India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం తాడేపల్లి పరిధి పెనుమాకలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆదివారం అధికారులు CM పర్యటన షెడ్యూల్ను విడుదల చేశారు. ఉదయం 5.45కు ఉండవల్లి నివాసం నుంచి పెనుమాక చేరుకుని, ఎస్టీ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేస్తారు. అనంతరం పెనుమాక మసీదు సెంటర్లో ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు, ప్రజలతో ముచ్చటిస్తారు. అనంతరం ఉండవల్లి చేరుకుంటారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.7వేల చొప్పున రాష్ట్రంలోని 65 లక్షల మందికి సోమవారం నుంచి పింఛన్లు అందజేయడం పై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఖజానాలో నిధులు లేకపోయినా, ఇచ్చిన మాటకు కట్టుబడి పెన్షన్ అందజేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలియజేశారు.
సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం స్వయంగా పెన్షన్లు పంపిణీ చేయనున్న విషయం తెలిసిందే. కాగా తాడేపల్లి మండలం పెనుమాకలో బాణావతి పాములు నాయక్ ఇంటికి వెళ్లి, అతనికి వృద్ధాప్య పెన్షన్ అతని కుమార్తె సాయికి వితంతు పెన్షన్ అందజేయనున్నారు. దేశ చరిత్రలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సీఎం పెన్షన్ పంపిణీ చేయడం ఇదే మొదటిసారని టీడీపీ నేతలు అన్నారు. సీఎం వస్తుండడంతో పెనుమాకలో అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు.
గుంటూరు-సికింద్రాబాద్ రైలును ఆదివారం నుంచి ఔరంగాబాద్ వరకు పొడిగించినట్లు, దక్షిణ మధ్య జోనల్ రైల్వే మెంబర్ జుబేర్ బాషా ఆదివారం పేర్కొన్నారు. ఇక నుంచి గుంటూరు- ఔరంగాబాద్కు రైలు నెం.17253 మధ్యాహ్నం 12.15 గంటలకు నంద్యాల రైల్వే స్టేషన్కు చేరుకుంటుందని తెలిపారు. ఔరంగాబాద్-గుంటూరు రైలు నెం. 17254 మధ్యాహ్నం 3.05 నిముషాలకు నంద్యాల రైల్వే స్టేషన్కు వస్తుందన్నారు.
మంగళగిరి పరిధి చినకాకాని హాయ్ ల్యాండ్ సమీపంలో గోడౌను పక్కన ఓ నివాసగృహం పైన గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు ఆదివారం గుర్తించారు. రూరల్ SI క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. మృతుని వయస్సు సుమారు 50 ఏళ్లు ఉంటుందని, టీ షర్టు ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతదేహం కుళ్ళిన స్థితిలో ఉన్నందున గుర్తుపట్టడానికి వీలులేదని మృతిని వివరాలు తెలిసిన వారు స్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు.
జులై 4వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు మూతపడనున్నాయి. నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎన్టీఏను రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ.. దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. వీటితో పాటు సెంట్రల్ యూనివర్సిటీలలో విద్యార్థి సంఘ నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, స్కూల్స్ మూసివేతను ఆపాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని బంద్ నిర్వహిస్తున్నామని తెలిపారు.
సాగర్ కాలువలోకి దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం చోటుచేసుకుంది. మాచర్ల సమీపంలోని నాగార్జున సాగర్ చెక్పోస్ట్ నుంచి తెలంగాణకు వెళ్లే దారిలో, కొత్త బ్రిడ్జిపై నుంచి మధ్యాహ్నం సమయంలో గుర్తు తెలియని వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వయసు సుమారు 60-65 ఏళ్ల మధ్య ఉంటుందని స్థానికులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
రైలు నుంచి జారిపడి యువకుడు మృతిచెందిన ఘటనపై శనివారం జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో కృష్ణా కెనాల్ రైల్వే స్టేషన్ వద్ద రైలు పట్టాలపై మృతదేహం ఉంది. జీఆర్పీ సిబ్బంది వెళ్లి పరిశీలించారు. రైలు నుంచి జారి పడటంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుని వివరాలు తెలిసిన వారు జీఆర్పీ పోలీసులను సంప్రదించాలని అన్నారు.
గుంటూరు జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీ కోసం రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా కన్వీనర్, ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ చిన్న వెంకటేశ్వరరావు తెలిపారు. జులై 24లోపు వెబ్ సైట్లో తమ పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. అలాగే అదే రోజు తెనాలి, గుంటూరులలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లోని నమోదు కేంద్రాల్లో సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు.
జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ బి లత్కర్ తెలిపారు. జులై 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన తెలిపారు. కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివానం మాట్లాడారు. ప్రతి ఒక్కరికి పెన్షన్ పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.