Guntur

News May 31, 2024

గుంటూరు: అగ్నివీర్ ఉద్యోగాలకు దరఖాస్తులు

image

అగ్నివీర్-వాయు ఉద్యోగాలకు ఆన్లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి గుంటూరు జిల్లా స్టెప్ సీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెంది పదో తరగతి విద్యార్హత కలిగిన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు agnipathvayu.cdac.in వెబ్సైట్ ద్వారా జూన్ 5లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. తాత్కాలిక అడ్మిట్ కార్డు పొందిన అభ్యర్థులు మాత్రమే రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొంటారన్నారు.

News May 31, 2024

గుంటూరు: కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం, 7 అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను గురువారం సాయంత్రం కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. ముందుగా కంట్రోల్ రూమ్ సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు పరిశీలించారు. కౌంటింగ్ ఏర్పాటుకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. కమిషనర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ రాజకుమారి ఉన్నారు.

News May 30, 2024

బాపట్ల: గల్లంతయిన నాలుగో వ్యక్తి మృతదేహం లభ్యం

image

మండలంలోని నాగరాజు కాలవలో బుధవారం గల్లంతు అయిన వారిలో నాలుగో వ్యక్తి మృతదేహం గురువారం లభ్యం అయింది. మండలంలోని మూలపాలెం గ్రామం వద్ద కాలవలో నాలుగో వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అధికారులు రెండు రోజులు పాటు కృషి చేసి 4 మృతదేహాలను వెలికి తీశారు.

News May 30, 2024

గుంటూరు: జూన్ 3 నుంచి మద్యం షాపులు మూసివేత

image

జూన్ 3 సాయంత్రం 6:00 నుంచి జిల్లాలోని మద్యం షాపులు మూసివేయాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా నిర్వహించడంలో భాగంగా జూన్ 3 సాయంత్రం 6:00 నుంచి ఓట్ల. లెక్కింపు జరిగే జూన్ 4వ తేదీ మద్యం దుకాణాలు మూసివేయాలని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. 

News May 30, 2024

బాపట్లలో నలుగురి గల్లంతు.. రంగంలోకి దిగిన NDRF బృందం

image

బాపట్ల జిల్లా నల్లమల వాగులో నలుగురు గల్లంతైన విషయం తెలిసిందే. అయితే 3 మృతదేహాలు లభ్యం కాగా <<13341655>>నాలుగో వ్యక్తి ఇంకా లభ్యం కాలేదు. <<>>ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆదేశాలతో తహసీల్దార్ శ్రవణ్ కుమార్, డీఎస్పీ మురళీకృష్ణ నేతృత్వంలో NDRF బృందం రంగంలోకి దిగింది. ఇప్పటికే బాపట్ల రూరల్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు ప్రత్యేక బోట్ల ద్వారా నాలుగో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

News May 30, 2024

గుంటూరు వెస్ట్ అసెంబ్లీలో 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు

image

ఓట్ల లెక్కింపునకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో కౌంటింగ్‌కు సంబంధించిన సాంకేతిక అంశాలను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. 94 నంబర్ గల గుంటూరు వెస్ట్ అసెంబ్లీ లో మొత్తం 282 పోలింగ్ బూత్‌లలో ఓటింగ్ జరిగింది. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో 21 రౌండ్‌లలో లెక్కించనున్నారు. రౌండ్‌ల వారీగా ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు ప్రకటించడానికి ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేసింది.

News May 30, 2024

బాపట్లలో నలుగురు గల్లంతు.. మూడో మృతదేహం లభ్యం

image

బాపట్ల మండలంలో బుధవారం గల్లంతైన వారిలో <<13339778>>మూడో మృతదేహం లభ్యమైంది.<<>> గురువారం ఉదయం బాపట్ల అగ్నిమాపక శాఖ అధికారి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది బోట్ల ద్వారా గాలింపు చర్యలు కొనసాగించారు. ఈ నేపథ్యంలో కాలువలో మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకు చేర్చారు. ఇప్పటికి మూడు మృతదేహాలు లభించగా మరో మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బుధవారం రెండు మృతదేహాలు లభ్యమైన సంగతి తెలిసిందే.

News May 30, 2024

కారంపూడిలో అర్ధరాత్రి వ్యక్తి దారుణ హత్య

image

ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన కారంపూడి మండలంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కారంపూడి మండలం పెద కొదమగుండ్ల గ్రామంలో చికెన్ కొట్టు నడుపుతున్న వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా గొంతు కోసి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 30, 2024

బాపట్ల: భవనం పైనుంచి పడి బాలుడి మృతి

image

చుండూరు మండలం ఆలపాడుకు చెందిన చేబ్రోలు సురేంద్ర (15) ఈనెల 20న స్నేహితులతో ఆడుకుంటూ.. స్థానికంగా ఉన్న ప్రాథమిక పాఠశాల భవనంపైకి ఎక్కాడని బంధువులు తెలిపారు. ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కింద గచ్చు మీద పడిపోయాడన్నారు. ఈ ప్రమాదంలో సురేంద్ర తలకు తీవ్ర గాయమవ్వగా.. గుంటూరులోని సర్వజన ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

News May 30, 2024

నాగార్జున యూనివర్సిటీకి జాతీయ ర్యాంక్

image

ది వీక్- హన్సా రీసెర్చ్ – బెస్ట్ యూనివర్సిటీ సర్వే – 2024 ర్యాంకింగ్స్ మల్టీడిస్సిప్లినరీ యూనివర్సిటీ కేటగిరిలో, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జాతీయ స్థాయిలో 16వ ర్యాంకును, రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకును కైవసం చేసుకుంది. విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది కృషి వల్లే ఈ ర్యాంకు సాధ్యమైందని వీసీ రాజశేఖర్ పేర్కొన్నారు. ఇటువంటి ర్యాంకుల ద్వారా విశ్వవిద్యాలయ కీర్తి మరింత ఉన్నత స్థాయికి చేరుతుందన్నారు.