India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాజీ మంత్రి విడదల రజని మరిది గోపి, పీఏ రామకృష్ణపై పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతికి యడ్లపాడు స్టోన్ క్రషర్ వ్యాపారులు ఫిర్యాదు చేశారు. 2020లో స్టోన్ క్రషర్ వ్యాపారులను రూ.5కోట్లు లంచం ఇవ్వాలని పీఏ రామకృష్ణ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చివరికి రామకృష్ణకి రూ.2కోట్లు, రజని మరిది గోపి, ఓ పోలీస్ అధికారికి చెరో రూ.10లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలోని వైద్య అధికారులతో కేంద్రమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ క్యాజువాలిటీ, ఎంఆర్ఐ, ఐసీయూ విభాగాలను ఆయన పరిశీలించి, రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, గళ్లా మాధవి, మహమ్మద్ నసీర్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి బాధాకరమని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శ్రీనివాస్ చెరగని ముద్రవేశారని మంత్రి గుర్తు చేసుకున్నారు. ధర్మపురి శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు లోకేశ్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా శుక్రవారం గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ మంగళగిరి టీడీపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని ఉండవల్లిలో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. పల్లా శ్రీనివాసరావు సమర్థ నాయకత్వంలో పార్టీ మరెన్నో విజయాలను సాధిస్తుందని, మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ తుషార్ డూడి పోలీస్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సిబ్బంది తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది తమ అనారోగ్య సమస్యలను వ్యక్తిగత సమస్యలను ఎస్పీకి వివరించగా సిబ్బంది సమస్యలను పరిగణలోకి తీసుకొని, వారికి సాధ్యమైనంత మేర సమస్యల పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుతో పల్నాడులో ప్రశాంత వాతావరణం ఏర్పడిందని పెదకూరపాడు శాసనసభ్యుడు భాష్యం ప్రవీణ్ చెప్పారు. శుక్రవారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గడిచిన ఐదేళ్లలో దాడులు, దౌర్జన్యాలకు పల్నాడు జిల్లా కేరాఫ్గా మారిందన్నారు. చట్టం నుంచి నేరస్తులు తప్పించుకోలేరని పిన్నెల్లి విషయంలో రుజువైందన్నారు. 14 కేసులలో పిన్నెల్లి దోషిగా ఉన్నారన్నారు.
హిందూపురం ఎంపీ బి.కే పార్థసారథిని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి శుక్రవారం గుంటూరులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై ఆమె ఎంపీతో చర్చించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎంపీ గల్లా మాధవికి సూచించారు. ఈ కార్యక్రమంలో గల్లా రామచంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.
వ్యాపారవేత్త, దాక్షిణ్య సంస్థ వ్యవస్థాపకుడు, వైసీపీ నేత డాక్టర్ టీవీ రావు శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు ఆయన మీడియాకు వివరించారు. ఏపీ స్టేట్ గ్రూప్ వన్ అధికారిగా పని చేసిన ఆయన స్వచ్ఛంద పదవి విరమణ చేసి తెలుగుదేశం పార్టీ తరఫున 2004 గుంటూరు పశ్చిమ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆపై వైసీపీలో చేరి, తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేశారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాకు తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ శుక్రవారం తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం క్రమంగా అల్పపీడనంగా మారి 72 గంటల్లో ఏపీ వైపు కదులుతుంది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేసింది.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయి నెల్లూరు జైలులో ఉన్న విషయం తెలిసిందే. కాగా, అతని తమ్ముడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఎక్కడనే అంశంపై పల్నాడులో చర్చ జరుగుతోంది. మాచర్ల రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన వెంకట్రామిరెడ్డి మే 22 నుంచి పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడితో పాటు పిన్నెల్లి అనుచరుడు కిశోర్ జాడ కూడా కొద్ది రోజులుగా తెలియలేదని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.
Sorry, no posts matched your criteria.