Guntur

News August 29, 2024

రాజీనామా వెనుక బలమైన కారణాలు: మోపిదేవి

image

తాను వైసీపీకి రాజీనామా చేయడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని మోపిదేవి వెంకట రమణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన రాజీనామాకు గల కారణాలు అన్ని మీడియాకు చెప్పుకోలేనని అన్నారు. రాజ్యసభపై తనకు ఆసక్తి లేదని స్థానిక రాజకీయాల్లోనే ఉండాలనుకున్నానని అన్నారు. తనకు ఎమ్మెల్యే టికెట్ నిరాకరించినప్పుడే రాజీనామా చేయాలని అనుకున్నట్లు ఆయన చెప్పారు.

News August 29, 2024

మోపిదేవి రాజీనామాకు కారణం ఇదేనా.?

image

రాజ్యసభ సభ్యులు, ఉమ్మడి గుంటూరు జిల్లా బీ.సీ నాయకులు మోపిదేవి వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేయడానికి రేపల్లె సీటే కారణంగా భావిస్తున్నారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వెంకటరమణ 2024 అసెంబ్లీ ఎన్నికలలో రేపల్లె నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు. అయితే అధినేత జగన్ ఈ సీటును ఈపూరు గణేశ్‌కు కేటాయించారు. అప్పటి నుంచి అలకబూనిన వెంకటరమణ వైసీపీకి దూరమై రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.

News August 29, 2024

అమరావతిలో నిర్మాణాలపై నేడు కీలక సమావేశం

image

రాజధానిలో నిర్మాణాల పున:ప్రారంభంపై నేడు కీలక సమావేశం జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం CRDA అధికారులు సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఇందులో భాగంగా నిర్మాణాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వం రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ పనులను చేపట్టగా, ప్రాధాన్యత క్రమంలో విడతల వారీగా భవనాలు నిర్మాణాలు జరగనున్నాయి.

News August 29, 2024

జిల్లా ఉపాధి కార్యాలయంలో రేపు జాబ్ మేళా

image

గుంటూరు గుజ్జనగుండ్ల సర్కిల్‌లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 30న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె. రఘు తెలిపారు. టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, పీజీ వరకు చదువుకున్న 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు ఉన్న నిరుద్యోగ యువతీ, యువకులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని చెప్పారు.   

News August 29, 2024

నరసరావుపేట: ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాటుపై సమీక్ష

image

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ల జిల్లా పర్యటన కోసం ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటే వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఇరువురు విచ్చేస్తున్నట్లు ఆయన బుధవారం తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.

News August 28, 2024

గుంటూరు: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ క్యాబినెట్

image

ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్ర మున్సిపల్ శాఖలో 269 సూపర్ న్యూమరీ భర్తీకి క్యాబినెట్ పచ్చ జెండా ఊపింది. అలాగే పౌరసరఫరాల శాఖలో 2,771 కొత్త రేషన్ దుకాణాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

News August 28, 2024

పల్నాడు: ‘సీఎం పర్యటనను విజయవంతం చేయాలి’

image

ఈనెల 30న ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాస్ రావు అన్నారు. హేలీప్యాడ్, ప్రధాన సభా స్థలాన్ని పరిశీలన అనంతరం ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసేలాగా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

News August 28, 2024

కన్న కూతురిపై తండ్రి అత్యాచారం

image

మూడేళ్ల వయసులో కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కన్న కూతురిపై అత్యాచారం చేశాడు. ఈ విషయం మాచర్లలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోజు రాత్రిపూట శీతలపానీయంలో మత్తు మందు కలిపి భార్య, కూతురికి తాగించాడు. మత్తులో నిద్రపోయిన వేళ కూతురుపై రోజు అత్యాచారం చేస్తున్నాడు. చిన్నారి మూత్రవిసర్జన సమయంలో నొప్పిగా ఉందని ఆసుపత్రిలో చూపిస్తే వైద్యులు అసలు నిజం చెప్పారు. 

News August 28, 2024

వినుకొండ: డబ్బుల కోసం తమ్ముడి హత్య చేశారు

image

వినుకొండలో సొంత సోదరుడుని రోకలి బండతో కొట్టి చంపారు. సీఐ శోభన్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దనాల్సా బజారుకు చెందిన సుభానీ జులై 8 నుంచి కనపడటం లేదని అతని భార్య మేహరిన్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు మృతుడి సోదరులను విచారించగా డబ్బులు విషయంలో గొడవ జరిగి రోకలి బండతో కొట్టి చంపినట్లు నిందితులు ఒప్పుకున్నారు. వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.

News August 28, 2024

పవన్ కళ్యాణ్‌కి పుట్టినరోజు బహుమతిగా ఇద్దాం: నాదెండ్ల

image

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా సెప్టెంబరు 2వ తేదీన పార్టీ నాయకులు, శ్రేణులు కలిసి ప్రజోపయోగ కార్యక్రమాల్లో పాల్గొనాలని మంత్రి నాదెండ్ల మనోహర్ టెలి కాన్ఫరెన్స్ లో పిలుపునిచ్చారు. సెప్టెంబరు 2వ తేదీన అంతా కలిసి ‘క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర’ కాన్సెప్ట్ తో కార్యక్రమాలను ఊరువాడా ఘనంగా నిర్వహిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీలోని ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు.