Guntur

News August 5, 2025

మంగళగిరిలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

image

చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న మంగళగిరి ఆటోనగర్ లోని వీవర్ శాల వద్ద జరిగే జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. మంగళవారం, గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ పర్యవేక్షణలో ముఖ్యమంత్రి కార్యక్రమాల కో ఆర్డినేటర్, శాసనమండలి సభ్యుడు పెందుర్తి వెంకటేశ్వరరావు, సీఎం పర్యటనకు సంబంధించి పనులను పరిశీలించారు. చేనేత కుటుంబాలతో సమావేశమయ్యే ప్రదేశంలో పలు సూచనలు చేశారు.

News August 5, 2025

వైసీపీ హయాంలో అక్రమాలు జరిగాయి: మంత్రి అనగాని

image

వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ఇంటికే డాక్యుమెంట్లు పంపిస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. మంగళవారం గుంటూరులో అర్బన్ ఆటో మ్యూటేషన్ విధానాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడారు. ల్యాండ్ డెవలప్‌మెంట్ ఫీజు రద్దు చేయడంతో కేవలం 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని చెప్పారు. గతంలో నిర్వహించిన ఎన్‌ఈవీఎస్ రిజిస్ట్రేషన్లలో అవకతవకలు జరిగాయన్నారు.

News August 5, 2025

అమరావతి అనుసంధాన మార్గాల అభివృద్ధే లక్ష్యం: మాధవ్

image

రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు చేపట్టాయని BJP రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. మంగళవారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు. ఫసల్ భీమా అందక ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా ఉంటామని చెప్పారు. ప్రతీ గ్రామానికి బీజేపీ జెండా, కూటమి అజెండాను తీసుకెళ్లడమే తమ లక్ష్యమని చెప్పారు. ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు రాష్ట్రానికి వరాలు ఇస్తున్నారు. అమరావతి అనుసంధాన మార్గాలను అభివృద్ధి చేస్తామన్నారు.

News August 5, 2025

గుంటూరు: ఎండలు బాబోయ్..!

image

గుంటూరు జిల్లాలో వానాకాలంలోనూ ఎండలు మండిపోతున్నాయి. రెండు మూడు రోజులుగా భానుడి ప్రతాపంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆగస్టులో కూడా ఉదయం 9 గంటల నుంచే 31 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అడపాదడపా కురిసిన వర్షాలు మళ్లీ ముఖం చాటేయడంతో వాతావరణం పొడిగా మారింది.

News August 5, 2025

సమన్వయంతో ఏర్పాట్లు చేయండి: కలెక్టర్

image

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం అన్నీ శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ నాగలక్ష్మీ సూచించారు. ఎస్పీ సతీశ్ కుమార్‌తో కలిసి సోమవారం డీఆర్సీ మీటింగ్ హాల్లో స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. మంత్రి లోకేశ్ అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని చెప్పారు. కార్యక్రమంలో డీఆర్వో ఖాజావలీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, తదితరులు పాల్గొన్నారు.

News August 4, 2025

YCP పార్లమెంట్ టికెట్ ఆఫర్ చేసింది: పెమ్మసాని

image

ఎన్నికల సమయంలో వైసీపీ తనకు పార్లమెంట్ టికెట్ ఆఫర్ చేసిందని గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. 2019లో రాజ్యసభ, గుంటూరు పార్లమెంట్, నరసరావుపేట పార్లమెంట్ టికెట్ ఆఫర్ చేసిన విషయం చాలా మందికి తెలియదని ఓ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తన ఐడియాలజీకి సూట్ కానీ పార్టీ వైసీపీ అని తెలిపారు. తనకున్న విధేయత, ఓ కార్యకర్తలా చాలా రోజుల నుంచి కష్టపడ్డాను కాబట్టి తనకు టికెట్ దక్కిందన్నారు.

News August 4, 2025

ప్రజా సమస్యలకు త్వరిత పరిష్కారం అవసరం: ఎస్పీ

image

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదులు-పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ప్రతి ఫిర్యాదును పరిశీలించి సంబంధిత పోలీస్ అధికారులతో టెలిఫోన్ ద్వారా మాట్లాడి, చట్టపరమైన పరిమితులతో పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎస్పీ సతీశ్ ఆదేశాలు ఇచ్చారు. కుటుంబ కలహాలు, భూ వివాదాలపై ప్రజలు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

News August 4, 2025

GNT: అక్కడ ఆడొద్దు సరే.. మరి ప్రత్యామ్నాయం

image

ప్రస్తుత కాలంలో పిల్లలు ఎక్కువ శాతం సెల్ ఫోన్లో ఆటలకు పరిమితం అవుతున్నారు. కొంత మంది పిల్లలు మాత్రం క్రికెట్ మీద మక్కువతో మైదానాలలో, కొన్ని ప్రభుత్వ ప్రదేశాలలో ఆడుతూ ఉంటారు. అయితే అభివృద్ధి, మరికొన్ని కారణాల చేత అక్కడ పిల్లలు ఆడుకోవటానికి వీలు లేకుండా ఆంక్షలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రీడలు కనుమరుగు అవ్వకుండా స్థానికంగా మైదానాలు ఏర్పాటు చెయ్యాలని క్రీడా కారులు కోరుతున్నారు. దీనిపై మీ COMMENT.

News July 11, 2025

గుంటూరు: రైస్ కార్డులకు దరఖాస్తుల వెల్లువ

image

రైస్ కార్డుల కోసం గుంటూరు జిల్లాలో 52,447 దరఖాస్తులు అందగా, వీటిలో 90% సమస్యలు పరిష్కారం అయ్యాయి. కొత్తగా 8 వేలకుపైగా కార్డులు మంజూరు అయ్యే అవకాశం ఉంది. అత్యధికంగా పేర్ల చేర్పు దరఖాస్తులే రావడం గమనార్హం. తెనాలి, గుంటూరు డివిజన్‌లలో అధిక స్పందన కనిపించింది. పేర్ల తొలగింపు, చిరునామా మార్పు, కార్డు విభజనలపై కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఇంకా 4,300లకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

News July 11, 2025

GNT: చంద్రబాబు, లోకేశ్‌పై అంబటి ట్వీట్

image

వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కి చురకలంటించారు. ‘తల్లికి వందనం’ లోకేశ్ ఆలోచన. ‘ఉచిత విద్యుత్’ బాబు ఆలోచన అని చెప్తూ అమాయకపు ప్రజల్లారా నమ్మండి.!’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా అంబటి మెసేజ్‌పై టీడీపీ, వైసీపీ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పరస్పరం మాటల యుద్దం జరుగుతుంది.