Guntur

News October 2, 2025

ప్రజలకు భరోసా కల్పించేలా పోలీస్ శాఖ పనిచేయాలి: ఎస్పీ

image

ప్రజలకు భరోసా కల్పించే విధంగా పోలీస్ శాఖ పనిచేయాలని గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. డీపీఓలో బుధవారం తెనాలి, సౌత్ పోలీస్ సబ్-డివిజన్ల పనితీరుపై ఎస్పీ సమీక్ష నిర్వహించారు. PS పరిధిలోని స్థితిగతులపై ఆయన ఆరా తీశారు. నేరాల నియంత్రణ కోసం దృఢమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని, ముఖ్యంగా రౌడీషీటర్లపై నిఘా పెంచాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో తెనాలి DSP జనార్థన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

News October 1, 2025

GNT: నిబంధనలు పాటించని 19 ఆర్.ఓ. ప్లాంట్లు సీజ్

image

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో నిబంధనలు పాటించని 19 ఆర్.ఓ. ప్లాంట్లను తాత్కాలికంగా సీజ్ చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి నాగ సాయి కుమార్ తెలిపారు. బుధవారం తెనాలి మండలం (బుర్రిపాలెం, గుడివాడ), తుళ్లూరు మండలం (అనంతవరం, తుళ్లూరు, లింగయపాలెం)లలో అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించని ఆర్.ఓ. ప్లాంట్లను తాత్కాలికంగా సీజ్ చేసి, నోటీసులు అందిస్తున్నట్లు డీపీఓ వెల్లడించారు.

News October 1, 2025

GNT: ‘గెలుపు ఒక వాక్యం, ఓటమి ఒక పాఠశాల’

image

క్రీడాకారులకు గెలుపు ఒక వాక్యం లాంటిదని, అయితే ఓటమి అనేది ఒక పాఠశాల వంటిదని విజ్ఞాన్ విద్యాసంస్థల ఛైర్మన్ లావు రత్తయ్య అన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సహకారంతో వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో నిర్వహించిన 62వ నేషనల్ ఛాంపియన్‌షిప్ పోటీలు బుధవారం ఘనంగా ముగిశాయి. చదరంగం బోర్డుపై ఆడే ఈ ఆటలో ప్రతి కదలిక ఒక ఆలోచన, ప్రతి తప్పు ఒక పాఠం, ప్రతి విజయం ఒక క్షణిక ఆనందమని ఆయన అన్నారు.

News October 1, 2025

మలేసియా బృందానికి స్వాగతం పలికిన సీఆర్డీఏ అధికారులు 

image

రాజధాని అమరావతిలో అక్టోబర్ 1 నుంచి 5 వరకు ఐదు రోజుల పాటు పర్యటించేందుకు మలేసియా బృందం అమరావతికి చేరుకుంది. బృందంలోని సభ్యులైన మలేసియాలోని క్లాంగ్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు వైబి తువాన్ గణపతిరావు వీరమన్, మలేసియా-ఆంధ్ర బిజినెస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి సతీశరావు వేంకటేశలం బుధవారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. CRDA అడిషనల్ కమిషనర్ అమిలినేని భార్గవ్ తేజ వారికి స్వాగతం పలికారు.

News October 1, 2025

గుంటూరు: పిస్టల్ షూటింగ్‌లో ముఖేశ్‌కు స్వర్ణం

image

షూటింగ్ పోటీలలో వరుస పతకాలతో గుంటూరు క్రీడా కారుడు ముఖేశ్ దూసుకుపోతున్నాడు. జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్ పోటీలలో బుధవారం ముఖేశ్ స్వర్ణ పతకంతో మెరిశాడు. SEP 24 నుంచి ఢిల్లీలోని కర్ణిసింగ్ షూటింగ్ రేంజ్‌లో ISSF వరల్డ్ కప్ షూటింగ్ పోటీలు జరుగుతున్నాయి. 25మీటర్ల పిస్టల్ జూనియర్ మెన్ విభాగంలో ర్యాపిడ్ ఫైర్ స్టేజిలో 296/300 స్కోర్‌తో మొత్తం 585/600 పాయింట్లు సాధించి ముఖేశ్ గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు.

