Guntur

News October 3, 2025

నల్లపాడు పీఎస్‌లో ఎస్పీ వకుల్ జిందాల్ ఆకస్మిక తనిఖీ

image

ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆయన స్టేషన్ రికార్డులు, పరిసరాల పరిశుభ్రత, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ముఖ్యంగా పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలని సిబ్బందిని సూచించారు. పోలీస్ సిబ్బంది ప్రజలతో మరింత పారదర్శకంగా, క్రమశిక్షణతో వ్యవహరించాలని, ఫిర్యాదులను సమయానికి పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.

News October 3, 2025

GNT: 13,193 మంది ఆటో డ్రైవర్ల ఖాతాలో రేపే నగదు జమ

image

‘ఆటో డ్రైవర్ల సేవలో’ నూతన పథకాన్ని సీఎం చంద్రబాబు రేపు విజయవాడలో ప్రారంభించనున్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 14,755 ఆటో డ్రైవర్లు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోగా.. వీటిని పరిశీలించిన అధికారులు 13,193 అప్లికేషన్లను మంజూరు చేశారు. వివిధ కారణాలవల్ల 1562 దరఖాస్తులను తిరస్కరించారు. అర్హులకు రూ.15 వేల చొప్పున జమ చేయనున్నారు. విద్యుత్ వినియోగం సగటున 300 యూనిట్ల కంటే ఎక్కువగా ఉన్నవారు అనర్హులుగా ఉన్నారు.

News October 3, 2025

సీఎం చేతుల మీదుగా ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకం ప్రారంభం

image

సీఎం చంద్రబాబు శనివారం ‘ఆటో డ్రైవర్ సేవలో’ అనే నూతన పథకాన్ని ప్రారంభించనున్నారు. మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉదయం 9:30 గంటలకు ఆయన స్వయంగా ఆటో ఎక్కి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ సహా పలువురు మంత్రులు హాజరవుతారని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News October 3, 2025

చినరావూరులో తీవ్ర విషాదం

image

నల్గొండ (D) దేవరపల్లి దిండి కాలువలో గురువారం ప్రమాదవశాత్తు ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల్లో తెనాలి చినరావూరుకు చెందిన కేతావత్ రాము నాయక్ (34) కూడా ఉండటంతో స్థానికంగా విషాదం నెలకొంది. దసరా పండుగకు బంధువులతో కలిసి అక్కడకు వెళ్లిన రాము కాలువలో పడిన మేనల్లుడు సాయి ఉమాకాంత్ ను రక్షించే క్రమంలో మృతి చెందాడు. సాయంత్రానికి రాము మృతదేహం తెనాలి రానుంది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News October 3, 2025

భవిష్యత్ అవసరాలు ముందే గుర్తించాలి: కలెక్టర్

image

వ్యవసాయం, వాటి అనుబంధ రంగాల్లో పెట్టుబడి తగ్గి రైతులకు లాభం పెరగాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ప్రాథమిక రంగాల శాఖలతో శుక్రవారం కలెక్టర్ తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ప్రాథమిక రంగాల శాఖలు నూతన ఆవిష్కరణలు దిశగా అడుగులు వేయాలన్నారు. ప్రాథమిక రంగాల్లో ప్రతి అంశాన్ని విశ్లేషణాత్మకంగా పరిశీలించాలని, ఏ అంశాన్ని సాధారణంగా తీసుకోరాదని, భవిష్యత్తులో అవసరాలను ముందుగా గుర్తించాలన్నారు.

News October 3, 2025

అమరావతిలో మంత్రి నారాయణ ఇంటికి శంకుస్థాపన

image

రాజధాని ప్రాంతమైన అమరావతిలో మంత్రి నారాయణ సొంత ఇంటికి శుక్రవారం శంకుస్థాపన జరిగింది. వెలగపూడి రెవెన్యూలోని 4600 గజాల స్థలంలో, సీఎం చంద్రబాబు ఇంటికి దక్షిణం వైపు కేవలం 100 మీటర్ల దూరంలో మంత్రి సొంతింటి నిర్మాణం చేపట్టనున్నారు. కాగా ఐదు రోజుల విదేశీ పర్యటన అనంతరం మంత్రి నారాయణ అమరావతికి చేరుకొని శంకుస్థాపన చేశారు.

News October 2, 2025

పారిశుద్ధ్య నిర్వహణలో గుంటూరు టాప్..!

image

మెరుగైన పారిశుద్ధ్య నిర్వహనలో గుంటూరు జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబరు నెలకు సంబంధించి IVRS ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించగా మన జిల్లా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాధాన్య సర్వేలో 73.4% కుటుంబాలు పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచినట్లు తేలింది. కాగా అటు 8వ స్థానంలో బాపట్ల, 11వ స్థానంలో పల్నాడు ఉన్నాయి

News October 2, 2025

GNT: గాంధీజీ రెండుసార్లు వచ్చిన ప్రదేశం..!

image

గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం కావూరు గ్రామంలో వినయాశ్రమం ఉంది. ఈ ఆశ్రమం మహాత్మాగాంధీజీ చేతులమీదుగా 1933 డిసెంబరు 23 తేదీన  ప్రారంభమైనది. స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ హరిజన యాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలో పర్యటిస్తూ కల్లూరి చంద్రమౌళి వినతి మేరకు వినయాశ్రమంలో 2రోజులు గడిపారు. ఆనాడు ఆయన నాటిన రావి మొక్క నేడు మహావృక్షమైనది. రెండవసారి 1937 జనవరి 23న తుఫాను బాధితుల కోసం వచ్చారు.

News October 2, 2025

గుంటూరు జిల్లాలో ఆయనకి ఆలయాలు..!

image

ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా గాంధీ విగ్రహం లేని ఊర్లు లేవంటే అతిశయోక్తి కాదు. అలాంటి గాంధీజీకి గుంటూరు జిల్లాలో 2 దేవాలయాలు ఉన్నాయి. తెనాలిలో మహాత్మా గాంధీ ఆశ్రమం నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మహాత్మా గాంధీకి దేవాలయం నిర్మించి నిత్యం పూజలు చేస్తుంటారు. కాగా రామలింగాచారి తన సొంత ఇంటిని అమ్మి వృద్ధాశ్రమం నిర్వహిస్తున్నారు. నరసరావుపేటలో మహాత్మా గాంధీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉంది.

News October 2, 2025

గుంటూరు జిల్లాకి సాయం కోసం గాంధీజీ రోడ్ షో

image

గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తుఫాను సహాయం కోసం జనవరి 23, 1937న విరాళాలు సేకరించాలని మహాత్మా గాంధీ రోడ్ షో నిర్వహించారు. వచ్చిన విరాళాలను బాధిత ప్రజల ఉపశమనం, పునరావాసం కోసం ఖర్చు చేశారు. ఆయన నిడబ్రోలు వద్ద రైలు దిగి దాదాపు 160 కి.మీ. రోడ్డు మార్గంలో ప్రయాణించారు. చిలకలూరిపేటలో ఆయనకు ఘన స్వాగతం లభించడమే కాక సహాయ నిధికి రూ.890 విరాళంగా ఇచ్చారు. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం.