India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద బాబు విజయం సాధించారు. ఆయన తన ప్రత్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై గెలిచారు. 18 రౌండ్లు పూర్తి అయ్యేసరికి, 22 వేల + ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలుపొందారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ విజయం సాధించారు. మొత్తం 19 రౌండ్లు ముగిసే సరికి ఆయనకు 20,480 ఓట్ల మెజారిటీ వచ్చింది. ప్రవీణ్.. తొలి రౌండ్ నుంచి ఆధిపత్యం కొనసాగిస్తూ వచ్చారు. భాష్యం ప్రవీణ్ గెలుపుతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
బాపట్లలో టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మ విజయం సాధించారు. ఆయన మొత్తం 15 రౌండ్లు ముగిసేసరికి 26,800 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. ఆయనకు 88,827 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి కోన రఘుపతికి 62,027 ఓట్లు నమోదయ్యాయి. 1999 తరువాత 2024లో బాపట్లలో టీడీపీ జెండా ఎగరవేశారు. నరేంద్ర మొదటి రౌండ్ నుంచి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించారు.
సత్తెనపల్లిలో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ విజయం సాధించారు. 19 రౌండ్లు పూర్తి అయ్యేసరికి ఆయన.. అంబటి రాంబాబుపై 25,950 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ మరో రౌండ్ ఓట్ల లెక్కింపు మిగిలి ఉండగా, లెక్కించాల్సిన ఓట్లు మెజారిటీ కంటే తక్కువగా ఉన్నాయి. దీంతో కన్నా గెలుపు ఖాయమైంది. నియోజకవర్గ టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి మహమ్మద్ నజీర్ విజయం సాధించారు. ఆయన తన ప్రత్యర్థి నూరి ఫాతిమాపై గెలుపొందారు. మొత్తం 19 రౌండ్లు పూర్తయ్యే సరికి ఆయనకు 99,163 ఓట్లు, నూరీ ఫాతిమాకు 67,812 ఓట్లు వచ్చాయి. దీంతో నజీర్ 31,351 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో నియోజకవర్గ ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ భారీ ఓట్ల మెజారిటీ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం 18వ రౌండ్ ముగిసేసరికి ఆయన 47,362 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. నాదెండ్లకు 1,13,596 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్కు 66,234 ఓట్లు నమోదయ్యాయి. మిగతా 2 రౌండ్లలో కూడా మనోహర్ ఆధిక్యం ప్రదర్శిస్తే, పవన్ లాగా 50వేల ఓట్ల మెజారిటీ సాధించే అవకాశం ఉంది.
గుంటూరు జిల్లాలో టీడీపీ ఎంపీ అభ్యర్థి డా. పెమ్మసాని చంద్రశేఖర్ రికార్డులు బ్రేక్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన 195189 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఆయనకు ఇప్పటి వరకు 344736 ఓట్లు నమోదయ్యాయి. వైసీపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య 2,32,467 ఓట్లు నమోదయ్యాయి. కాగా గుంటూరు ఎంపీ పరిధిలో అన్ని నియోజకవర్గాలలో కూటమి స్పష్టమైన మెజారిటీ రావడంలో ఆయన పాత్ర ప్రత్యేకమైనది.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్పష్టమైన మెజారిటీ దూసుకెళ్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లో టీడీపీ ముందంజలో ఉంది. అలాగే తెనాలిలో జనసేన ముందంజలో ఉంది. అలాగే మూడు ఎంపీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నిరుత్సాహంతో మునిగిపోయారు.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మంగళవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జరుగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పరిశీలిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్లు, ఈవీఎంల ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఉద్యోగుల పనితీరును పరిశీలించారు. అసెంబ్లీ నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు, ఓట్ల వివరాలు నమోదుకు సంబంధించి అక్కడ ఉద్యోగులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు.
గుంటూరు టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. సమీప ప్రత్యర్థి కిలారి వెంకట రోశయ్యపై 19,207 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తాజా ఓట్ల లెక్కింపు ప్రకారం పెమ్మసానికి 41,909 ఓట్లు, వైసీపీ అభ్యర్థి రోశయ్యకు 22,702 ఓట్లు వచ్చాయి.
Sorry, no posts matched your criteria.