India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. గుంటూరు జిల్లాలో మొత్తం 4,283 మంది పరీక్షలు రాయగా.. 3,044 మంది పాసయ్యారు. పాసైన వారిలో బాలురు 1878 మంది, బాలికలు 1166 మంది ఉన్నారు. 71.07% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో గుంటూరు జిల్లా 13వ స్థానంలో నిలిచింది.
వినుకొండ మండలంలోని శివాపురం వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఫోర్ విల్ ఆటో- ద్విచక్ర వాహనం ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మీరావలి అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. నాసర్ అనే మరో యువకుడికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. గుంటూరు జిల్లాలో మొత్తం 4,283 మంది పరీక్షలు రాయగా.. 3,044 మంది పాసయ్యారు. పాసైన వారిలో బాలురు 1878 మంది, బాలికలు 1166 మంది ఉన్నారు. 71.07% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో గుంటూరు జిల్లా 13వ స్థానంలో నిలిచింది.
కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన నాగలక్ష్మి బుధవారం తన కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో వేరు వేరుగా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, అభివృద్ధి పనులు తదితర వివరాలను అందివ్వాలని వైద్యశాఖ అధికారులను, నకిలీ విత్తనాలు, ఎరువులు అరికట్టడానికి చేపట్టిన చర్యలపై నివేదికలు ఇవ్వాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన నాగలక్ష్మి సెల్వరాజన్ బుధవారం ఎస్పీ తుషార్ కలిసి పుష్ప గుచ్చం అందించి అభినందనలు తెలిపారు. అనంతరం జాయింట్ కలెక్టర్ రాజకుమారి, తెనాలి సబ్ కలెక్టర్ ప్రభాకర్ జైన్, జిల్లా రెవెన్యూ డివిజన్ అధికారి రోజా, జిల్లాలోని ఇతర అధికారులు నూతన కలెక్టర్ నాగలక్ష్మికి బొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
విరోచనాలు, వాంతులతో బాధపడుతూ.. 40 మందికిపైగా బాధితులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి రావడం కలకలం రేపింది. మూడు రోజులుగా నగరానికి చెందిన వారే కాకుండా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వివిధ పట్టణాల నుంచి నీళ్ల విరేచనాలతో ఇబ్బంది పడుతూ.. వచ్చిన రోగులు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. బాధితులందరిని ప్రత్యేక ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ తెలిపారు.
ఇంటర్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలు బుధవారం విడుదల అయ్యాయి. గుంటూరు జిల్లా నుంచి మెత్తం 5,097 మంది పరీక్ష రాయగా 2,433 మంది(48శాతం)ఉత్తీర్ణత సాధించారు. కాగా గుంటూరు జిల్లా ఈ ఫలితాలలో రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది.
యువత కోసం గుంటూరులోని హిందూ ఫార్మసీ కళాశాల అమరావతి రోడ్డులో ఈనెల 28వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రఘు బుధవారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో 30 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయన్నారు. 18 నుంచి 30 సంవత్సరాలలోపు వయసు కలిగిన వారు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్హత కలిగిన వారు అర్హులని చెప్పారు.
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజల నుంచి పద్మ పురస్కారాలు-2025 సంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుందని ఉమ్మడి గుంటూరు స్టెప్ సీఈవో కె. వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సాంఘిక సేవా కార్యక్రమాలు, సైన్స్ రంగాల్లో విశేష కృషి, సాధించిన ప్రగతిని తెలియజేస్తూ 800 పదాలు మించకుండా నివేదికను తయారుచేసి నిర్ణీత దరఖాస్తును ఆన్ లైన్ లో సమర్పించాలన్నారు.
గుంటూరు జిల్లా నూతన కలెక్టర్గా బుధవారం ఎస్.నాగలక్ష్మి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం మంగళవారం తెలిపారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు నూతన కలెక్టర్గా ఆమె బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన బదిలీలలో గత కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని జీడీఎలో రిపోర్ట్ చేయాలని అధికారులు ఆదేశించిన విషయం విధితమే.
Sorry, no posts matched your criteria.