India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నిద్రిస్తున్న మహిళను అత్యాచారం చేసి, హత్య చేసిన నిందితులను నాదెండ్ల పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సీఐ సుబ్బారాయుడు మాట్లాడుతూ.. ఈ నెల 8న నాదెండ్ల మండలం గణపవరం పీర్లచావిడిలో గదిలో నిద్రపోతున్న మహిళపై మనోజ్ మాలిక్(28), సాంబశివరావు (25) కలిసి అత్యాచారం చేసి హత్య చేశారని తెలిపారు. ఈ మేరకు నిందితులను ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.

గుంటూరు జిల్లాలో దారుణ హత్య చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పాత గుంటూరుకు చెందిన అభిరామ్ 11 ఏళ్ల క్రితం మౌనికను కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం. అభిరామ్ కొన్ని నెలలుగా మౌనికను అనుమానిస్తూ ఇబ్బంది పెడుతున్నాడు. సోమవారం రాత్రి మౌనిక తలపై క్రికెట్ బ్యాట్తో బలంగా కొట్టాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని దిశ డీఎస్పీ సుబ్బారావు తెలిపారు.

కాకినాడ జిల్లా ఏలేశ్వరం ఘటనపై మంత్రి నారా లోకేశ్ మంగళవారం అరా తీశారు. ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన తనను ఆందోళనకు గురి చేసిందన్నారు. వారికి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్భందీ చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

తాడేపల్లి జడ్పీ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థులు మంగళవారం రోడ్డుపై వినూత్న నిరసన చేస్తున్నారు. తమకు ఇష్టమైన ఉపాధ్యాయురాలిని పాఠశాల నుంచి బదిలీ చేయవద్దంటూ ఆందోళన చేపట్టారు. హైస్కూల్లో సోషల్ పాఠాలను బోధించే ధూళిపాళ్ల పద్మజ ఇటీవల బదిలీ అయ్యారు. సోషల్ టీచర్ బదిలీ అయితే సరిగ్గా చదవలేమని విద్యార్థులు వాపోతున్నారు.

రాజధాని అమరావతిలో చేపట్టిన జంగిల్ క్లియరెన్స్లో సోమవారం శాశ్వత సచివాలయం శిలాఫలకం కనిపించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు శంకుస్థాపన చేసిన శిలాఫలకం పిచ్చికంప, చెట్లు తొలగించడంతో వెలుగులోకి వచ్చింది. దానిని రాజధాని రైతులు సందర్శించారు.

సెప్టెంబరు నుంచి రేషను కార్డుదారులకు బియ్యంతో పాటు చక్కెర, పట్టణాల్లో రాగులు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జిల్లాలో మొత్తం 5,99,511 రేషనుకార్డులున్నాయి. సెప్టెంబరులో గుంటూరు, తెనాలి, మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాలలో పంపిణీ చేసేందుకు 96 టన్నుల రాగులు గోదాముకు చేరాయి. నిలిపివేసిన చక్కెరను కూడా ఇవ్వనున్నట్లు డీఎస్వో కోమలి వర్మ తెలిపారు.

నిద్రిస్తున్న బాలికపై ఇద్దరు బాలురు అత్యాచారయత్నం చేసిన ఘటన తాడికొండలో వెలుగులోకొచ్చింది. సీఐ కె. వాసు వివరాల మేరకు 9వ తరగతి చదువుతున్న బాలిక ఈనెల 21న ఇంట్లో ఉంది. గమనించిన ఇద్దరు బాలురు ఒకరు నోరు మూసి, మరొకరు అత్యాచారానికి యత్నించారు. ఆ సమయంలో వేరే యువతి రావడంతో పారిపోయారు.బాలిక పోలీసులను ఆశ్రయించి వారిలో ఒకరు ప్రేమపేరుతో వేధిస్తున్నాడని, తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరిస్తున్నాడని తెలిపింది.

గుంటూరులో నో ఎంట్రీ టైంను పక్కాగా అమలు చేస్తామని ట్రాఫిక్ సీఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట, మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నో ఎంట్రీ టైం అమల్లో ఉంటుందని చెప్పారు. ఆ సమయంలో నగరంలోకి ట్రాక్టర్లు, లారీల ఎంట్రీకి అనుమతి లేదని చెప్పారు. చుట్టుగుంట నుంచి, SVN Colony నుంచి, JKC కాలేజ్, శ్యామల నగర్ నుంచి గుంటూరులోకి వస్తే చర్యలు ఉంటాయన్నారు.

పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాలు కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ రేషన్ మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెత్తించారని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. తెనాలి జనసేన కార్యాలయంలో సోమవారం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. కాకినాడ పోర్టు సాక్షిగా మంత్రి మాఫియాకి వణుకు పుట్టించారు అని అన్నారు.

వినాయక చవితికి పందిళ్లు ఏర్పాటు చేసుకోదలచిన వారు పోలీస్ శాఖ అనుమతి తీసుకోవాలని SP సతీశ్ కుమార్ తెలిపారు. మండపాలు ఏర్పాటు చేసుకోవడానికి 5 లేదా అంతకంటే ఎక్కువ మంది కమిటీగా ఏర్పడి వారి వివరాలు సంబంధిత పోలీస్ స్టేషన్లలో తెలిపి, వారి గుర్తింపు కార్డు నకలు కాపీలు జత చేయాలని చెప్పారు. ప్రైవేట్ లేదా పంచాయతీ, మున్సిపాలిటీకి సంబంధించిన స్థలాలలో విగ్రహాన్ని ఏర్పాటు చేయదలచిన స్థలాల వివరాలు చెప్పాలన్నారు.
Sorry, no posts matched your criteria.