India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి రెండు రోజులు సెలవులు ప్రకటించినట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కరుణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. యూనివర్సిటీలో 2024 సార్వత్రిక ఎన్నికల సంబంధించి ఓట్లలెక్కింపు ఉన్న నేపథ్యంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాజశేఖర్ ఆదేశాల మేరకు సెలవులు కేటాయించినట్లు పేర్కొన్నారు. వర్సిటీలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ నెల 3,4 (సోమ, మంగళవారాలు) తేదీల్లో సెలవులు కేటాయించినట్లు చెప్పారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 సీట్లకు గానూ, NDA కూటమి 11-12 సీట్లు గెలుస్తుందని బిగ్ టీవీ సర్వే తెలిపింది. 5-6 సీట్లు వైసీపీ సాధిస్తుందని అంచనా వేసింది. మొత్తం మీద 175 అసెంబ్లీ సీట్లకు గాను 106- 119 కూటమి, 56- 69 సీట్లు వైసీపీ విజయం సాధిస్తుందని వెల్లడించింది.
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 17 అసెంబ్లీ స్థానాల్లో కూటమి 15 నుంచి 14 స్థానాల్లో, వైసీపీ 2-3 స్థానాల్లో విజయం సాధిస్తుందని పోస్ట్పోల్ సర్వే తెలిపింది. మరోవైపు జిల్లాలోని గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంట్ స్థానంలో టీడీపీ గెలవనున్నట్లు చాణక్య ఎక్స్ PR సర్వే పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి చాణక్య స్ట్రాటజీస్ సర్వే ఫలితాలు వెల్లడించింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 స్థానాలకు గానూ కూటమికి 13, వైసీపీ 3 చోట్ల విజయం సాధించనుండగా.. ఒక చోట టఫ్ ఫైట్ ఉండనుందని పేర్కొంది. కాగా జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ సర్వేపై మీ COMMENT.
ఉమ్మడి గుంటూరులో జిల్లాలోని 17 సీట్లలో వైసీపీ ఖాతా తెరిచే అవకాశం లేదని కేకే సర్వే పేర్కొంది. టీడీపీకి 16 సీట్లు వస్తాయని చెప్పింది. జనసేనకు 1 సీటు వస్తుందని పేర్కొంది. మంత్రులుగా చేస్తున్న రజిని, అంబటి రాంబాబు గెలుపు అవకాశాలు తక్కువని స్పష్టం చేసింది. ఈ ఎగ్జిట్ పోల్పై మీ COMMENT.
మంగళగిరిలో నారా లోకేశ్ గెలుస్తారని ఆరా మస్తాన్ సర్వే వెల్లడించింది. మరోవైపు, గుంటూరు వెస్ట్లో మంత్రి విడదల రజిని స్వల్ప తేడాతో ఓడిపోతారని పేర్కొంది. జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ తెనాలిలో విజయం సాధిస్తారని సర్వే వివరించింది. సత్తెనపల్లిలో అంబటి రాంబాబు గట్టి పోటీ ఎదుర్కొంటారని ఆరా మస్తాన్ సర్వే స్పష్టం చేసింది.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి రెండు రోజులు సెలవులు ప్రకటించినట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కరుణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. యూనివర్సిటీలో 2024 సార్వత్రిక ఎన్నికల సంబంధించి ఓట్లలెక్కింపు ఉన్న నేపథ్యంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాజశేఖర్ ఆదేశాల మేరకు సెలవులు కేటాయించినట్లు పేర్కొన్నారు. వర్సిటీలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ నెల 3,4 (సోమ, మంగళవారాలు) తేదీల్లో సెలవులు కేటాయించినట్లు చెప్పారు.
దాచేపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు షేక్ మస్తాన్ వలిని ఉత్తర అమెరికా తెలుగు సంఘం సన్మానించింది. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న షేక్ మస్తాన్ వలీ గుంటూరులో జరిగిన సభలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడిగా మస్తాన్ వలి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం సభ్యులతో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద శనివారం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్లే ఓ ట్రావెల్ బస్సు లింగంగుంట్ల వద్ద కరెంట్ స్తంభాన్ని ఢీకొని పల్టీ కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ తాడేపల్లి మండలంలోని ఉండవల్లి నివాసానికి రానున్నారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ ముఖ్యనేతలతో భేటీ కానున్నట్లు సమాచారం. మరోవైపు, జనసేన అధినేత పవన్ కల్యాణ్తోనూ చంద్రబాబు భేటీ అవుతారని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
Sorry, no posts matched your criteria.