News October 1, 2025

మంగళగిరిలో పింఛన్ పంపిణీ చేసిన కలెక్టర్

image

మంగళగిరిలోని టిడ్కో కాలనీలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను కలెక్టర్ తమీమ్ అన్సారియా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె లబ్ధిదారులతో నేరుగా ముఖాముఖి మాట్లాడారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ భరోసాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో మొత్తం 2,56,904 మంది పింఛన్ దారులకు రూ. 111.34 కోట్లు పంపిణీ జరుగుతుందని తెలిపారు. నేడు పింఛన్లు తీసుకోలేని వారికి శుక్రవారం పంపిణీ చేస్తారని వివరించారు.

News October 1, 2025

గుంటూరు–పల్నాడులో కొత్త ఉపాధ్యాయులకు శిక్షణ కేంద్రాలు

image

మెగా డీఎస్సీలో ఎంపికైన 1,600 మంది ఉపాధ్యాయులకు గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఐదు కేంద్రాల్లో ఈ నెల 3 నుంచి 10 వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. నియామక పత్రాలు పొందిన అభ్యర్థులు తప్పనిసరిగా హాజరుకావాలని డీఈఓ రేణుక మంగళవారం స్పష్టం చేశారు. నరసరావుపేట, వినుకొండ, గుంటూరు కేంద్రాల్లో భిన్న విభాగాల వారీగా బోధనా నైపుణ్యాలు, విద్యా విధానాలు, చట్టాలు, సాంకేతికతపై శిక్షణ ఇవ్వనున్నారు.

News October 1, 2025

నేడే గుంటూరు జిల్లాలో పెన్షన్ల పంపిణీ: కలెక్టర్

image

గుంటూరు జిల్లాలో NTR భరోసా పెన్షన్ల పంపిణీ బుధవారం జరుగుతుందని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. జిల్లాలో 2,56,904 మంది కి రూ. 111.34 కోట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ మేరకు అన్నీ ఏర్పాట్లు చేయాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులు, మెప్మా, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, గ్రామ వార్డు సచివాలయ అధికారులను ఆదేశించారు.

News September 30, 2025

గుంటూరు రైల్వే డివిజన్‌లో నీటి దాహం

image

ప్రయాణికుల సమస్యలను పట్టించుకోకుండా రైల్వే అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. బోర్డు నిబంధనల ప్రకారం ప్రతి 200 కి.మీ.లకు వాటరింగ్ స్టేషన్ తప్పనిసరి అయినా.. గుంటూరు డివిజన్‌లో ఎక్కడా సౌకర్యం లేదు. సికింద్రాబాద్‌ నుంచి గుంటూరు చేరేవరకు 274 కి.మీ.ల దూరం నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. నడికుడి వద్ద క్విక్ వాటరింగ్ ప్రతిపాదన కాగితాలకే పరిమితమైందని ప్రయాణికులు మండిపడుతున్నారు.

News September 30, 2025

గుంటూరు కలెక్టర్ పేరుపై ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్

image

తన పేరుపై వస్తున ఫేక్ అకౌంట్‌లు నమ్మవద్దని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. అధికారికంగా వినియోగంలో ఉన్న ఏకైక ఫేస్‌ బుక్ పేజీ “District Collector Guntur” మాత్రమే అని చెప్పారు. ఇది తప్ప మరే ఇతర ఫేస్‌ బుక్ అకౌంట్‌లు కలెక్టర్‌కు సంబంధించినవి కావని తెలిపారు. ప్రస్తుతం “DC (District Collector Guntur)” అనే పేరుతో నకిలీ ఫేస్‌ బుక్ అకౌంట్ గుర్తించబడింది, జిల్లా ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరారు.