Guntur

News August 31, 2024

నిజాంపట్నం హార్బర్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక

image

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల నిజాంపట్నం హార్బర్ లో మూడవ నంబర్ ప్రమాదవ సూచిక ఎగురవేసినట్లు ఇన్‌ఛార్జ్ పోర్టు కన్జర్వేటర్ మోకా రామారావు శనివారం తెలిపారు. దీని ప్రభావం వల్ల సముద్రంలో బోట్లు వేటకు వెళ్ళరాదని ఒకవేళ ఎవరైనా వేటకు వెళ్లిన యెడల తీరానికి చేరాలని ఆయన తెలియజేశారు. వాయుగుండం తీరం దాటే సమయంలో ఈదురు గాలులు బలంగా వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దన్నారు.

News August 31, 2024

పల్నాడు జిల్లాలో యువకుడి హత్య?

image

చిలకలూరిపేట పట్టణంలోని పెదనందిపాడు రోడ్డులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తున్న వసంతరావు (35) ఉదయం డ్యూటీకి వచ్చి ఆసుపత్రి గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే మృతుడి బందువులు మాత్రం ఎవరో చంపి ఉరి వేశారని ఆందోళనకు దిగారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 31, 2024

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనగాని

image

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసరం అయితే తప్పించి ఎవరూ బయటకు రావొద్దన్నారు. జలమయమైన లోతట్టు ప్రాంతాల్లో రోడ్డు, రవాణా, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడకుండా రెవెన్యూ, యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News August 31, 2024

రాష్ట్రంలో భారీ వర్షాలు.. అధికారులతో సీఎం సమీక్ష

image

రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలపై CM చంద్రబాబు సమీక్ష చేశారు. పలు జిల్లాల్లో, పలు పట్టణాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పరిస్థితులపై సీఎం శనివారం ఉదయం అధికారులతో మాట్లాడారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించాలన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు తగు సూచనలు చేయాలని, అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

News August 31, 2024

గణేశ్ మండపాల అనుమతులకు ప్రత్యేక వెబ్ సైట్: మంత్రి లోకేశ్

image

ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరగబోతున్న వినాయక చతుర్థి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని మంత్రి లోకేశ్ తెలిపారు. వినాయకచవితి సందర్భంగా ఏర్పాటు చేసుకునే గణేశ్ మండపాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతుల కోసం ప్రత్యేక వెబ్సైట్ రూపొందించామని చెప్పారు. https://ganeshutsav.net ద్వారా మండపాల ఏర్పాటుకు అనుమతులన్నీ సింగిల్ విండో విధానంలో ఇచ్చేలా చేశామని Xలో పోస్ట్ చేశారు.

News August 31, 2024

GNT: ప్రభుత్వ పథకాల అమలుకు ప్రత్యేక అధికారులు

image

జిల్లాల్లో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులుగా ఐఏఎస్ లను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల్లో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను అధికారుల సమన్వయంతో ప్రత్యేక అధికారులు నిర్వహించవలసి ఉంటుంది. గుంటూరుకు మల్లికార్జున, బాపట్లకు ఎంవి శేషగిరి బాబు, పల్నాడుకు రేఖ రాణిని ప్రభుత్వం నియమించింది.

News August 30, 2024

మాచర్లకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి

image

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురువారం సాయంత్రం మాచర్లకు వచ్చారు. పలు కేసుల్లో ఆయన నెల్లూరు జైలులో రిమాండ్‌లో ఉండి ఇటీవల బెయిల్‌పై బయటికి వచ్చిన విషయం తెలిసిందే. కాగా నరసరావుపేట ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఆయన తిరిగి కారులో హైదరాబాద్ వెళుతూ.. మాచర్లలోని తన ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో మాట్లాడి వెళ్లారు.

News August 30, 2024

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపుపై కీలక ప్రకటన

image

ల్యాండ్ పూలింగ్ ద్వారా రాజ‌ధానికి భూములిస్తున్న రైతుల‌కు ప్రాధాన్య‌త ప్ర‌కారం వారి గ్రామాల్లోనే తిరిగి ప్లాట్లు కేటాయించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని మంత్రి నారాయ‌ణ‌ వెల్లడించారు. వెలగపూడిలోని సచివాలయంలో CRDA అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ఖ‌జానాకు భార‌మైనా ల‌బ్ధిదారుల కోసం హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ పూర్తికి సీఎం అంగీకారం తెలిపారన్నారు.

News August 29, 2024

గుంటూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

గుంటూరు డీఎంహెచ్‌వో ఆఫీస్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. స్థానికులు వెంటనే నగరంపాలెం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పరిశీలించి జీజీహెచ్ మార్చురికీ తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నగరంపాలెం పోలీస్ కానిస్టేబుల్ రమేశ్ తెలిపారు.

News August 29, 2024

ఆర్భాటాలకు దూరంగా సీఎం సభ: కలెక్టర్

image

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు హంగు, ఆర్భాటాలు లేకుండా నరసరావుపేటలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశామని పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు వెల్లడించారు. కేవలం ఐదారు వేల లోపు స్థానిక ప్రజానీకం మధ్య వన మహోత్సవం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. సీఎం ఆదేశాల మేరకు పరిమిత సంఖ్యలో పోలీసు బలగాలను కేటాయించామని.. కానీ భద్రత విషయంలో రాజీ లేదన్నారు.