India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రేపు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు, రేపు బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు.

వేమూరు నియోజకవర్గంలో గురువారం సీఎం చంద్రబాబు పర్యటించనున్నారని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలిపారు. బుధవారం వేమూరు మార్కెట్ యార్డ్ వద్ద ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్ను ఆయన పరిశీలించారు. బాపట్ల జిల్లాలోని ముంపు ప్రాంతాలలో ముఖ్యమంత్రి పర్యటించి బాధితులను పరామర్శించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి కుమార్ పాల్గొన్నారు.

ఇటీవల కురిసిన ఆకస్మిక వర్షాల వల్ల బుడమేరుకు భారీ గండ్లు పడిన విషయం తెలుసుకున్న మంత్రి లోకేశ్ మరో మంత్రి నిమ్మలతో కలిసి పరిశీలించారు. వరదనీరు పోటెత్తగా విజయవాడతో పాటు, బుడమేరు పరీవాహక ప్రాంతాలు, గ్రామాలు, పొలాలు జలదిగ్బంధమయ్యాయి. భారీ గండ్ల వల్ల కొండపల్లి శాంతినగర్-కవులూరు మార్గంలో రాకపోకలు నిలిచాయి. కాగా లోకేశ్ వరద ముంపు ప్రాంతాల్లోని బురదలో చెప్పులు లేకుండా పర్యటించారు.

జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు కొండవీడు ఘాట్ రోడ్డులో కొండచరియలు రోడ్డుపై విరిగిపడిన విషయం తెలిసిందే. మళ్లీ వర్షాలు పడి కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉన్న కారణంగా ఈనెల 6 వరకు కొండవీడు నగరవనం మూసివేస్తున్నట్ల జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు ఒక ప్రకటనలో తెలిపారు. పర్యాటకులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. మంగళవారం రాత్రి 10గంటలకు బ్యారేజీ నుంచి 70గేట్ల ద్వారా 6.61 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 500 క్యూసెక్కుల నీటిని కాలువలకు మళ్లించారు. వరద ఉద్ధృతి గంట గంటకూ తగ్గుముఖం పట్టడంతో లంకగ్రామాల ప్రజల ఊపిరి పీల్చుకున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ, బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గాల్లో నీటమునిగిన లంక గ్రామాలు బయటపడుతున్నాయి.

రాష్ట్రంలో భారీ వర్షాలు వరదల సమయంలో ఏపీ అలెర్ట్ ద్వారా 7.49 కోట్ల మంది వినియోగదారులకు హెచ్చరిక సందేశాలు అందించామని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. 149 పశువులు 59,848 కోళ్లు మరణించాయన్నారు. 12 విద్యుత్ సబ్స్టేషన్లు దెబ్బతిన్నాయని, అధిక వర్షాల కారణంగా 2851 కిలోమీటర్ల పొడవున ఆర్అండ్బి రోడ్లు దెబ్బతిన్నాయని పేర్కొంది.

విజయవాడలో వరదలు ప్రభావంతో ఇబ్బంది పడుతున్న బాధితులకు సీఎం చంద్రబాబు ఆదేశాలతో 50వేల మందికి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం, రాత్రి భోజనాలు సరఫరాకు ఆహార, పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. గుంటూరు, తెనాలి, మంగళగిరిలో ఆహారం సిద్ధం చేసి బస్సుల ద్వారా విజయవాడకు పంపించడం జరుగుతుందన్నారు. దాతలు ముందుకు వచ్చిన భోజనం ప్యాకెట్లు సిద్ధం చేసి ప్రభుత్వం ద్వారా అందిస్తామన్నారు.

నర్సింగ్ చదువుతున్న వారికి జపాన్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావు తెలిపారు. జపాన్లో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. తప్పనిసరిగా ANM / GNM/ BSC నర్సింగ్ పూర్తి చేయాలని తెలిపారు. అభ్యర్థులు https://shorturl.at/FB7oK లింక్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. వివరాల కోసం ఏపిిఎస్ఎస్డిసి హెల్ లైన్ నంబర్ 99888 53335 సంప్రదించాలని వివరించారు.

గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ నెల 5వ తేదీన జరగాల్సిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి.
జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పి.శైలజా తెలిపారు. ఈ వేడుకలు తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామో తెలియజేస్తామని, ఉపాధ్యాయులు గమనించాలని డీఈవో చెప్పారు.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. బీటెక్ మొదటి, రెండో సంవత్సర సెమిస్టర్ పరీక్షలను ఈనెల 10కి వాయిదా వేస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ శివప్రసాదరావు చెప్పారు. తమ సొంత ప్రాంతాలకు వెళ్లిన విద్యార్థులు వర్షాల వల్ల రావడానికి ఇబ్బందులు పడుతున్నామని చెప్పడంతో వాయిదా వేశామని సీఈ వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.