Guntur

News July 2, 2024

DSC అభ్యర్థులకు.. గుంటూరులో ఫ్రీ కోచింగ్

image

ప్రభుత్వం నిర్వహించనున్న డీఎస్సీ- 2024 పరీక్షలకు హాజరయ్యే ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్) అభ్యర్థులు 200 మందికి ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ గుంటూరు సంచాలకుడు మధుసూదనరావు సోమవారం తెలిపారు. టెట్ పరీక్షలో అర్హత సాధించిన జిల్లాలోని SC,ST,BC అభ్యర్థులు ఈనెల 7వ తేదీ లోపు గుంటూరులోని బీసీ స్టడీ సర్కిల్లో దరఖాస్తులు అందజేయాలన్నారు.

News July 2, 2024

గుంటూరు: తాత్కాలికంగా కొన్ని రైళ్లు రద్దు

image

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని రైళ్లను, గుంటూరు-విజయవాడ మార్గంలో తాత్కాలికంగా రద్దు చేసినట్లు సీనియర్ డీసీ ప్రదీప్ కుమార్ సోమవారం వెల్లడించారు. రైలు నంబర్ 17329 (హుబ్లి-విజయవాడ) ఈ నెల 15 నుంచి 31వరకు, 17330 (విజయవాడ-హుబ్లి) ఈ నెల 16 నుంచి ఆగస్టు 1వరకు, 17282 (నరసాపూర్-గుంటూరు), 17281 (గుంటూరు- నరసాపూర్) ఈ నెల 1 నుంచి 31 వరకు రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

News July 2, 2024

అతిసార వ్యాధి పోస్టర్ల ఆవిష్కరణ: కలెక్టర్ నాగలక్ష్మీ

image

గుంటూరు జిల్లాలో అతిసార వ్యాధిని అదుపు చేసేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ నాగలక్ష్మీ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వైద్యశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ అతిసార వ్యాధిని అరికట్టేందుకు రూపొందించిన ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ రాజకుమారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు లక్ష్మీ కుమారి, తదితరులు పాల్గొన్నారు.

News July 1, 2024

సత్వరమే సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్ నాగలక్ష్మీ

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు అందించిన ఫిర్యాదులను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల ప్రజలు వచ్చి ఇచ్చిన 142 అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. ఫిర్యాదులు స్వీకరించడానికి ముందు పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు.

News July 1, 2024

జవాన్ల మృతిపట్ల మంత్రి లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి

image

ఏపీకి చెందిన ముగ్గురు జవాన్ల మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లద్దాక్ ప్రమాదంలో నాగరాజు, సుభానా ఖాన్, ఎం ఆర్కే రెడ్డి మృతిచెందటం బాధాకరమన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు.

News July 1, 2024

రోడ్డు ప్రమాదంలో కంతేరు సర్పంచ్ మృతి

image

మంగళగిరి- తెనాలి ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాడికొండ మండలం కంతేరుకు చెందిన సర్పంచ్ బెజ్జం మహేశ్‌కు చెందిన కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో సర్పంచ్ మహేశ్ మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News July 1, 2024

మద్యం నిల్వ కేసు.. వైసీపీ MLA అభ్యర్థిని తండ్రి అరెస్ట్

image

మద్యం నిల్వ చేసిన కేసులో మంగళగిరి YCP అభ్యర్థినిగా పోటీ చేసిన మురుగుడు లావణ్య తండ్రి, వైసీపీ నాయకుడు కాండ్రు శివనాగేంద్రంను అరెస్టు చేసినట్లు సెబ్ సీఐ ప్రసన్న ఆదివారం తెలిపారు. మంగళగిరిలోని కాండ్రు వారి వీధిలో దామర్ల వీరాంజనేయులు నివాసంలో జూన్ 1న 6,528 మద్యం సీసాలను నిల్వ చేశారు. దీంతో పోలీసులు శివనాగేంద్రంను శనివారం అరెస్టు చేసి మంగళగిరి కోర్టులో హాజరుపరచగా 15 రోజుల రిమాండ్ విధించింది.

News July 1, 2024

గుంటూరు-ఔరంగాబాద్ రైలు ప్రారంభం

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు- ఔరంగాబాద్-గుంటూరు మధ్య నూతనంగా ప్రారంభించిన రైలు ఆదివారం అధికారులు ప్రారంభించారు. ఈ రైలు (17253) ప్రతిరోజు గుంటూరులో 07.10 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఔరంగాబాద్ 13. 20 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(17254) ఔరంగాబాద్ లో 16.15 గంటలకు ప్రారంభమై గుంటూరు మరుసటిరోజు 21.30 గంటలకు చేరుతుంది.

News July 1, 2024

MP లావు కృష్ణ దేవరాయలు నేటి పర్యటన వివరాలు

image

నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీ కృష్ణ దేవరాయలు పర్యటన వివరాలను ఆయన కార్యాలయ సిబ్బంది తెలియజేశారు. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున నరసరావుపేట ఎంపీ, టీడీపీ పార్లమెంటరీ పార్టీనేత లావు శ్రీ కృష్ణదేవరాయలు ఢిల్లీ వెళ్తున్నారన్నారు. సోమవారం నుంచి గురువారం వరకు MP లావు అందుబాటులో ఉండరని పార్లమెంటు పరిధిలోని ప్రజలందరూ గమనించవలసిందిగా తెలిపారు.

News July 1, 2024

పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధం: పల్నాడు కలెక్టర్

image

పింఛన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసినట్లు పల్నాడు కలెక్టర్ శ్రీకేశ్ బి లత్కర్ తెలిపారు. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు నేటి ఉదయం 6 గంటల నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభిస్తారన్నారు. అవసరమైన సచివాలయ ఉద్యోగులు అందుబాటులో లేనిచోట, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. నేడే దాదాపు పింఛన్లు పూర్తి చేయాలని పేర్కొన్నారు.