Guntur

News June 9, 2024

గుంటూరు జిల్లాలో రేపు “కల్కి” ట్రైలర్ ప్రదర్శించేది ఎక్కడంటే..

image

రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD” సినిమా ట్రైలర్ రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల కానుంది. కాగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ సినిమా ట్రైలర్ ప్రదర్శించే థియేటర్ల వివరాలను చిత్ర బృందం ఈ మేరకు ట్విట్టర్‌లో వెల్లడించింది. గుంటూరు- భాస్కర్, తెనాలి- సంగమేశ్వర, నరసరావుపేట- రవికళా మందిర్, మాచర్ల- శ్రీనివాస, సత్తెనపల్లి- లక్ష్మీ, ఒంగోలు- గోరంట్ల కాంప్లెక్స్, చిలకలూరిపేట- సాయికార్తీక్

News June 9, 2024

తొలిసారి ఎన్నికై.. కేంద్ర సహాయ మంత్రిగా పెమ్మసాని

image

గుంటూరు MPగా ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్‌ కేంద్ర సహాయ మంత్రిగా ఆదివారం దిల్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్రంలో ఏర్పాటు కానున్న NDA ప్రభుత్వంలో TDP, జనసేన కూడా భాగస్వామ్యం కావాలని తీసుకున్న నిర్ణయంతో పెమ్మసానికి తొలి జాబితాలో స్థానం దక్కింది. పోటీ చేసిన తొలిసారే భారీ మెజార్టీతో గెలిచి, కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

News June 9, 2024

కేంద్ర సహాయ మంత్రిగా గుంటూరు MP ప్రమాణ స్వీకారం

image

గుంటూరు టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆయనతో ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. కాగా పెమ్మసాని గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో జన్మించారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పలువురు నేతలు పెమ్మసానిని అభినందించారు.

News June 9, 2024

గుంటూరు MP పెమ్మసాని చంద్రశేఖర్ నేపథ్యమిదే..

image

* తెనాలి మం. బుర్రిపాలెంలో 1976 మార్చి 7న జననం
* తల్లిదండ్రులు: సాంబశివరావు, సువర్ణ
* భార్య: శ్రీరత్న, సంతానం: అభినవ్, సహస్త్ర
* 1993-94లో MBBS ఎంట్రన్స్‌లో 27వ ర్యాంకు
* HYD ఉస్మానియా To 2000లో PG కోసం అమెరికా
* USలో మెడికల్ స్టూడెంట్స్ కోసం శిక్షణ సంస్థ ప్రారంభం
* అనతి కాలంలోనే రూ.వేల కోట్లు ఆర్జన
* 2019లో నరసరావుపేట MP టికెట్ కోసం ప్రయత్నం
* 2024లో గుంటూరు MPగా 3,44,695 ఓట్ల మెజారిటీతో గెలుపు

News June 9, 2024

గుంటూరు స్టేడియంలోని జిమ్‌కు ఎన్టీఆర్ పేరు

image

గుంటూరు నగరం బృందావన్ గార్డెన్స్ సెంటర్‌లో ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలోని జిమ్‌కు ఆదివారం ఉదయం ఎన్టీఆర్ పేరు పెట్టారు. టీడీపీ హయాంలో భవనం నిర్మించి జిమ్ ఏర్పాటు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దానికి వైఎస్‌ఆర్ పేరు పెట్టారు. ఇవాళ టీడీపీ శ్రేణులు భవనం వద్ద శిలాఫలకం, వైఎస్ఆర్ పేరును తొలిగించి ఎన్టీఆర్ అక్షరాలను ఏర్పాటు చేశారు.

News June 9, 2024

తొలిసారి ఎన్నికై.. కేంద్ర మంత్రిగా పెమ్మసాని.?

image

గుంటూరు MPగా ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్‌ కేంద్ర సహాయ మంత్రిగా ఆదివారం దిల్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిసింది. కేంద్రంలో ఏర్పాటు కానున్న NDA ప్రభుత్వంలో TDP, జనసేన కూడా భాగస్వామ్యం కావాలని తీసుకున్న నిర్ణయంతో పెమ్మసానికి తొలి జాబితా లో స్థానం దక్కినట్లు సమాచారం. పోటీ చేసిన తొలిసారే భారీ మెజార్టీతో గెలిచి, కేంద్ర మంత్రివర్గంలో పదవి దక్కించుకోవడం గ్రేట్ అని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

News June 9, 2024

గుంటూరు నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు

image

అరుణాచలంలో జూన్ 22న పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షణ మహోత్సవాలకు గుంటూరు 2 డిపో నుంచి స్పెషల్ బస్ ఏర్పాటు చేశామని DM అబ్దుల్ సలాం శనివారం తెలిపారు. ఈ బస్ జూన్ 20న రాత్రి గుంటూరులో బయలు దేరి, 21న శ్రీకాళహస్తి, కాణిపాకం, 22న ఉదయం అరుణాచలం చేరుతుందన్నారు. స్వామిని దర్శించుకుని 22వ తారీకు సాయంత్రం అరుణాచలంలో బయలు దేరి 23 ఉదయం గుంటూరు చేరుకుంటారన్నారు.

News June 8, 2024

బాపట్ల ప్రమాద ఘటనలో.. గాయాలైన వ్యక్తి మృతి

image

బాపట్ల- గుంటూరు రహదారిలో నేటి ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ<<13403251>> యువకుడు మృతి చెందాడు. <<>>బాపట్ల రూరల్ సీఐ శ్రీహరి తెలిపిన వివరాల ప్రకారం.. అంకమ్మరావు అనే యువకుడు కొత్త బైక్ కొనడానికి పొన్నూరు వెళ్తుండగా స్నేహితుడు బైక్ నడుపుతూ చెట్టును ఢీకొన్నాడు. ఈ ఘటనలో వెనక కూర్చున్న అంకమ్మరావుకు తీవ్ర గాయాలు కాగా వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారన్నారు.

News June 8, 2024

గుంటూరు జిల్లాలో క్రాస్ ఓటింగ్

image

గుంటూరు లోక్‌సభ నియోజకవర్గంలో క్రాస్ ఓటింగ్ జరిగింది. ఈ స్థానం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, కిలారి రోశయ్య బరిలో నిలవగా.. పెమ్మసాని 2,82,085 ఓట్ల మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాలు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో NDA ఎమ్మెల్యే అభ్యర్థుల(857213) కంటే.. ఎంపీ అభ్యర్థికి(864948) ఓట్లు ఎక్కువగా వచ్చాయి. మంగళగిరిలో రెండింటి మధ్య 4775 ఓట్ల వ్యత్యాసం కనిపించింది.

News June 8, 2024

రామోజీరావు మరణం తీరని లోటు: మోహన్ శ్యామ్ ప్రసాద్

image

రామోజీ సంస్థల అధినేత, ఈనాడు పత్రిక వ్యవస్థాపకుడు రామోజీరావు ఆకస్మిక మరణం పత్రికా రంగానికి తీరని లోటని తెలుగు బ్రాండ్ తెనాలి డబుల్ హార్స్ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. మీడియాతో పాటు వివిధ రంగాల్లో రామోజీ సేవలు మరువలేనివి అని తెలిపారు. ఈ సందర్భంగా రామోజీరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.