంచా దుకాణాలను తనిఖీలు చేయాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

గుంటూరు జిల్లాలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పోలీస్ సిబ్బందికి ఆదివారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గుంటూరు, ప్రత్తిపాడు, తెనాలి, తాడికొండ తదితర ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లో నిర్వహించిన పోటీల్లో సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజేతలకు త్వరలో ఆ శాఖ ఉన్నతాధికారుల చేతుల మీదగా బహుమతులు అందజేయనున్నారు.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(హియరింగ్ ఇంపెయిర్మెంట్) కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. ఈ పరీక్షలు నవంబర్ 5, 6, 7, 8,11 తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల మధ్య జరుగుతాయని ANU తెలిపింది. సబ్జెక్టు వారీగా టైం టేబుల్ వివరాలకై https://www.nagarjunauniversity.ac.in/ వెబ్సైట్ చూడాలని సూచించింది.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్(హియరింగ్ ఇంపెయిర్మెంట్) కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. ఈ పరీక్షలు నవంబర్ 5, 6, 7, 8,11 తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల మధ్య జరుగుతాయని ANU తెలిపింది. సబ్జెక్టు వారీగా టైం టేబుల్ వివరాలకై https://www.nagarjunauniversity.ac.in/ వెబ్సైట్ చూడాలని సూచించింది.

రుణాలు అందించడంలో జాతీయ స్థాయిలో రాష్ట్రంలోని కార్పోరేషన్లలో గుంటూరు మొదటి స్థానంలో నిలిచింది. ఈనెల 29న విజయవాడలో కమిషనర్ పులి శ్రీనివాసులు అవార్డును అందుకుంటారు. చిరు వ్యాపారులకు పీఎం స్వానిధి రుణాల అందించడంలో జాతీయస్థాయిలో నగరపాలక సంస్థ అవార్డుకు ఎంపికైంది. బ్యాంకుల ద్వారా 21,594 మంది చిరు వ్యాపారులకు రుణాలు అందించడం ద్వారా జీఎంసీ తొలి స్థానంలో నిలిచిందని కమిషనర్ వెల్లడించారు.

దాచేపల్లిలో అతిసార తగ్గుముఖం పట్టిందని, ప్రస్తుత పరిస్థితులు పూర్తి అదుపులో ఉన్నాయని జిల్లా వైద్యశాఖ అధికారి రవి పేర్కొన్నారు. నరసరావుపేటలో ఆయన మాట్లాడుతూ.. డయేరియాతో ఆసుపత్రులకు చేరిన 17 మందిలో 16 మంది ఇప్పటికే కోలుకున్నారన్నారు. మిగిలిన ఒక్కరి పరిస్థితి కూడా నిలకడగా ఉందని వెల్లడించారు. ప్రభుత్వ అదేశాల మేరకు అంజనపురంలో యుద్ధ ప్రాతిపదికన మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై వైసీపీ నేతలు వరుసగా స్పందిస్తున్నారు. తాజాగా షర్మిలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు పరోక్షంగా స్పందించారు. ‘నాడు జగనన్న వదిలిన బాణం! నేడు చంద్రన్న వదిలిన బాణం! విధి విచిత్రమైనది!’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గుంటూరుకు చెందిన యువ క్రికెటర్ రషీద్ తన ప్రతిభ ప్రపంచానికి చాటి చెబుతున్నాడు. IPLలో మిస్టర్ కూల్ ధోనీతో మైదానాన్ని పంచుకున్న అనుభవం ఉన్న రషీద్ అంచెలంచెలుగా ఎదిగాడు. ఈ నేపథ్యంలో 21ఏళ్ల వయస్సులోనే ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్గా రషీద్ నియమితుడయ్యాడు. ఇదిలా ఉంటే ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా నేటి నుంచి ఆంధ్ర v/s హిమాచల్ ప్రదేశ్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
Sorry, no posts matched your criteria.