Guntur

News November 14, 2024

సీసీ రోడ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్

image

గుంటూరు కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ ఎస్. నాగలక్ష్మీ ఐఏఎస్. గురువారం పెదకాకానిలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు రోడ్డు నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలించి, పనులు వేగవంతంగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంపై ఆమె దృష్టి సారించారు.

News November 14, 2024

పెదకాకాని: దారుణం.. బాలికపై చిన్నాన్న అఘాయిత్యం.!

image

పెదకాకాని మండలంలోని ఓ గ్రామంలో తండ్రి లేని ఓ మైనర్ బాలిక ఇంటి దగ్గరే ఉంటోంది. అదే గ్రామంలో నివసిస్తున్న చిన్నాన్న మొగులూరి శామ్యూల్ ఆ బాలికకు మాయ మాటలు చెప్పి లోబరుచుకొని 8 నెలలుగా లైంగిక దాడి చేస్తున్నాడు. ప్రస్తుతం బాలికకు నెలసరి రాకపోవడంతో తల్లి డాక్టర్‌కు చూపించగా 3వ నెల గర్భిణిగా నిర్ధారించారు. దీనిపై బాలిక తల్లి ఫిర్యాదు చేయగా.. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు.

News November 14, 2024

నరసరావుపేట: పోసానిపై మరో ఫిర్యాదు

image

సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌లపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై నరసరావుపేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో బుధవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు పోసానిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా TDP ప్రధాన కార్యదర్శి కొట్టా కిరణ్, జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ ఆలీభాష డిమాండ్ చేశారు. కాగా బాపట్లో పోసానిపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

News November 13, 2024

పెదకాకానిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

image

పెదకాకాని మండలంలో గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి బుధవారం పర్యటించారు. మండల కేంద్రంలోని గౌడపాలెం అంగన్వాడీని సందర్శించి ఇంకుడు గుంట ఏర్పాట్లను పరిశీలించారు. కేంద్రంలోని వసతులు, విద్య, టాయిలెట్లు, ఆహార పదార్థాలు, వాటి నాణ్యత గురించి అంగన్వాడీ టీచర్, ఆయాలను అడిగి తెలుసుకున్నారు. పెదకాకాని మండలంలోని పుష్పరాజ్ కాలనీ సీసీ రోడ్డు ఏర్పాట్లను పరిశీలించారు. 

News November 13, 2024

రామ్ గోపాల్ వర్మపై కేసు.. వివరాలు ఇవే.!

image

సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై తుళ్ళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి నారా లోకేశ్‌లపై అసభ్యంగా పోస్టులు పెట్టారని పెదపరిమి గ్రామానికి చెందిన నూతలపాటి రామారావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా U/S 336(4), 353(2), 356(2), 61(2), 196, 352 BNS, Sec. 67 ఆఫ్ IT యాక్ట్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

News November 13, 2024

ఆయనపై చర్యలు తీసుకోవద్దు: హైకోర్డు

image

వేమూరు మాజీ MLA మేరుగు నాగార్జున క్వాష్ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో మేరుగుపై పద్మావతి అనే మహిళ అత్యాచారం కేసు పెట్టగా.. ఇటీవల కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్టేట్‌మెంట్ ఇచ్చారు. కేసును ఏం చేస్తారని హైకోర్టు పోలీసులను అడిగింది. రిటర్న్ రిపోర్టు ఇవ్వాలంటూ పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా వేసింది.

News November 13, 2024

యువతిని గర్భిణిని చేసిన మామ

image

తండ్రిలేని యువతిని మేనమామ గర్భిణీని చేసిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. భట్టిప్రోలుకి చెందిన 18ఏళ్ల యువతికి చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. ఈ నేపథ్యంలో ఆ యువతి ఆదిలాబాద్‌లో ఉంటున్న పెద్ద మేనమామ వద్ద ఉంటోంది. ఒంగోలులో ఉంటున్న చిన్న మేనమామ ఇటీవల ఆదిలాబాద్ వెళ్లాడు. ఈ క్రమంలో అతను కోడలిని లొంగదీసుకొని గర్భిణీని చేశాడు. యువతికి తీవ్ర కడుపు నొప్పి రాగా.. వైద్యులు గర్భిణిగా నిర్దారించారు. 

News November 13, 2024

ఆ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవద్దు: హైకోర్డు

image

వేమూరు మాజీ MLA మేరుగు నాగార్జున క్వాష్ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో మేరుగుపై పద్మావతి అనే మహిళ అత్యాచారం కేసు పెట్టగా.. ఇటీవల కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్టేట్‌మెంట్ ఇచ్చారు. అయితే కేసును ఏం చేస్తారని హైకోర్టు పోలీసులను అడిగింది. రిటర్న్ రిపోర్టు ఇవ్వాలంటూ పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశించింది. అప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోద్దని, తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది.

News November 12, 2024

బడ్జెట్‌లో ఉమ్మడి గుంటూరుకు అగ్రతాంబూలం

image

ఉమ్మడి గుంటూరు జిల్లాకు ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులు కేటాయించింది. వాటిలో కొన్ని ముఖ్యమైనవి..
➤ NG రంగా వర్సిటీకి రూ.507 కోట్లు
➤ AP CRDA సహాయనిధి కింద రూ.1053.70 కోట్లు
➤ ఉమ్మడి GNTలో యంత్ర పరికరాలకు రూ.11 కోట్లు
➤ అమరావతిలో మెట్రోరైలుకి రూ.50 కోట్లు
➤ కృష్ణా డెల్టాకు రూ.138 కోట్లు
➤ పులిచింతల నిర్వహణకు రూ.29.45 కోట్లు
➤ గుండ్లకమ్మకు రూ.13 కోట్లు
➤ GNT శంకర్ విలాస్ ROB విస్తరణకు రూ.115 కోట్లు

News November 11, 2024

గుంటూరు జిల్లాలో 14 నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్: కలెక్టర్

image

రాష్ట్ర బాలల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా ఈనెల 14వ తేదీ నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రారంభం కానుంది. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను సోమవారం కలెక్టర్ నాగలక్ష్మి , జేసీ భార్గవ్ తేజ‌ ఆవిష్కరించారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వారి ఎదుగుదల లోపాలను గుర్తించేందుకు స్క్రీనింగ్ టెస్ట్ కార్యక్రమం ప్రారంభిస్తున్నామని కలెక్టర్ తెలిపారు‌.