India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు తాడేపల్లిలోని పంచాయితీ రాజ్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి, తాడేపల్లిలోని పంచాయితీ రాజ్ కార్యాలయానికి చేరుకుంటారు. అనంతరం అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పవన్ మంత్రిగా భాధ్యతలు చేపట్టిన తొలిసారి ఈ సమావేశం జరగనుంది.
*గుంటూరులో సందడి చేసిన సినీనటి
*అమరావతి శివాలయ పూజారికి నోటీసులు
*జగన్నాథ రథయాత్రలో చీపురు పట్టిన నారా లోకేశ్
*ANU: 4 సెమిస్టర్ ఫలితాలు విడుదల
*కొల్లూరు: గ్యాస్ స్టవ్ పేలి వృద్ధురాలికి గాయాలు
*మంగళగిరి TDP ఆఫీసుపై దాడి కేసు.. YCP నేతలకు బిగ్ రిలీఫ్
*డయేరియాపై పిడుగురాళ్లలో మంత్రి క్షేత్రస్థాయి పర్యటన
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏప్రిల్ 16 నుంచి 29 వరకు నిర్వహించిన 4వ సెమిస్టర్ రెగ్యులర్& సప్లిమెంటరీ BA, BCom, BSc, BCA పరీక్షా ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య సంధ్యా కోల్ విడుదల చేశారు. ఈ ఫలితాలలో మొత్తం 14,544 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 8,439 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్ www.anu.ac.in నుంచి పొందవచ్చన్నారు.
సమస్య ఏదైనా, సహాయం కావాలన్నా ఇకనుంచి తనకు hello.lokesh@ap.gov.in ఈ మెయిల్ ఐడీకి పంపాలని మంత్రి నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలంటూ పంపుతున్న మెసేజ్లు పోటెత్తడంతో మంత్రి నారా లోకేశ్ వాట్సాప్ను మెటా బ్లాక్ చేసింది. తరచూ ఇదే సమస్య ఉత్పన్నం అవుతుండటంతో తన పర్సనల్ మెయిల్ ఐడీకి ప్రజలు తమ వినతులు, సమస్యలు పంపించాలని కోరారు.
దుర్గామల్లేశ్వర స్వామి హుండీ ఆదాయ లెక్కింపు కార్యక్రమం జరిగింది. 20 రోజులకుగానూ రూ.3,36,59,796 నగదు, 436 గ్రా. బంగారం, 6.06 కిలోల వెండి వచ్చిందని అధికారులు చెప్పారు. 1300 US డాలర్లు, 85 UK పౌండ్లు, 7 ఆస్ట్రేలియా డాలర్లు, 12 సింగపూర్ డాలర్లు, 80 కెనడా డాలర్లు, 70 న్యూజిలాండ్ డాలర్లు, 625 కువైట్ దీనార్లు, 118 మలేషియా రింగెట్స్, ఈ-హుండీ ద్వారా రూ.1,91,787 ఆదాయం వచ్చిందన్నారు.
మాచర్ల మాజీ MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్లపై బుధవారం గుంటూరు జిల్లా కోర్టులో వాదనలు జరిగాయి. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ.. రిగ్గింగ్ను ఆపడానికి పిన్నెల్లి ఈవీఎం పగలగొట్టినట్లు వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇటీవల ఒప్పుకున్నారని చెప్పారు. పిన్నెల్లి తరఫు న్యాయవాది వాదిస్తూ, కక్షపూరితంగా కేసులు పెట్టారన్నారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పును 18కి వాయిదా వేసింది.
గుంటూరు లాంఫామ్ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రంలో గ్రామీణ యువతకు ఆరురోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేవీకే ప్రధాన శాస్త్ర వేత్త డాక్టర్ ఎం.యుగంధర్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 15 నుంచి 20వ తేదీవరకు ఆరు రోజులపాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో వానపాముల నుంచి ఎరువు తయారీపై శిక్షణ ఉంటుందన్నారు.
మంగళగిరి – తాడేపల్లి కార్పోరేషన్ కమిషనర్ నిర్మల్ కుమార్ని బదిలీ చేస్తూ బుధవారం అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన్ను బాపట్ల మున్సిపల్ కమిషనర్గా.. సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్గా పనిచేస్తున్న షేక్ అలీమ్ బాషాను ఎంటీఎంసీ కమిషనర్ గా నియమించారు. అలానే బాపట్ల మున్సిపల్ కమిషనర్ బి.శ్రీకాంత్ను ఎంటీఎంసీ డిప్యూటీ కమిషనర్గా బదిలీ చేశారు. ఇక్కడి డిప్యూటీ కమిషనర్ శివారెడ్డిని సీడీఎంఏకి అటాచ్ చేశారు.
గుంటూరు జిల్లా పరిషత్ సూపరింటెండెంట్ జాస్తి సాంబశివరావు బుధవారం మృతి చెందారు. ఈయన ఎన్నో ఏళ్లుగా జిల్లా పరిషత్, ఉమ్మడి గుంటూరు జిల్లాలో అనేకమంది ముఖ్య రాజకీయ నాయకులకు అనేక విధాలుగా తన సేవలు అందించారు. ఈ మేరకు గుంటూరు జిల్లా టీడీపీ నాయకులు డొక్కా మాణిక్య వరప్రసాద్ రావు, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తదితరులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అభివృద్ధిలో నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలపాలని కసితో పరుగులు పెడుతున్నానని, ప్రభుత్వం తరఫున తోడ్పాటు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుని నరసరావుపేట ఎమ్మల్యే చదలవాడ అరవిందబాబు విన్నవించారు. ఈ మేరకు వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. రాష్ట్రంలో నరసరావుపేట నియోజకవర్గం ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తానని ఆయన తెలిపారు.
Sorry, no posts matched your criteria.