Guntur

News June 15, 2024

గుంటూరు మిర్చి యార్డుకు 3 రోజులు సెలవులు

image

బక్రీద్ పండుగ సందర్భంగా గుంటూరు మిర్చి మార్కెట్ యార్డుకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. శని, ఆదివారాలు సాధారణ సెలవులతో పాటు సోమవారం బక్రీద్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించిందని మిర్చి యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఐ వెంకటేశ్వరరెడ్డి శుక్రవారం తెలిపారు. యార్డులో 18 నుంచి యథావిధిగా క్రయ విక్రయాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు.

News June 15, 2024

జిల్లాలో మాతృ మరణాల నివారణకు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

హైరిస్క్ కేసుల్ని ముందుగానే గుర్తించి పైస్థాయి ఆసుపత్రులకు చెకప్, కాన్పుకు పంపేందుకు ఆరోగ్య కార్యకర్తలు, డాక్టర్లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆదేశించారు. డెలివరీ అయిన స్త్రీని కనీసం 5 రోజులు తప్పనిసరిగా ఆసుపత్రిలోనే ఉంచాలన్నారు. హైరిస్క్ గర్భిణీలకు ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలు 8 నుంచి 9 నెలల మధ్యలో చేయాలని చెప్పారు. మాతృ మరణాల నివారణపై శుక్రవారం కలెక్టర్ సమీక్షించారు.

News June 14, 2024

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసిన పెమ్మసాని

image

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రపతిని కలవడం తాను గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన ‘X’ వేదికగా చెప్పారు. పెమ్మసానితో పాటు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా రాష్ట్రపతిని కలిశారు.

News June 14, 2024

గత అనుభవంతో సమర్థవంతంగా పని చేస్తా: నారా లోకేశ్

image

గత అనుభవం నేర్పిన పాఠాలతో ఇప్పుడు మరింత సమర్థవంతంగా పని చేస్తానని నారా లోకేశ్ తెలిపారు. హెచ్‌ఆర్‌డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజి శాఖల మంత్రిగా ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలుపుతూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు.

News June 14, 2024

అమరావతిలో పరుగుల పెట్టనున్న ఐటీ రంగం

image

నారా లోకేశ్ మరోసారి ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. చంద్రబాబు మానసపుత్రికైన అమరావతిలో ఐటీ రంగానికి పెద్దపీట వేయనున్నారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో కంపెనీలు తీసుకొచ్చి, ఐటీ రంగాన్ని లోకేశ్ పరుగులు పెట్టిస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ ఐటీ మంత్రిగా చేసిన అనుభవం లోకేశ్‌కు పని కొస్తుందని వివరిస్తున్నారు.

News June 14, 2024

గుంటూరు జిల్లాకు కీలక శాఖలు..

image

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు జిల్లాకు జలవనరులశాఖ(అంబటి రాంబాబు), వైద్యారోగ్య శాఖ(విడదల రజిని)లు దక్కాయి. మంత్రులుగా చేసిన విషయం తెలిసిందే. తాజా, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండగా.. ఐటీ, మానవ వనరుల శాఖ(లోకేశ్).. ఆహార, పౌర సరఫరాల శాఖ(ఎన్.మనోహర్).. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్(అనగాని సత్యప్రసాద్) శాఖలు దక్కాయి.

News June 14, 2024

నారా లోకేశ్‌కు ఐటీ శాఖ

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో మంత్రులకు సీఎం చంద్రబాబు శాఖలు కేటాయించారు. దీంతో రెండ్రోజుల ఉత్కంఠకు తెరపడింది. జిల్లాకు సంబంధించి మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన నారా లోకేశ్‌కు ఐటీ, మానవ వనరుల శాఖ.. నాదెండ్ల మనోహర్‌కు పౌర సరఫరాల శాఖ.. అనగాని సత్యప్రసాద్‌కు రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

News June 14, 2024

గుంటూరు: అప్పుల బాధలు తాళలేక కౌలు రైతు ఆత్మహత్య

image

అప్పుల బాధలు కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడేపల్లి మండలంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. చిర్రావూరు గ్రామానికి చెందిన ప్రకాశ్ రావు (54) అప్పుల బాధలు గురువారం సాయంత్రం గడ్డి మందు తాగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. గురువారం రాత్రి మరణించారు. అనంతరం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News June 14, 2024

పొన్నూరులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో వ్యాపారి మృతిచెందిన సంఘటన జీబీసీ రహదారిలో గురువారం రాత్రి జరిగింది. పొన్నూరు పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణ పరిధిలో 28వ వార్డుకు చెందిన ఆదినారాయణ (70)పచారీ దుకాణం నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. జీబీసీ రహదారిలో టీ తాగేందుకు వెళ్లి తిరిగి దుకాణం వద్దకు వస్తున్న సమయంలో గుంటూరు నుంచి బాపట్ల వెళ్తున్న ఓ లారీ అయన్ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

News June 14, 2024

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1080 డీఎస్సీ పోస్టులు

image

మెగా డీఎస్సీ పేరుతో నూతన సీఎం చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేస్తానని చేసిన వాగ్దానం మేరకు గురువారం సాయంత్రం వెలగపూడి సచివాలయంలో రాష్ట్రం మొత్తం 16,347 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదలకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు జిల్లాల వారీగా ఖాళీలను అధికారికంగా ప్రకటించకపోయినా విశ్వసనీయ సమాచారం మేరకు ఉమ్మడి జిల్లాలో దాదాపు 1080 ఖాళీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.