India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చేబ్రోలు మండలంలోని వడ్లమూడి నక్కల గుంత సమీపంలో మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఎస్సై మహేశ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నక్కలగుంత సమీపంలో మహిళ మృతదేహం ఉన్నట్టు సమాచారం రావడంతో పోలీసులు వెళ్లి పరిశీలించారు. మృతదేహం గుర్తించలేని విధంగా ఉంది. కాషాయం రంగు ఆకులు ఉన్న తెల్ల చీర, ఆరెంజ్ రంగు జాకెట్టు ధరించి ఉందన్నారు. హత్యా? లేదా ఆత్మహత్యా? అనే కోణంలో విచారిస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
గుజ్జనగుండ్ల సర్కిల్లో ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 15న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రఘు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్, నర్సింగ్ విద్యార్హతలు గల 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు గల నిరుద్యోగ యువతీ, యువకులు బయోడేటా, రెజ్యూమ్లతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరగనున్న ఇంటర్వ్యూలకు నేరుగా హాజరు కావాలని సూచించారు.
మేడికొండూరులో జేసీబీ ఆపరేటర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్సై వాసు తెలిపిన వివరాలు ప్రకారం.. కాకినాడకు చెందిన వెంకన్న(48) పేరేచర్లలో జేసీబీ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. గురువారం ఆయన నివసిస్తున్న ఇంటి నుంచి దుర్వాసన వస్తుందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పరిశీలించగా వెంకన్న ఉరి వేసుకున్నట్లు కనిపించిందని, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని ఎస్సై చెప్పారు.
తెనాలి నుంచి గెలిచిన నాదెండ్ల మనోహర్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. కాగా, ఆయనకు ఇంకా శాఖ కేటాయించపోవడంతో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మనోహర్కు పౌర సరఫరాల శాఖ కేటాయించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు, ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి మరో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనగాని సత్యప్రసాద్కు ఏ శాఖ కేటాయిస్తారనే విషయం కూడా చర్చనీయాంశంగా మారింది.
రహదారిపై వెళ్తున్న లారీ అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటన కాకుమాను మండలం కొమ్మూరు గ్రామంలో జరిగింది. గురువారం కొమ్మూరు గ్రామంలో వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
పల్నాడు జిల్లా లోక్సభ స్థానంతోపాటు 7 అసెంబ్లీ స్థానాల్లో TDP ఎన్నడూ లేనివిధంగా మెజారిటీతో విజయం సాధించింది. అయితే ఆశావహులైన సీనియర్లకే ఇక్కడ నిరాశ ఎదురైనట్లు తెలుస్తోంది. వారిలో కన్నా, యరపతినేని, జీవీలకు ఈసారి మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని భావించారు. కాగా ప్రత్తిపాటి, జూలకంటి ఆశావహుల జాబితాలో ఉన్నారు. వివిధ సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్న అధిష్ఠానం పల్నాడుకు ప్రాతినిధ్యం కల్పించలేకపోయింది.
విజయవాడ డివిజన్ పరిధిలో ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున ఈనెల 21వ తేదీ నుంచి, పలు రైళ్లను రద్దు చేయాలన్న నిర్ణయాన్ని ఉప సంహరించుకున్నట్లు గుంటూరు మండల రైల్వే అధికారి బుధవారం తెలిపారు. విజయవాడ- గుంటూరు(07628), గుంటూరు-రేపల్లె (07786), రేపల్లె-తెనాలి (07873), తెనాలి- విజయవాడ (07630), రైళ్లు యథావిధిగా నడుస్తాయని పేర్కొన్నారు.
వేసవి సెలవుల అనంతరం దాదాపు నెలన్నర తరువాత నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జడ్పీ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే తల్లిదండ్రులు విద్యార్థుల్ని పాఠశాలలకు పంపేందుకు సన్నద్ధం అయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యాకానుక కిట్ల సరఫరాను ప్రభుత్వం పూర్తి చేసింది.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వేసవి సెలవులు మరోసారి పొడిగించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా సెలవులను ఈనెల 14 వరకు పొడిగిస్తున్నట్లు ముందుగా ప్రకటించారు. తాజాగా విశ్వవిద్యాలయంలోని కళాశాలలు ఈనెల 18 నుంచి పునఃప్రారంభమవుతాయని రిజిస్ట్రార్ కరుణ ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో, జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్తోపాటు గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ దూడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.