Guntur

News September 3, 2024

రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ పురస్కార కార్యక్రమం వాయిదా !

image

రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడింది. Dr. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ దినోత్సవం CK Convention మంగళగిరిలో చేయుటకు ఏర్పాట్లు చేశారు. కానీ సీఎం చంద్రబాబుతో పాటూ, ఇతర అధికారులు వరద సహాయక చర్యల్లో బిజీగా ఉండటం, రవాణా సౌకర్యాలు లేకపోవడం కారణంగా కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ విజయరామ రాజు తెలిపారు.

News September 3, 2024

గుంటూరు: ‘2 రోజులు సెలవు ఇవ్వాలి’

image

కృష్ణానదిలో భారీ నీటి ప్రవాహం వల్ల ఏపీ హైకోర్టు, ఏపీ సచివాలయానికి వెళ్లే కరకట్ట రోడ్డు దెబ్బతింది. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు, పనులు చేపట్టాల్సి ఉంది. అలాగే భారీ వరదల కారణంగా ఏపీ హైకోర్టుకు వెళ్లే ఇతర రహదారులు కూడా ముంపునకు గురయ్యాయి. దీంతో ఈ సమస్యలు పరిష్కరించేందుకు AP హైకోర్టుకు 2 రోజుల పాటు సెలవు ప్రకటించాలని – డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు అభ్యర్థించారు.

News September 3, 2024

గుంటూరు: ప్రేమ పెళ్లికి అంగీకరించలేదని యువతి ఆత్మహత్య

image

లవ్ మ్యారేజీకి పెద్దలు అంగీకరించలేదని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన కావ్య(24), సత్తెనపల్లి మం, ఎర్రగుంట్లపాడుకు చెందిన గోపి ఓ బ్యాంకులో పని చేస్తున్నారు. ఇద్దరు అయిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో కావ్య ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News September 3, 2024

గుంటూరు: గణేశ్ వేడుకలకు అనుమతులు తప్పనిసరి

image

వినాయక చవితి పండగ సందర్భంగా వినాయక ఉత్సవ నిర్వాహాకులు ప్రభుత్వం ఏర్పాటుచేసిన సింగల్ విండో పద్దతిలో తప్పకుండా అనుమతులు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో పండుగ ఉత్సవాలపై సంబందిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రశాంత, భక్తి పూర్వక వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలన్నారు.

News September 2, 2024

ప్రకాశం బ్యారేజ్ గేట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు

image

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా వరద ఉద్ధృతికి వచ్చిన పడవలు గేట్లకు ఢీ కొట్టిన ప్రాంతాన్ని కూడా సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి జక్కంపూడి, సింగ్ నగర్‌లో పర్యటించారు.

News September 2, 2024

నరసరావుపేట: ప్రతి గ్రామ వార్డు, సచివాలయంలో కంట్రోల్ రూమ్

image

భారీ వర్షాల నేపథ్యంలో ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అధికారులను సోమవారం ఆదేశించారు. ప్రతి గ్రామంలోనూ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి రోగాలు ప్రబలకుండా చూడాలన్నారు. హెల్త్ క్యాంపుల్లో పాము కాటు మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు . అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.

News September 2, 2024

రేపు గుంటూరులో జాబ్ మేళా

image

రేపు గుంటూరు డి.ఎల్.టి.సి, ఐ.టి.ఐ కాలేజీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృధి అధికారి ప్రణయ్ సోమవారం తెలిపారు. ఈ జాబ్ మేళాకు టెన్త్, ఇంటర్, ఐ.టి.ఐ, డిప్లొమా, డిగ్రీ లేదా బి.టెక్ ఆపైన చదువుకున్న వారు అర్హులని తెలిపారు. నిరుద్యోగ యువతి, యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు.

News September 2, 2024

విషాదం.. పంట మునిగిందని రైతు ఆత్మహత్యాయత్నం

image

వర్షాలతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్నదాతలకూ కష్టాలు తప్పడం లేదు. ఈక్రమంలో ఓ రైతు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. రాజుపాలెం మండలం అనుపాలేనికి చెందిన పగిల్ల గోపి కౌలుకు తీసుకుని మూడెకరాల్లో పైరు సాగు చేశారు. వరద నీటిలో పంట మునిగిపోయింది. దీనికి తోడు పాత అప్పులు ఉండటంతో బాధ తట్టుకోలేక గడ్డిమందు తాగాడు. సత్తెనపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

News September 1, 2024

గుంటూరు: టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు

image

వర్షాల కారణంగా ప్రజల ఇబ్బందులను పరిష్కరించడానికి గుంటూరు కలెక్టరేట్, నగరపాలకసంస్థ కార్యాలయాల్లో టోల్ ఫ్రీ నంబర్లను అధికారులు అందుబాటులో ఉంచారు. జిల్లా ప్రజలు గుంటూరు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన 0863-2234014, 9849904013కి, అదేవిధంగా నగర ప్రజలు కార్పొరేషన్‌లో ఏర్పాటు చేసిన 0863-2345105, 9849908391 నంబర్లను సంప్రదించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సూచిస్తుంది. Share It

News September 1, 2024

అమరావతి: వరద పరిస్థితిపై మంత్రి అనిత సమీక్ష

image

రాష్ట్రంలో వరద పరిస్థితిపై హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్షించారు. తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యలయంలోని స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఆదివారం ప్రస్తుత వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు బారిన పడిన 294 గ్రామలకు చెందిన 13,227 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు మంత్రి తెలిపారు.