India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తాడేపల్లి మండలం కుంచనపల్లిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఉన్న ఒంగోలు జాతి ఆవుకు ఆదివారం ఒకే కాన్పులో రెండు దూడలు జన్మించాయి. పశుసంవర్ధక శాఖ అధికారులు ఈ విషయాన్ని పరిశీలించి, ఇటువంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని తెలిపారు. ప్రస్తుతం రెండు దూడలు ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. ఈ అరుదైన దూడలను చూసేందుకు గ్రామస్థులు రైతు నివాసానికి చేరుకున్నారు.

‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ అంశంపై సెలూన్స్, స్పా, ఇతర వాణిజ్య కేంద్రాల్లో సోమవారం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జేసీ అశుతోష్ శ్రీవాస్తవ సంబంధిత అధికారులను ఆదేశించారు. ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’పై జేసీ ఆదివారం అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అలాగే, 7,8 తేదీల్లో విద్యా సంస్థల్లో వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలను నిర్వహించాలని విద్యాశాఖ అధికారులకు ఆయన సూచించారు.

స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల ప్రదానోత్సవం జిల్లాస్థాయి కార్యక్రమం ఈ నెల 6వ తేదీన జరుగుతుందని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదివారం తెలిపారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని చెప్పారు. జిల్లాకు 5 రాష్ట్ర స్థాయి, 48 జిల్లా స్థాయి అవార్డులు వచ్చాయన్నారు. స్వర్ణఆంధ్ర-స్వచ్ఛఆంధ్ర (SASA) పోర్టల్ (https://sasa.ap.gov.in/)లో వివరాలు ఉన్నాయన్నారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు ‘మీకోసం’ వెబ్సైట్లోనూ ప్రజలు తమ అర్జీలను సమర్పించుకోవచ్చని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. అర్జీల వివరాలను Meekosam.ap.gov.inలో నమోదు చేసుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు. అలాగే, జిల్లా, మండల కేంద్రాల్లో సోమవారం యథావిధిగా PGRSలో ప్రజల సమస్యలను స్వీకరించడం జరుగుతుందని చెప్పారు. అర్జీల నమోదు, స్థితి, సంబంధిత సమాచారం కోసం 1100కు డయల్ చేసి తెలుసుకోవచ్చన్నారు.

ప్రజాసేవ, అనుభవం ఉన్న అభ్యర్థుల కోసం శాశ్వత లోక్ అదాలత్ (పీఎల్ఏ) సభ్యుడి నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. రవాణా, విద్యుత్, బ్యాంకింగ్ వంటి కీలక రంగాలలో అనుభవం, 65 ఏళ్ల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు అర్హులు. ఆసక్తిగల భారతీయ పౌరులు న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో దరఖాస్తులను పొందవచ్చు. దరఖాస్తులను అక్టోబరు 31వ తేదీలోపు సమర్పించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.ఎ.ఎల్ సత్యవతి తెలిపారు.

ప్రముఖ రచయిత పరుచూరి నారాయణచార్యులు (లల్లాదేవి) 85 ఏళ్ల వయస్సులో తుదిశ్వాస విడిచారు. ‘శ్వేతనాగు’ వంటి చిత్రాలకు రచయితగా మంచి గుర్తింపు పొందారు. ఈయన రచించిన పలు నవలలు కూడా సినిమాలుగా వచ్చాయి. ముఖ్యంగా, టీటీడీ ధర్మప్రచార పరిషత్లో పురాణ పండిట్గా పనిచేస్తూ రచించిన ‘లల్లరామాయణం’ ఆయనకు పేరు తెచ్చిపెట్టింది. స్వగ్రామమైన ప్రత్తిపాడు మండలం నిమ్మగడ్డ వారి పాలెంలో శుక్రవారం ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి.

ఖరీఫ్ సీజన్ 2025-26లో 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు జేసీ అశుతోష్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని డీఆర్సీ హాలులో జరిగిన జిల్లా ధాన్య సేకరణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఖరీఫ్లో జిల్లాలో 3,89,849 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా ఉందన్నారు. ఇప్పటికే, డిసెంబర్ 2025 నుంచి 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని వివరించారు.

గుంటూరు GMC పరిధిలో గాలి నాణ్యత ప్రమాణాలు మెరుగుపరచడానికి కాలుష్య నివారణ చర్యలను వేగవంతం చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ VC హాలులో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం ద్వారా GMC పరిధిలో చేపడుతున్న పనుల పురోగతిపై జిల్లాస్థాయి అమలు కమిటీ సమావేశం జరిగింది. కాలుష్య నివారణ, రహదారుల అభివృద్ధి, మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

SP వకుల్ జిందాల్ పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ‘పోలీస్ స్టాఫ్ గ్రీవెన్స్ డే’లో పాల్గొన్నారు. ఐదుగురు పోలీస్ సిబ్బంది తమ బదిలీ, సర్వీస్ సంబంధిత సమస్యలపై వినతి పత్రాలను SPకి సమర్పించారు. SP వాటిని సానుకూలంగా స్వీకరించి, సంబంధిత అధికారులు సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి, వారి వినతుల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని SP పేర్కొన్నారు.

ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆయన స్టేషన్ రికార్డులు, పరిసరాల పరిశుభ్రత, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ముఖ్యంగా పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలని సిబ్బందిని సూచించారు. పోలీస్ సిబ్బంది ప్రజలతో మరింత పారదర్శకంగా, క్రమశిక్షణతో వ్యవహరించాలని, ఫిర్యాదులను సమయానికి పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.
Sorry, no posts matched your criteria.