India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అగ్నివీర్ వాయు భారత సైన్యంలోకి చేరడానికి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భారత వైమానిక దళం అధికారి సందీప్ తెలిపారు. అగ్నివీర్ వాయు అనుబంధ శాఖల అధికారులతో శనివారం బాపట్ల కలెక్టరేట్లో శనివారం ఆయన సమావేశం నిర్వహించారు. భారత సైన్యంలోకి యువకులు చేరడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని చెప్పారు. ఆసక్తి గలవారు ఈ నెల 8 నుంచి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
విభజన హామీలు, ఇతర పెండింగ్ అంశాల కోసం హైదరాబాద్లోని ప్రజాభవన్లో కాసేపట్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో సహచర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేశ్లతో అనగాని సత్యప్రసాద్ భేటీ అయ్యారు. IAS అధికారి ప్రేమ్ చంద్రారెడ్డితో కలిసి పలు అంశాలపై చర్చించారు.
బాపట్ల జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. శనివారం కలెక్టరేట్లో అధికారులతో నూతన ఇసుక విధానంపై సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతన ఇసుక విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. అక్రమంగా ఇసుక తరలించే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
తాడేపల్లి డీజీపీ ఆఫీసు సమీపంలో వడ్డేశ్వరం బైపాస్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తిని లారీ ఢీకొంది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే మృతుడు ఆత్మహత్య చేసుకోవడానికే లారీ కింద పడ్డాడని పలువురు తెలిపారు. మరోవైపు లారీని ఎంత కంట్రోల్ చేసినా ఆగలేదని డ్రైవర్ చెప్పారు. పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడు వడ్డేశ్వరం వాసిగా భావిస్తున్నారు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్ని ఆస్తులు దోపిడీ చేశాడో ఎంత గ్రానైట్ తరలించాడో చర్చిద్దామా అని MLA జూలకంటి బ్రహ్మారెడ్డి మాజీ CM జగన్కు సవాల్ విసిరారు. శుక్రవారం మాచర్లలోని TDP కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. జగన్ నెల్లూరు జైలులో పిన్నెల్లిని కలిసి, అనంతరం చేసిన ఆరోపణలపై స్పందించారు. పిన్నెల్లి అరాచకాలకు తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. అందుకే దమ్ముంటే తన సవాల్ని స్వీకరించాలని సూచించారు.
ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున పలు రైళ్లను రద్దు చేసినట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. ఆగస్టు 5 నుంచి 12వ తేదీ వరకు మాచర్ల-విజయవాడ (07782), వచ్చే నెల 5 నుంచి 10వ తేదీ వరకు విజయవాడ- గుంటూరు(07464), గుంటూరు-సికింద్రాబాద్ (17201), ఆగస్టు 4 నుంచి 10వ తేదీ వరకు నర్సాపూర్-గుంటూరు (07281), వచ్చే నెల 5 నుంచి 11వ తేదీ వరకు గుంటూరు- రేపల్లె (07784), రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
బాపట్ల పట్టణం భావపురి కాలనీకి చెందిన షేక్ రజ్జుబాషా అనే ఆర్మీ ఉద్యోగి విధి నిర్వహణలో<<13561701>> ఈనెల 4న గుండెపోటుతో మృతి చెందాడు.<<>> శనివారం తెల్లవారుజామున బాపట్ల పట్టణంలోని భావపూరి కాలనీలోని స్వగృహానికి విర జవాన్ భౌతికయాన్ని తీసుకువచ్చారు. పట్టణానికి చెందిన పలువురు మాజీ సైనికులు, నాయకులు, అధికారులు అక్కడికి చేరుకుని నివాళులర్పిస్తున్నారు. అధికార లాంఛనాలతో అంతిమయాత్ర నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
తనను కలిసేందుకు వస్తున్న వారంతా పుష్పగుచ్ఛాలు, శాలువాలను తీసుకురావొద్దని మంత్రి నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. వాటికి బదులుగా నోటుపుస్తకాలు, డిక్షనరీలు, లైబ్రరీ పుస్తకాలు ఇస్తే ఎంతో సంతోషిస్తానని తెలిపారు. తన దగ్గరకు వచ్చేవారు ఏమీ తేవద్దని.. తేవాలని భావిస్తే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పనికొచ్చే పై వస్తువులను తీసుకురావాలని ఆయన కోరారు.
గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు సహా పలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పంట రుణాల కుంభకోణంపై జిల్లా యంత్రాంగం స్పందించింది. అవినీతి, అక్రమాలు వాస్తవమేనని జిల్లా అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు బాధ్యులపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకున్నామన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మి జిల్లా సహకార అధికారి వీరాచారిని ఆదేశించారు.
ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున పలు రైళ్లను రద్దు చేసినట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. ఆగస్టు 5 నుంచి 12వ తేదీ వరకు మాచర్ల-విజయవాడ (07782), వచ్చే నెల 5 నుంచి 10వ తేదీ వరకు విజయవాడ- గుంటూరు(07464), గుంటూరు-సికింద్రాబాద్ (17201), ఆగస్టు 4 నుంచి 10వ తేదీ వరకు నర్సాపూర్-గుంటూరు (07281), వచ్చే నెల 5 నుంచి 11వ తేదీ వరకు గుంటూరు- రేపల్లె (07784), రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.