Guntur

News August 26, 2024

వినాయక చవితికి అనుమతులు తప్పనిసరి: GNT ఎస్పీ

image

వినాయక చవితికి పందిళ్లు ఏర్పాటు చేసుకోదలచిన వారు పోలీస్ శాఖ అనుమతి తీసుకోవాలని SP సతీశ్ కుమార్ తెలిపారు. మండపాలు ఏర్పాటు చేసుకోవడానికి 5 లేదా అంతకంటే ఎక్కువ మంది కమిటీగా ఏర్పడి వారి వివరాలు సంబంధిత పోలీస్ స్టేషన్లలో తెలిపి, వారి గుర్తింపు కార్డు నకలు కాపీలు జత చేయాలని చెప్పారు. ప్రైవేట్ లేదా పంచాయతీ, మున్సిపాలిటీకి సంబంధించిన స్థలాలలో విగ్రహాన్ని ఏర్పాటు చేయదలచిన స్థలాల వివరాలు చెప్పాలన్నారు.

News August 26, 2024

‘గుంటూరు జిల్లా ప్రజలకు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు’

image

గుంటూరు జిల్లాలోని ప్రజలకు ఎస్పీ సతీశ్ కుమార్ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కష్టసుఖాలు, గెలుపోటములు సమస్థితిలో చూడటమే శ్రీకృష్ణ తత్వమని అన్నారు. ఇది అందరికీ స్ఫూర్తిదాయకం, ఆచరణీయమన్నారు. జిల్లా ప్రజలు ఇంటిల్లిపాది సుఖసంతోషాలతో పర్వదినాన్ని జరుపుకోవాలని చెప్పారు. 

News August 26, 2024

కృష్ణా ష్టమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

image

శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణ భగవానుడు మీ కుటుంబాన్ని ఆనందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాని అన్నారు. గీతాసారంతో జీవిత సారం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడిని స్మరించుకోవడం అంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తుచేసుకుని ముందుకు సాగడమే అన్నారు. 

News August 26, 2024

తెనాలిలో యువతీ ఫోటోలు మార్ఫింగ్

image

గుంటూరు (D) తెనాలికి చెందిన ఓ యువతి వైద్యరంగంలో స్పీచ్ అండ్ హియరింగ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నారు. ఆమె ఫోటోలను కొందరు మార్ఫింగ్ చేసి వాటిని కొరియర్ ద్వారా ఆమెకు పంపి బెదిరించారు. బాధితురాలు తెనాలి 2టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు ప్రకాశం (D) కంభం గ్రామానికి చెందిన అబ్దుల్ సత్తార్, మార్కాపురానికి చెందిన కరుణాకర్‌, గోరంట్లకు చెందిన భరత్‌ను అదుపులోకి తీసుకున్నారు.

News August 26, 2024

గుంటూరు: ‘వాలంటీర్లకు వేతనాలను చెల్లించాలి’

image

పెండింగ్ లో ఉన్న వాలంటీర్ల గౌరవ వేతనాలను వెంటనే చెల్లించాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను రాష్ట్ర వాలంటీర్ల అధ్యక్షుడు భాష కోరారు. ఆదివారం వాలంటీర్ల సంఘం నాయకులతో కలిసి ఆయన మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించడమే కాకుండా ఎన్నికల హామీల్లో భాగంగా వేతనాలు పెంపు చేయాలని కోరారు. రాజీనామాలు చేసిన వాలంటీర్లను తిరిగి వీధుల్లోకి తీసుకోవాలన్నారు.

News August 25, 2024

బాపట్ల జిల్లా యువతికి ఐదు కంపెనీల్లో ఉద్యోగాలు

image

బాపట్ల జిల్లా బొమ్మనంపాడుకు చెందిన శ్రావణికి ఒకేసారి 5 కంపెనీలో ఉద్యోగాలు వచ్చాయి. గుంటూరులో ఇంటర్ చదివి పెదకాకానిలోని ఓ కాలేజీలో CSEలో చేరింది. బీటెక్ చివరి ఏడాదిలో తొలిసారిగా ఓ కంపెనీలో రూ.4.5లక్షలు, 2వ కంపెనీలో రూ.5 లక్షలు, 3వ కంపెనీలో రూ.9లక్షలు, 4వ కంపెనీలో రూ.11లక్షలు, 5వ కంపెనీలో రూ.23లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు పొంది ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది. 

News August 25, 2024

అమరావతి నిర్మాణ వ్యయం రూ.60వేల కోట్లు

image

రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి 20వేల కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. శనివారం కృష్ణా జిల్లాలో జరిగిన ఓ సదస్సులో పాల్గొని ఆయన మాట్లాడారు. నాలుగేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం నిర్దేశించారని స్పష్టం చేశారు. డిసెంబర్ ఒకటి నుంచి పూర్తిస్థాయిలో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి అన్నారు.

News August 25, 2024

నగర వనాల అభివృద్ధికి నిధులు మంజూరు: పవన్ కళ్యాణ్

image

రాష్ట్రంలో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నగరవనాలు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఆమోదం తెలిపిందని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. 11 మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలో నూతనంగా నగరవనాలు అభివృద్ధి నిమిత్తం తొలి విడతగా రూ.15.4కోట్లను కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నిధులను మంజూరు చేసిందన్నారు.

News August 25, 2024

అరబిక్ సర్టిఫికెట్ కోర్సులో దరఖాస్తుల ఆహ్వానం

image

గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలోని అంతర్జాతీయ విద్యార్థుల విభాగం ఆధ్వర్యంలో సర్టిఫికెట్ కోర్స్ ఇన్ అరబిక్ లాంగ్వెజ్ మూడు నెలల కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంచాలకురాలు పద్మావతి తెలపారు. ఈ కోర్సు తరగతులను గుంటూరులోని అభ్యుదయ మహిళా కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని వెల్లడించారు. రోజూ సాయంత్రం రెండు గంటల పాటు ఈ కోర్సు నిర్వహిస్తున్నామన్నారు. 

News August 24, 2024

బాపట్ల ఘటనపై ఆరా తీసిన సీఎం చంద్రబాబు

image

బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో జరిగిన ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో అస్వస్థతకు గురైన పిల్లల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని ప్రభుత్వ డాక్టర్స్‌ను ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ప్రాణాపాయం లేదని, వైద్య సదుపాయం అందిస్తున్నామని అధికారులు సీఎంకు తెలియజేశారు.