Guntur

News August 19, 2024

అన్న క్యాంటీన్‌కు రూ.కోటి విరాళం

image

రాష్ట్రంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం చంద్రబాబు చేపడుతున్న కార్యక్రమాలతో ప్రేరణ పొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కో ఆర్డినేటర్ లోషిత్ అన్న క్యాంటీన్ల నిర్వహణకు రూ.కోటి విరాళం అందజేశారు. ఉండవల్లి నివాసంలో సోమవారం మంత్రి లోకేశ్‌కు ఈ మేరకు రూ.కోటి చెక్కును అందించారు. ఈ సందర్భంగా మంత్రి లోహిత్‌ను అభినందించారు. 

News August 19, 2024

నరసరావుపేట: ‘గడువులోగా సమస్యలను పరిష్కరించాలి’

image

ఫిర్యాదు దారుని సమస్యల పట్ల శ్రద్ధ వహించి వారి సమస్యలను గడువులోగా పరిష్కరించాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ తదితర సమస్యల పరిష్కారం కోసం ప్రజలు వినతి పత్రాలను అందజేశారు. వాటిని వెంటనే పరిష్కరించాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.

News August 19, 2024

బాపట్ల: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 36 ఫిర్యాదులు

image

బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి 36 ఫిర్యాదులు అందాయన్నారు. ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించి బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

News August 19, 2024

ప్రతి రూపాయి బాధ్యతతో ఖర్చు పెట్టాలి: పవన్ కళ్యాణ్

image

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర సచివాలయం నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పథకం పరిధిలో 46 రకాలైన పనులు చేపట్టవచ్చని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ పథకం ద్వారా రూ.వేల కోట్లు నిధులు వెచ్చిస్తున్నామని, ప్రతి రూపాయిని బాధ్యతతో ఖర్చు చేయాలన్నారు.

News August 19, 2024

ఫొటోగ్రఫీ డే.. కెమెరామేన్‌ అవతారమెత్తిన సీఎం

image

వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా సీఎం చంద్రబాబు ఫొటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో వివిధ పత్రికల్లో పనిచేస్తున్న ఫొటో జర్నలిస్టులు సీఎంను కలిశారు. అనంతరం చంద్రబాబు వారి చేతిలో కెమెరా తీసుకుని ఫొటోలు క్లిక్ మనిపించారు. మీడియాలో ఉంటూ వివిధ కార్యక్రమాల ఫొటోలను తీయడం చాలా కష్టతరమని సీఎం వ్యాఖ్యానించారు.

News August 19, 2024

గుంటూరు: 21న జిల్లా అథ్లెటిక్ జట్ల ఎంపిక

image

అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో అండర్ -14, 16 బాలబాలికలు, అండర్-18, 20 యువతీ, యువకుల జిల్లా స్థాయి అథ్లెట్ల ఎంపిక నిర్వహిస్తామని ప్రధాన కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ తెలిపారు. ఈ పోటీలు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ నెల 21న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికైన వారిని సెప్టెంబరు 14 నుంచి 16వ తేదీ వరకు ఏఎన్ యూలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు.

News August 19, 2024

పల్నాడు జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం

image

పిడుగురాళ్లలో ఆదివారం అర్ధరాత్రి దాటాక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బైకు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. పిడుగురాళ్లకు చెందిన మారురి నాగతేజారెడ్డి(25), ఇందూ (30), అమూల్య (15)లు గురజాలలో వివాహానికి ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరిగి వస్తున్నారు. టోల్ ప్లాజా సమీపంలోకి రాగానే రోడ్డుపై ఆగి ఉన్న లారీని బైకు ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. 

News August 19, 2024

నగరాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి: పెమ్మసాని

image

గుంటూరు నగరాభివృద్ధిపై పూర్తి దృష్టి సారించాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం స్థానిక ఎంపీ క్యాంప్ కార్యాలయంలో పెమ్మసానిని కమిషనర్ పులి శ్రీనివాసులు కలిశారు. ఈ సందర్భంగా రోడ్ల ప్యాచ్ వర్క్‌లు, శానిటేషన్ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలన్నారు. కార్పొరేషన్‌‌పై పడుతున్న రెవెన్యూ భారాన్ని తగ్గించి, జీఎంసీకి రావాల్సిన ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలని కమిషనర్‌కు సూచించారు.

News August 18, 2024

గుంటూరు: TODAY TOP NEWS

image

* గుంటూరు: ప్రేమ పేరుతో మోసం చేసిన బాలుడు
* గుంటూరు: 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు
* అమరావతికి రూ.15వేల కోట్ల అప్పునకు ప్రపంచ బ్యాంకు ఓకే!
* గుంటూరు శాస్త్రవేత్తకు నాసా అవార్డు
* గుంటూరులో 198 బైకులు సీజ్
* పల్నాడులో సినిమా షూటింగ్ సందడి
* ‘మంగళగిరి స్టేడియం సంవత్సరంలో పూర్తి చేస్తాం’

News August 18, 2024

‘నేరాల కట్టడికి ముందస్తు సమాచారం కీలకం’

image

నేరాల కట్టడికి ముందస్తు సమాచారం సేకరించడం కీలకమని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఆదివారం ఆయన బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్‌బీ అధికారులతో సమావేశం నిర్వహించారు. పోలీస్ శాఖకు ఎస్‌బీ విభాగం కళ్ల, చెవులు వంటిదన్నారు. గంజాయి ఇతర మాదక ద్రవ్యాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌బీ ఇన్‌ఛార్జ్ సీఐ బాల మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.