India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అమరావతి రాజధాని ప్రాంతంలో నరేంద్ర మోదీ ఈనెలలో రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభించడానికి పర్యటించనున్నారు. నేపథ్యంలో వెలగపూడి లోని సచివాలయం వెనుక ఏర్పాటు చేయనున్న సభా ప్రాంగణాన్ని పీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఐఏఎస్ వీర పాండ్యన్ జిల్లా, ఎస్పీ సతీష్ పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
గుంటూరులోని స్వర్ణభారతినగర్లో కుక్కల దాడిలో చనిపోయిన 4ఏళ్ల ఐజాక్ విషాద ఘటనపై సోమవారం రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సీఎం చంద్రబాబు బాలుడి కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఘటనపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మంగళగిరిలో మట్టి పాత్రల తయారీ మళ్లీ ఊపందుకుంది. 300కి పైగా కుటుంబాలు ఈ సంప్రదాయ వృత్తిలో నిమగ్నమై ఉన్నాయి. వేసవిలో పెరిగిన డిమాండ్తో రోజుకు 15 కుండల వరకు తయారు చేస్తూ జీవనా ధారం చేసుకుంటున్నారు. ఎర్రమట్టి కొరత సమస్యగా మారినప్పటికీ కుటుంబాలంతా పట్టుదలతో వృత్తిని కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు ఇక్కడి మట్టి కుండలు ఎగుమతవుతుండటం విశేషం. ఒక్కొక్క కుండ ధర సుమారు రూ.100 వరకు పలుకుతుంది.
తాడేపల్లిలో ఓ యువకుడు హత్య కలకలం రేపింది. ఆదివారం జరిగిన హత్యపై స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్థిక వివాదంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, అది హత్యకు దారితీసిందన్నారు. భరత్ అనే యువకుడు వర్ధన్ అనే యువకుడిని కత్తితో పొడవడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ వర్ధన్ మృతిచెందాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
గుంటూరులో మెగా జాబ్ మేళా నిర్వహణకు GMC సిద్ధమవుతోంది. స్మార్ట్ టెక్స్, జీఎంసీ సంయుక్తంగా ఈనెల 9న విజ్ఞాన మందిరంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. 10వ తరగతిపైగా అర్హత కలిగిన నిరుద్యోగుల కోసం 50కుపైగా కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సోమవారం నుంచి తమ వార్డు సచివాలయంలో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వర్క్షాప్ ఉదయం 9 నుంచి ప్రారంభవుతుంది.
స్వర్ణభారతీనగర్లో కుక్కల దాడిలో చిన్నారి మృతిచెందిన ఘటనపై గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా కుక్కల సమస్యపై గళమెత్తినా అధికారులు తాత్కాలికంగా చర్యలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి ఐజక్ ఆత్మకు శాంతి చేకూరాలని, అధికారులు ఇప్పటికైనా కుక్కల నియంత్రణ పై దృష్టి సారించాలని అన్నారు.
గుంటూరులోని స్వర్ణభారతినగర్లో వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటనపై మంత్రి కందుల దుర్గేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన, బాలుడి కుటుంబానికి ప్రభుత్వ పరంగా అన్ని విధాల అండగా ఉంటామని తెలిపారు. ఇలాంటి విషాద ఘటనలు మళ్లీ జరుగకుండా కుక్కల నియంత్రణపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తెనాలి ఐతానగర్ చెందిన రౌడీషీటర్ లడ్డు మరోసారి పోలీసులకు చిక్కాడు. పలు నేరాల్లో భాగంగా ఇటీవల పీడి యాక్ట్ నమోదై జైలుకు వెళ్లి వచ్చిన లడ్డు తాజాగా మరో కేసులో ఇరుక్కున్నాడు. కోపల్లెకి చెందిన మహిళపై దాడి చేసిన ఘటనలో బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి లడ్డును అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ లిఫ్ట్ చేయలేదన్న కారణంతో మహిళపై లడ్డు రాడ్డుతో దాడి చేసినట్లు అభియోగాలు ఉన్నాయి.
తాడేపల్లిలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ అపార్ట్మెంట్ 8వ అంతస్తు నుంచి ఒక వ్యక్తి కింద పడి అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు సదా శివరావుగా గుర్తించారు. ఘనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుంటూరు నగరంలో శ్రీరామ నవమి శోభాయాత్రను శాంతి యుతంగా నిర్వహించేందుకు పోలీసులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఎస్పీ సతీశ్ పలు ప్రధాన ప్రాంతాల్లో రూట్ మాప్ను స్వయంగా పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శోభా యాత్ర ముగియనున్న ఆర్ అగ్రహారం శ్రీ రామనామ క్షేత్రం వద్ద భద్రత కట్టుదిట్టంగా ఉండేలా సూచనలు ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.